Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రకృతి వికృతైన వేళ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 12,2021

ప్రకృతి వికృతైన వేళ

హిమాలయ సానువుల్లో గల ఉత్తరాఖండ్‌లో ఆదివారం అకస్మాత్తుగా సంభవించిన జల విలయానికి 18 మంది మత్యువాతపడగా రెండొందలకుపైన గల్లంతయ్యారు. ఒక్కపెట్టున విరుచుకుపడ్డ వరదలకు ఆనకట్టలు, వంతెనలు, రోడ్లు, ఇళ్లు, కట్టడాలు కొట్టుకుపోవడమో తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. జల విద్యుత్‌ కేంద్రాలు సైతం నామరూపాల్లేకుండా పోయాయంటే బీభత్స స్థాయి ఏమిటో ఊహించవచ్చు. చమోలీ జిల్లా జోషీమఠ్‌ సమీపంలోని నందాదేవి హిమానీ నదం నుంచి భారీ మంచు చరియలు ధౌలీగంగ నదిలో పడటంతో ఒక్కసారిగా వరద పోటెత్తి రుషిగంగ, అలకనంద నదులను ముంచెత్తడం జల ప్రళయానికి కారణంగా చెబుతున్నారు. హఠాత్పరిణామానికి ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భారీ జల విద్యుత్‌ కేంద్రం 'తపోవన్‌'లో పని చేస్తున్న 170 మంది కార్మికులు ప్రవాహంలో చిక్కుకుపోయారు. వంతెనలు, రహదారులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందైంది. సైన్యం, పోలీస్‌, విపత్తు స్పందన బందాలు సహాయక చర్యలు చేపట్టాయి. షరా మామూలే అన్న విధంగా కేంద్రం, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.
పర్యావరణ సమతౌల్యం దెబ్బ తింటే ఎటువంటి విపత్తులొస్తాయో ప్రస్తుత ఉత్తరాఖండ్‌ అనుభవం మరోసారి పాలకుల కండ్ల ముందుంచింది. రెండు దశాబ్దాల్లో ఉత్తరాఖండ్‌ పెద్ద ప్రకతి వైపరీత్యాలను ఎదుర్కొంది. 2013లో 'చార్‌ధామ్‌' యాత్ర మార్గాల్లో వరద బీభత్సం దేశానికే కాదు ప్రపంచానికే పాఠాలు నేర్పింది. అప్పుడు ఏకంగా 5,700 మంది మరణించారు. ఇష్టారీతిన నదులపై నెలకొల్పిన ప్రయివేటు విద్యుత్‌ ప్రాజెక్టులు నదీ ప్రవాహానికి అడ్డుగా మారడంతో నష్టం తీవ్రత ఎక్కువైంది. దేశంలో 2004లో సునామీ తర్వాత అతి పెద్ద ప్రళయం అదే. అంతకుముందు అదే రాష్ట్రంలో ఉత్తర కాశీ, చమోలీలో భారీ భూకంపాలు, మల్పాలో మంచు చరియలు పడ్డ ఘటనల్లో వందల్లో ప్రాణనష్టం సంభవించింది. 2013 విపత్తు అనంతరం కూడా హిమాలయాల్లో వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అన్వేషించి ప్రజలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేసే వ్యవస్థను నెలకొల్పకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. సునామీ తర్వాత సునామీ సూచనలకు సముద్రతీర ప్రాంతంలో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పినప్పుడు, హిమాలయాలపై ఆ విధంగా ఎందుకు నెలకొల్పరు? ఇస్రో వంటి సంస్థలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టాల నివారణకు ఎందుకు ఉపయోగించరు?
భూగోళం వేడెక్కడం వలన హిమాలయాలకు ముప్పు పొంచి ఉందని పలు అధ్యయనాలు ఇప్పటికే కుండబద్దలు కొట్టాయి. 1975-2000 మధ్య పాతికేండ్లలో హిమాలయాల్లో మంచు కరిగే వేగం కంటే ఆ తర్వాత రెట్టింపైందనేది పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన. ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఇక్కడ పెరిగింది. పర్యవసానంగా మంచు కరగడం ఎక్కువైంది. ఆ నీటితో పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడుతున్నాయి. నీటి ప్రవాహం పెరిగినప్పుడు నదులుగా మారుతున్నాయి. మంచు కరగడం వలన చరియలు విరిగిపడుతున్నాయి. భూతాపం తగ్గించేందుకు గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించే విషయంలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి. పారిశ్రామిక దేశాలు తమ తమ కార్పొరేట్ల లాభాలే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. పర్యావరణ హాని కారకాలను ఇష్టారీతిన ప్రపంచంపై వదులుతున్నాయి. హానికారకాలను వదలొద్దని, అడవులను పెంచాలని తతీయ ప్రపంచ దేశాలకు సూక్తులు చెప్పడంతోపాటు ఆంక్షలు విధిస్తున్నాయి. పైగా ఇక్కడి సహజ వనరుల విచ్చలవిడి దోపిడీ ద్వారా పర్యావరణానికి హాని తలపెడుతున్నాయి. ఈ విధానానికి ప్రస్తుత భారత ప్రభుత్వం తందాన అంటోంది. ఆసియాలో ఆవరించిన హిమాలయాలు 200 కోట్ల ప్రజలకు జీవాధారంగా నిలిచాయి. వాటిని రక్షించుకోవడం ప్రపంచ బాధ్యత. ఆ విషయంలో భారత్‌ ముందుండి నాయకత్వం వహించాలి. పర్యావరణాన్ని దెబ్బ తీసే కార్పొరేట్‌ అనుకూల నయా-ఉదారవాద విధానాలను విడనాడితేనే హిమాలయాలకు, ప్రకతి వనరులకు రక్ష.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విలయం
ప్రభుత్వాలకు ఇది తగునా?
విభజన రాజకీయాల్లో బెంగాల్‌
ఈ ఆగడాన్ని తిప్పికొట్టాలి
తలొగ్గిన కేంద్రం
''ఉత్తుత్తి ఉత్సవం''
ఆశ
బలిదానాలొద్దు...
ఎన్నికలుంటే ఎంత బాగుంటుందీ...
వైఫల్యానికి నిదర్శనం
ప్రమాదఘంటికలు
ప్రచార తంత్రం
అమ్మ
అభివృద్ధిలో ''ఆమె'' ఎక్కడ?
సహేతుకత ఏదీ?
నిరుద్యోగ రక్కసి
అబద్ధమూ ఓ కళే!
బంతాట!
భౌతిక భక్తి
అందని టీకా
కేరళ ఎన్నికలలో రాజకీయ దుష్ట త్రయం
మానని లాక్‌డౌన్‌ గాయాలు
ఢిల్లీకి సంకెళ్లు
మోడీ బ్రాండ్‌ ''సవ్య సాచిత్వం!''
కవనలోకం
''ఫీడింగ్‌''కు సీడింగ్‌ అడ్డు!
లోగుట్టు కేసీఆర్‌ కే ఎరుక!?
అమెరికా ప్రమాదకర వ్యూహం - క్వాడ్‌
అంగట్లో దేశం..
''లోకల్‌'' పాలిట్రిక్స్‌

తాజా వార్తలు

11:34 AM

80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి..

11:21 AM

ఒకటి కాదు.. రెండు మాస్కులు తప్పని సరి..

11:16 AM

చెట్ల పొదల్లో ఆడ శిషువు.. బయటకు తీసిని గ్రామస్తులు

11:07 AM

కుంభమేళాకు వెళ్లిన వారికి క్వారంటైన్ తప్పనిసరి

11:00 AM

కొవిడ్ పై నేడు ప్రధాని మోడీ సమీక్ష

10:58 AM

మోత్కుపల్లి ఆరోగ్యం విషమం

10:56 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

10:50 AM

రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు

10:44 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరి మృతి

10:44 AM

ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..

10:31 AM

జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం

10:20 AM

కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

08:18 PM

బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.