Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ మౌనం దేనికి సంకేతం? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2021

ఈ మౌనం దేనికి సంకేతం?

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఉద్యమకాలంలో అధినేత ప్రవచనాలను విన్న జనం ఉర్రూతలూగారు. పెట్టుబడిదారీ విధాన పర్యవసానాలన్నింటికీ - అది అవిద్య అయినా, నిరుద్యోగమైనా, పేదరికమైనా - అన్నింటికీ రాష్ట్రావతరణే ఏకమూలికా ప్రయోగమని రాజకీయ 'ధన్వంతరి' చెపితే ఓట్లు రాలి, సీట్లు వచ్చాయి. అధికారం దఖలు పడింది. వలస పక్షుల కూడికతో 'పద్దు' నిండి పరిపూర్ణమైంది. విధానాల ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకుదారిచూపడం కంటే జంప్‌ జిలానీలతోనే తన బుట్ట నింపుకునే దగ్గరి మార్గాలను అధినేత వెతుక్కున్నాడు. సంపాదించుకునే మార్గాలు చూపితేనే కదా ఆ తక్కెడ్లోని కప్ప ఈ తక్కెడ్లోకి దూకేది! కేసీఆర్‌ సాబ్‌ అదే చేశాడు. కాబట్టి అలానే జరిగింది.
రాష్ట్ర ప్రయోజనాల స్థానంలో స్వ ప్రయోజనం, కుటుంబ ప్రయోజనం ముందుకొస్తే?! పైగా బీజేపీ కేంద్రంలో శతసహస్ర కోటీశ్వరుల దన్నుతో ఊడలేసి నిలబడున్న నేపథ్యంలో కేసీఆర్‌ 'ఆపక్కనుండాలో ఈ పక్కనుండాలో' తేల్చుకోవాలి. రెండు పడవల మీద ప్రయాణం అసాధ్యమనే సంగతి తెలీని అమాయకుడేం కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి! దుబ్బాకలో ఓటమి, జీహెచ్‌ఎంసీలో శృంగభంగం లాంటిది కాదు నేడు అధినేత ముందున్న పరీక్ష. భారీగా పెట్టకపోయినా కనీసం అన్నంతినే చెయ్యి విదిలిస్తే ఆ మెతుకులైనా ఏరుకుందామని బీజేపీ పాలకుల ముందు దేబిరిస్తే నిరుపయోగమనే విషయాన్ని రాష్ట్ర నేతలు ఎంత తొందరగా గుర్తిస్తే ఈ రాష్ట్రానికి అంత మంచింది. 2021-22 బడ్జెట్‌ రాష్ట్రానికి మొండిచేయి చూపిన తర్వాత దీని ప్రాధాన్యత ఇంకా పెరిగింది.
''అనుభవంలోకొస్తేనే తత్వం బోధపడుతుంద''నే గిరీశం డైలాగు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లెవేసి ఎక్కువ రోజులు కూడా కాలేదు. మన రాష్ట్రానికి సాయం చేస్తారన్న ఆశతో ఇంతకాలం కేంద్రపై యుద్ధం చేయలేదు. ఇక చూడండి మన తడఖా అని ఇటీవలే అన్న పెద్దమనిషి సర్వశ్రీ కేసీఆర్‌. మళ్ళీ ఏ బెదిరింపులొచ్చాయో, బ్లాక్‌ మెయిలే చేయబడ్డాడో తెలీదు కానీ, కళ్ళెదుటే ఇంత పెద్ద అన్యాయం జరుగుతూంటే అటు లోక్‌సభ, రాజ్యసభ నేతలు, ఇటు అధినేత, అటు ''బుల్లినేత'' మౌనం ఎందుకు వహిస్తున్నారు? తెలంగాణకి ద్రోహం చేస్తే డొక్క చింపుతామని, డోలుకడ్తామని గాండ్రించిన పెద్దలు మోడీ, అమిత్‌షాల ముందు మ్యావ్‌! మ్యావ్‌! మనడం వెనుక కథేమిటి!?
15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయకపోవడం వల్ల మన రాష్ట్రం రూ.723 కోట్లు నష్టపోయిందని కేంద్రానికి వినతిపత్రాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని కేసీఆర్‌కు ఎవరు చెప్పాలి? మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.900కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేలా కేసీఆర్‌ సర్కార్‌ కేంద్రంపై పోరాడదా? కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాకు మళ్ళీ గండికొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇది మన రాష్ట్ర ఖజానాకు మరింత భారం కానుంది. చివరికి కేసీఆర్‌కు ప్రియతమమైన, ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'కాళేశ్వరం' ప్రాజెక్టుకు జాతీయ హౌదా కూడ సాకారం కాలేదు. ఆ విధంగా భూసేకరణకు కాకుండా ఇతర నిధులు వస్తాయని పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. ఇంటింటికి నల్లా నీళ్ళు వస్తాయని ఊరించిన మిషన్‌ భగీరథ కోసం అడిగిన రూ.19వేల కోట్ల ఆర్థిక సహాయం ఇంతే సంగతులైంది. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్‌లో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ మోడీ సర్కార్‌ ప్రయివేటీకరణ హౌరులో ఎగిరిపోయాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బంగకు వేలకోట్ల రూపాయలు జాతీయ రహదారుల విస్తరణకు కేటాయించిన కేంద్ర బడ్జెట్‌ మన రాష్ట్రం ఊసే ఎత్తకపోవడంతో ఇది ఫక్తు రాజకీయ బడ్జెట్‌ అని చెప్పక తప్పదు. వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్‌లో కేంద్రం వాటా రూ.200 నుంచి వెయ్యికి పెంచాలన్న విజ్ఞప్తిని కూడా 2021-22 బడ్జెట్‌ పట్టించుకోలేదు.
రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యులు గత ఐదేండ్లుగా చేస్తున్న ఏ ఒక్క విజ్ఞప్తిని నేటి కేంద్ర బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకోలేదు! బీజేపీ స్పష్టంగానే ఉంది. తన కబంధ హస్తాలను దేశమంతటికి విస్తరించాలన్న కుతి ఆ పార్టీకి కనపడుతుంది. నిర్ణయించుకోవాల్సింది మనమే. అధినేత ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. పైగా ఇదే విధంగా అనేక రాష్ట్రాల ప్రయోజనాలకు కేంద్ర బీజేపీ పాలన నష్టం చేస్తోంది. కలిసొచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రపై వత్తిడి తెచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధం కావాలి. గుత్తపెట్టుబడి కనుసన్నల్లో రూపొందించబడి అమలు చేయబడే ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా రంగంలోకి దూకాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విలయం
ప్రభుత్వాలకు ఇది తగునా?
విభజన రాజకీయాల్లో బెంగాల్‌
ఈ ఆగడాన్ని తిప్పికొట్టాలి
తలొగ్గిన కేంద్రం
''ఉత్తుత్తి ఉత్సవం''
ఆశ
బలిదానాలొద్దు...
ఎన్నికలుంటే ఎంత బాగుంటుందీ...
వైఫల్యానికి నిదర్శనం
ప్రమాదఘంటికలు
ప్రచార తంత్రం
అమ్మ
అభివృద్ధిలో ''ఆమె'' ఎక్కడ?
సహేతుకత ఏదీ?
నిరుద్యోగ రక్కసి
అబద్ధమూ ఓ కళే!
బంతాట!
భౌతిక భక్తి
అందని టీకా
కేరళ ఎన్నికలలో రాజకీయ దుష్ట త్రయం
మానని లాక్‌డౌన్‌ గాయాలు
ఢిల్లీకి సంకెళ్లు
మోడీ బ్రాండ్‌ ''సవ్య సాచిత్వం!''
కవనలోకం
''ఫీడింగ్‌''కు సీడింగ్‌ అడ్డు!
లోగుట్టు కేసీఆర్‌ కే ఎరుక!?
అమెరికా ప్రమాదకర వ్యూహం - క్వాడ్‌
అంగట్లో దేశం..
''లోకల్‌'' పాలిట్రిక్స్‌

తాజా వార్తలు

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

10:20 AM

కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

08:18 PM

బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే

08:02 PM

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

07:45 PM

కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు

07:39 PM

కరోనా సెకండ్‌ వేవ్‌...అధికారులతో మోడీ కీలక సమావేశం

07:30 PM

ముగిసిన ఉపఎన్నికల పోలింగ్..

07:25 PM

హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం..

07:07 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

07:02 PM

విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

06:56 PM

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..

06:55 PM

ప్రభుత్వ, నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు పాఠశాలలు

06:41 PM

వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.