Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మే 5 వరకు హెచ్‌సీయూలో దరఖాస్తుల స్వీకరణ
  • కేఎస్‌ఆర్టీసీ బస్సులో మంటలు
  • ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు
  • పవర్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..
  • ఆనం అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
విశ్వనగరం విలపిస్తోంది | సంపాదకీయం | www.NavaTelangana.com
Sundarayya
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Oct 11,2017

విశ్వనగరం విలపిస్తోంది

విశ్వనగరంలో వాన విలయతాండవంతో ప్రళయం సృష్టిస్తోంది. కాలనీలన్నీ నీళ్ళతో నిండి ఉన్నాయి. పేదల కండ్లలో కన్నీరు కారుతోంది. నగరం నలువైపుల నీటి దిగ్బంధనం కొనసాగుతున్నది. రహదారులన్నీ గోదారులై నావలు నడుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోలేక ప్రజలు విలపిస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలకు పాలకులు పూనుకోవటం లేదు. అధికారులకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అప్పుడప్పుడు అధికారులతో చుట్టపు చూపుగా వెళ్ళి ఉచిత సలహాలిస్తున్నారు. పనులకు పర్మిషన్లు ఇచ్చి ప్రజల భావోద్వేగాలను బ్యాలన్స్‌ చేస్తున్నారు. భాగ్యనగరం బాధలు ప్రభుత్వానికి పట్టటం లేదు. రాష్ట్ర రాజధానిలో ఇంత జరుగుతున్నా ఏమీ జరగనట్టు వ్యవహరించటం దారుణం. పట్టీ పట్టనట్టు వ్యవహరించడం ఘోరం.
మూసీనది సుడులు తిరుగుతూ వడివడిగా ఉరుకుతున్నది. నాలాలు నోర్లు తెరిచాయిు. కరెంట్‌ లేక కారు చీకటిలో జనం బిక్కుబిక్కుమంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పురుగుబూషి భయం వెంటాడుతున్నది. ఈ దుస్థితికి కారణం ఎవరు? పాలకుల ముందుచూపు మందగించడం. రాజకీయ నాయకుల అండతో చెరువులను పూడ్చారు. ప్లాట్లు చేశారు, అమ్ముకున్నారు. నగరంలో 530 చెరువులకు 169 మాత్రమే మిగిలాయి. వీటిలో కూడా ఎఫ్‌టిఎల్‌ పరిధిని మించి నిర్మాణాలను నిరాటంకంగా కట్టుకున్నా బల్దియా పట్టించుకోలేదు. మిగిలిన చెరువుల్లోనైనా పూడిక తీస్తే కొంత వరకు నీళ్ళు చెరువుల్లో చేరి తాత్కాలిక ఉపశమనం దొరికేది. ఆ పని కూడా చేయలేకపోయారు. రెండు సెంటీమీటర్ల వర్షం మాత్రమే తట్టుకునే పరిస్థితి నగరానికి ఉందని నిపుణులు హెచ్చరించినా పాలకులు చెవిన పెట్టకపోవడం విచారకరం. ఒకప్పుడు జంటనగరాలకు జంట చెరువులు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లు దాహార్తి తీర్చేవి. కర్మాగారాల కాలుష్యనీరు అందులోకి చేరటంతో ఎందుకూ అక్కరకు రాకుండా పోయిన పరిస్థితి. నీటిశుద్ధి కోసం పాలకుల పథకాలు ఆచరణలో అడుగు ముందుకు వేయకపోవడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. కాలయాపన చేయకుండ నీటిని కాలుష్య కాసారం నుండి వేరు చేయాలి. వరద సమస్యకు నిపుణులు పరిష్కారం చూపినా పరిష్కరించలేదు. నాలాల మీద అక్రమ నిర్మాణాలను తొలగించలేదు. ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని నిర్ణయించారు. సర్వేల మీద సర్వేలు చేశారు. వానాకాలం దాటగానే వదిలేస్తున్నారు. ఆపద వచ్చినప్పుడే ఆలోచిస్తున్నారు. ఇది సరైంది కాదు.
వానలతో నగరం నానుతోంది. గతేడాది నిర్మాణ ప్రమాదాల్లో పదిమంది చనిపోయారు. ఇండ్లు కూలిపోయి ఇప్పుడు చనిపోతున్నారు. వందలాదిగా భవనాల శిథిలదశలో ఉన్నట్టు బల్దియా గుర్తించింది. కురుస్తున్న వరుస వర్షాలకు వారం క్రితం ఇద్దరు చనిపోయారు. కరెంట్‌ షాక్‌తో మరొకరు చనిపోయారు. సోమవారంనాటి వర్షానికి ఇద్దరు చనిపోయారు. నష్టం జరిగినంక ఆలోచిస్తే లాభం లేదు. పాలకులూ అధికారులూ ముందే ముప్పు గమనించాలి. కూలిపోయే భవనాలలో జీవిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి.
వాననీళ్లు రోడ్లమీదకు రావడంతో ప్రజలు ప్రయాస పడుతున్నారు. నాలుగు గంటల నుండి ఐదు గంటలు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. అర్థరాత్రి దాటినా వాహనదారులు ఇండ్లకు చేరుకోలేకపోతున్నారు. నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రయివేటు పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. వర్షానికి రోడ్ల మీద నీళ్ళు నిలవటంతో వాహనాల రాకపోకలకు గుంతలు పడ్డాయి. పైపులైన్‌ లీకేజీలతో రోడ్లు కొట్టుకు పోయాయి. మంచినీటి పైపులు పగిలిపోయాయి. వర్షపునీరు మంచినీటితో కలిసి నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ఫలితంగా జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే నీటి నిలువతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. నీటిని నిలువలేకుండా చూడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. కానీ వారాల కొద్దీ వాననీరు బయటకు పోకపోవటంతో నీటితోనే ముంపు ప్రాంత ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. అంటురోగాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే నగరమంతా విషజ్వరాలతో విలవిల్లాడుతున్నది. వాతావరణంలో నెలకొన్న మార్పుల వలన డెంగీ జ్వరాల బెంగ పెరుగుతోంది. స్వైన్‌ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉంది. తాగునీటి కాలుష్యంతో డయేరియా, టైఫాయిడ్‌ వచ్చే అవకాశం ఉంది. పాలకులు ప్రజలకు వర్షాల వలన తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. అంటువ్యాధులను అరికట్టే చర్యలు తీసుకోవాలి. రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించాలి.
విశ్వనగరం అభివృద్ధే మా లక్ష్యమని ప్రకటించిన పాలకులు ప్రకృతి విపత్తులను తట్టుకుని, విలసిల్లేలా చేయాలి. జన జీవనం స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత మరువద్దు. హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్న వర్షాలపై ఏలికలు పట్టీపట్టనట్టు వ్యవహరించడం సరైంది కాదు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పస్తులతో పనులు లేక ఇంటి నుండి బయటకు రావటం కష్టంగా ఉంది. వారికి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. ఆదుకోవాలి. అండగా నిలవాలి. ప్రజల కన్నీళ్లు తుడవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మంతనాల మర్మం!
అభిశంసన
దిశానిర్దేశం చేసిన సభలు
పుడమి
ట్రంప్‌-అబే సమావేశం
కరెన్సీ కల్లోలం
కోర్టు తీర్పు
దోషులెవరు?
అత్యాచార 'భారతం'
ఆమె చైతన్యవతి....
కొంగ జపం
ట్రంప్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు
అవకాశవాదం
బెంగాల్‌లో అరాచక దాడులు
మోడీకి ఎదురుగాలి
న్యాయం
చీకటి అధ్యాయం
ఉపాధ్యాయుల తిరుగుబాటు!
ముఖ్యమంత్రి మాట్లాడారు
భారత్‌ బంద్‌
కాశ్మీర్‌లో అశాంతి
శిల్పకళ
జీవితాల కోసం కవాతు!
బెంగాల్లో మత కొట్లాటలు
ప్రయి'వేటు'
రైతుల ఆత్మహత్యలు
మన్‌ కీ బాత్‌
స్నేహలత
ఆపరేషన్‌ ద్రవిడ
ఇరాక్‌పై యుద్ధానికి 15ఏండ్లు

Top Stories Now

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్‌ టీం హల్‌చల్‌
నవతెలంగాణ జర్నలిజం కళాశాల‌
మైనర్‌కు మద్యం తాగించి బోయ్‌ఫ్రెండ్‌తో అత్యాచారం చేయించింది!
సిఐ అమినీతిని బయటపెట్టిన కానిస్టే‌బుల్‌.. వీడియో
మంచు విష్ణు బైక్‌ యాక్సిడెంట్ వీడియో
కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు.
కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు.
ఆనం వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత‌‌
బాలికపై అత్యాచార కేసులో ఆశారాం దోషి
కిక్‌ - 2 హస్యనటుడికి 6 నెలల జైలుశిక్ష
పెళ్లైన 3 రోజులకే స్నేహితులతో
ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు భరత్ అనే నేను సినిమాను చూడాలి

_

తాజా వార్తలు

07:40 AM

మే 5 వరకు హెచ్‌సీయూలో దరఖాస్తుల స్వీకరణ

07:39 AM

కేఎస్‌ఆర్టీసీ బస్సులో మంటలు

07:32 AM

ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు

07:31 AM

పవర్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..

07:24 AM

ఆనం అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు

07:20 AM

ఎగవేతదార్ల ఆచూకీ కోసం డిటెక్టివ్‌లతో వేట

07:13 AM

దేశ రాజకీయాలను ప్లీనరీ నిర్దేశిస్తుంది: జగదీశ్‌రెడ్డి

07:11 AM

మే 2న ఏపీ మంత్రివర్గ సమావేశం

07:08 AM

మే 2 నుంచి వీఆర్‌ఏల నిరసన: ఈశ్వర్‌

07:08 AM

6న మేధావుల సభకు రండి: మంద కృష్ణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.