Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ తీర్పులు నిలిచేనా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 11,2021

ఈ తీర్పులు నిలిచేనా?

''రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తెచ్చిన ట్రిబ్యునళ్లు, భట్టిప్రోలు పంచాయతీ''లా మిగలకూడదు. దశాబ్ధాలుగా పరిష్కారానికి నోచని భూవివాదాల అంతును నెలరోజుల్లోనే ట్రిబ్యునళ్లు తేల్చేయడం హాస్యాస్పదం. రెవెన్యూ కోర్టుల్లోని కేసుల పరిష్కార ప్రక్రియలో శాస్త్రీయత లేదు. సహేతుకత అంతకన్నా లేదు. ఏదో పైపైన పరిశీలించి, సీఎం కేసీఆర్‌ మెప్పుకోసం ట్రిబ్యునళ్లు ''మమా'' అనిపించేశాయి. ఇరుపక్షాల వాదనలు విని, వాస్తవాలను అంచనా వేసి తీర్పులివ్వాలనే సంగతినే మరిచాయి. ఏకపక్ష తీర్పులు కోర్టుల్లో సైతం నిలబడవనీ, భూ, న్యాయశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఖమ్మం జిల్లా వాసి హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడమే ఇందుకు సాక్ష్యం. ఈ తీర్పులకు రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ సైతం అభ్యంతరం చెప్పింది. రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామనీ, అవినీతి మకిలంతా వదిలిస్తామని చెప్పిన గులాబీ సర్కారు, 135 రెవెన్యూ చట్టాలను 'తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల చట్టం-2020'గా మార్చింది. ధరణి వెబ్‌సైట్‌తో రెవెన్యూ సమస్యలన్నీ కొలిక్కి వస్తాయని ఆర్భాటంగా ప్రకటించింది. వెబ్‌సైట్‌ ఏర్పాటయ్యే నాటికి 16వేల కేసులు, తహిసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యునళ్లతో నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని సర్కారు చెప్పిన గడువు కంటే ముందే రెవెన్యూ కోర్టులు తీర్పులిచ్చేసి చేతులు దులుపుకున్నాయి. 26 జిల్లాల్లో ఇప్పుడు అసలు కేసులే లేవనడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఒక నెలలోనే వేలాది కేసులను పరిష్కరించే శక్తిసామర్థ్యాలు కలెక్టర్లకు ఉన్నప్పుడు, ఇంతకాలం ఆ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నట్టు? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కానీ, నూతన రెవెన్యూ చట్టం ద్వారా ఏర్పాటైన ట్రిబ్యునళ్లు, కొత్త భాష్యం చెప్పాయి. తాజాగా వచ్చిన తీర్పులన్నీ ఏకపక్షమవడం గమనార్హం. ఇందుకు నిదర్శనం ట్రిబ్యునళ్ల తీర్పులపై తిరిగి సివిల్‌ కోర్టులకు కక్షిదారులు వెళ్లడమే. అంతేగాక ఈ తీర్పులు పాక్షికమని తేలిపోయింది కూడానూ.
రెవెన్యూ కోర్టుల్లో నుంచి కేసులను వదిలించుకోవడమే లక్ష్యంగా ఆఘమేఘాల మీద ఈ తీర్పులొచ్చాయి. ఒక భూసంబంధమైన కేసును తేల్చడానికి కక్షిదారులను పిలవడం, వారి వాదనలు విన్న తర్వాతే జడ్జ్‌మెంట్‌రావాలి. గతంలో లోకాయుక్త, లోక్‌అదాలత్‌ కూడా ఈ తరహాలోనే చేసేవి. ముందే ఉభయ కక్షిదారులతో సంప్రదింపులు చేసి, వారి మధ్య జరిగిన ఒప్పందం మేరకే తీర్పుచెప్పడం వీటి ప్రత్యేకత. ఈ ట్రిబ్యునళ్ల తీర్పుల్లో దాన్ని పాటించలేదు. లావుణి పట్టా భూములను ప్రభుత్వమే సేకరించదలుచుకున్న కేసులు, అర్హతలేని వాళ్లు కొనుగోళ్లు చేసిన కేసులు, పాసుపుస్తకాల్లో తప్పులు జరిగిన కేసులు, సాదాబైనామాలకు పట్టాలు ఇవ్వాల్సిన కేసులకు సంబంధించి ఒకే రోజులో తీర్పు ఇవ్వొచ్చా? అది సాధ్యమేనా? ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చి, సర్వే చేసి, పొడి చేసి(డిమార్కేషన్‌), సప్లిమెంటరీ సేత్వార్లు(రికార్డు రిజిష్టర్‌) ప్రకటించి, పంచనామా ద్వారా రైతులకు అప్పగించాలి. రెవెన్యూశాఖ చేయాల్సిన ఈ పనులు పెండింగ్‌లో పెట్టడం మూలాన ఆ కేసులు కూడా రెవెన్యూ కోర్టుల్లోకి వచ్చేశాయి. వాటినీ ట్రిబ్యునళ్లు త్వరితగతిన పరిష్కరించడం అనుమానించాల్సిందే. సీఎంను సంతృప్తి పరచడానికి కలెక్టర్లు నిబంధనలను తుంగలోతొక్కారు. హడావుడి తీర్పులతో సివిల్‌ కోర్టులకు పనిపెంచడం, ఆలస్యం చేయడంతోపాటు పేదలపై మరింత ఆర్థికభారాన్ని మోపడమే. ప్రస్తుతం రెవెన్యూ కోర్టుల్లో కేవలం 879 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయట! తీర్పులు న్యాయబద్దమైతే, కక్షిదారుల్లో అసంతృప్తి ఎందుకున్నట్టు? మళ్లీ సివిల్‌ కోర్టుల బాట పట్టాల్సిన అవసరమేంటి? ఇష్టానుసారం ఇచ్చిన తీర్పులతో వారంతా ఆందోళనకు గురవుతున్నారనేది నూటికినూరుపాళ్లు నిజం.
గ్రామసభ నిర్వహించి ప్రజల కండ్లెదుటే సమస్యలకు చరమగీతం పాడటం ఒక పద్దతి. మోకా పైకి(భూమి మీదకు) వెళ్లి సెటిల్‌ చేయడం మరో విధానం. రికార్డులను చూసి తీర్పునివ్వడం మూడో తరహాది. ఏ పద్ధతులను అనుసరించి, ఇంత వేగంగా కేసుల్లో తీర్పులిచ్చారో సర్కారే ప్రజలకు జవాబు చెప్పాలి. ఇప్పటికీ రాష్ట్రంలో 15 శాతం సాగు భూములు తగాదాల్లోనే ఉన్నాయి. ఉభయతారకంగా పరిష్కారం కనుగొనాలి తప్ప, పాక్షికంగా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో శాంతి-భద్రతల సమస్య పుట్టుకొస్తుంది. కాగా ఈ కేసుల పరిష్కారం తర్వాత ట్రిబ్యునళ్లు ఉండవనేది సర్కారు షరతు. అప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరగలేక, పేదలు చివరకు భూముల్నే వదులుకునే పరిస్థితి రావచ్చు. అప్పుడు డబ్బున్నోడిదే భూమి అయ్యే ప్రమాదముంది. ధరణితోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేది అభూత కల్పనే. ఈ నేపథ్యంలో సర్కారు తొందరపాటుతో కాకుండా సమస్యలను చట్టబద్దంగా, రికార్డుల ఆధారంగా గ్రామసభల్లో పరిష్కరించడమే ఉచితం. ఇందుకు ట్రిబ్యునళ్లల్లో నిపుణులను నియమించి, శాశ్వత ప్రాతిపదికగా తీర్పులిస్తేనే సర్కారు కొత్త చట్టానికి సార్థకత, ప్రజలకు మేలునూ.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విలయం
ప్రభుత్వాలకు ఇది తగునా?
విభజన రాజకీయాల్లో బెంగాల్‌
ఈ ఆగడాన్ని తిప్పికొట్టాలి
తలొగ్గిన కేంద్రం
''ఉత్తుత్తి ఉత్సవం''
ఆశ
బలిదానాలొద్దు...
ఎన్నికలుంటే ఎంత బాగుంటుందీ...
వైఫల్యానికి నిదర్శనం
ప్రమాదఘంటికలు
ప్రచార తంత్రం
అమ్మ
అభివృద్ధిలో ''ఆమె'' ఎక్కడ?
సహేతుకత ఏదీ?
నిరుద్యోగ రక్కసి
అబద్ధమూ ఓ కళే!
బంతాట!
భౌతిక భక్తి
అందని టీకా
కేరళ ఎన్నికలలో రాజకీయ దుష్ట త్రయం
మానని లాక్‌డౌన్‌ గాయాలు
ఢిల్లీకి సంకెళ్లు
మోడీ బ్రాండ్‌ ''సవ్య సాచిత్వం!''
కవనలోకం
''ఫీడింగ్‌''కు సీడింగ్‌ అడ్డు!
లోగుట్టు కేసీఆర్‌ కే ఎరుక!?
అమెరికా ప్రమాదకర వ్యూహం - క్వాడ్‌
అంగట్లో దేశం..
''లోకల్‌'' పాలిట్రిక్స్‌

తాజా వార్తలు

10:44 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరి మృతి

10:44 AM

ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

10:20 AM

కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

08:18 PM

బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే

08:02 PM

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

07:45 PM

కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు

07:39 PM

కరోనా సెకండ్‌ వేవ్‌...అధికారులతో మోడీ కీలక సమావేశం

07:30 PM

ముగిసిన ఉపఎన్నికల పోలింగ్..

07:25 PM

హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం..

07:07 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

07:02 PM

విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

06:56 PM

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.