Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మూడేళ్లుగా భరత్ నన్ను వేధిస్తున్నాడు: మధులిక వాంగ్మూలం
  • మంత్రుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్‌
  • మరి కాందహార్ మాటేమిటి?: సిద్ధూ
  • రోడ్డెక్కిన కేపీ ఉల్లి రైతులు
  • ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ప్రగతి (ని)వేదన | సంపాదకీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Sep 04,2018

ప్రగతి (ని)వేదన

రహదారుల నిండా గులాబీ దళాలతో రాజధాని రంగులమయమైంది. సభకు తరలించబడిన జనసంఖ్య ఆ పార్టీ నేతలకూ, అధినేతకూ సంతృప్తినిచ్చిందో లేదో కానీ అధినేత ప్రసంగం మాత్రం ప్రజలను ఉత్సాహపరచలేకపోయింది. టీఆర్‌ఎస్‌ నేతలు ఆశించినట్టు ఈ 'ప్రగతి నివేదన' దేశంలో అతిపెద్ద సభగా చరిత్రలో నిలిచిందో లేదో కాని 'ప్రగతి'ని మాత్రం నివేదించలేకపోయింది అంటున్నారు పరిశీలకులు. అది కేవలం ప్రభుత్వ పథకాల ప్రచార సభగా సాగిందనేది విశ్లేషకుల మాట. సభకు ముందు సృష్టించిన హైప్‌ అంతా ఇంతా కాదు. గత పదిరోజులుగా వరుస సమాలోచనలు, క్యాబినెట్‌ భేటీలు, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలూ సభ పట్ల మీడియా, రాజకీయ వర్గాలు సహా ప్రజలలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొల్పాయి. అభివృద్ధిని నివేదించడంతో పాటు సరికొత్త వరాలజల్లు, శాసనసభరద్దు, ముందస్తు ఎన్నికల వంటి రాజకీయ నిర్ణయాలు ఉంటాయని అంతా ఆశించారు. కానీ అటువంటి నిర్దిష్ట ప్రకటనలేమీ లేకుండానే అట్టహాసంగా ప్రారంభమైన సభ గంటన్నరలోపే సాదాసీదాగా ముగిసింది..!
తెలంగాణ ఆవిర్భావ క్రమాన్ని, ఆ క్రమంలో తన జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ తరువాత తన పథకాలను వివరించడం మీదే కేంద్రీకరించారు. ఆసరా మొదలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతు బీమా మొదలైన పథకాలన్నింటినీ ఏకరువుపెట్టారు. ప్రసంగం చూస్తుంటే ఒక దశలో 'ప్రగతి' అంటే కేవలం సంక్షేమ పథకాలేనా..!? అనిపించింది. ప్రజా సంక్షేమానికి ఇటువంటి పథకాలను చేపట్టడం అభినందనీయమే. కాని అవి ప్రజల జీవితాలకు తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారాలు కావుకదా..!? అసలు ఏ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడకుండా, స్వయంగా తమ కాళ్లమీద తాము నిలబడగలిగిన స్థితిని ప్రజలకు అందివ్వడం కదా అభివృద్ధి అంటే..!? సమస్యల మూలాలను కనిపెట్టి, వాటిని మౌలికంగా పరిష్కరించి, ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడం కదా 'ప్రగతి' అంటే..!? ఆ ప్రగతికి తోడ్పడే పథకాలను కూడా కొన్ని ఆయన ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ఉదాహరణకు దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్రూమ్‌ ఇండ్లు, నీళ్లూ, నియామకాలు మొదలైనవి. నిజానికి ఇవి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, వారి జీవన ప్రమాణాలను పెంపొందించేవి..!? కానీ వాటి ప్రస్తావనే లేకుండా ఆయన ప్రసంగం సాగడం గమనార్హం..!
భూమి, ఇల్లు దళితుల ఆర్థిక స్థోమతనే కాదు సామాజిక హోదానూ సూచిస్తాయి. అందుకే ముఖ్యమంత్రి వాటిని వాగ్దానం చేశారు కానీ అమలు సంగతే మరిచారు. ప్రభుత్వమే చెపుతున్న లెక్కల ప్రకారం భూపంపిణీకి అర్హమైన కుటుంబాలు 3,50,000 ఉండగా, కేవలం 4,819 కుటుంబాలకు 12,387 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అందుబాటులో భూమిలేదని సాకులు చెపుతున్న సర్కారు భారీ ప్రాజెక్టులు, ఫార్మాసిటీల కోసం మాత్రం వేల ఎకరాలను సమకూరుస్తుండటం విశేషం..! సాగుభూమి లేని ఈ దళిత కుటుంబాలు రైతు బంధు, రైతు బీమాకు కూడా నోచుకోవడం లేదు. ఇక డబుల్‌బెడ్రూమ్‌ ఇండ్లలో ప్రగతి ఎంత అంటే సముద్రంలో నీటిబొట్టంత..! లబ్దిదారులు లక్షల్లో ఉంటే పని మొదలైన ఇండ్లు వందలు దాటి వేలకు చేరడంలేదు. ఎనిమిదిన్నర లక్షల మందికి డబుల్‌బెడ్రూమ్‌ ఇండ్లు కట్టిస్తానన్న ముఖ్యమంత్రి తన ప్రగతి నివేదనలో వీటి మాటే ఎత్తలేదు..! ఉద్యోగాల భర్తీలో దేశ సగటు కన్నా వెనుకబడి ఉండటం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం. రిటైర్మెంట్లతో కలిపి మూడులక్షల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ చెబుతుంటే, 1,07,744 ఖాళీలున్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. రెండున్నరేండ్లలో వీటిని భర్తీ చేస్తానని 2014లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఈ నాలుగేండ్లలో 12,740 ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యాయని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పిఎస్‌సీ) చెపుతుంటే లక్ష ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. వాస్తవ గణాంకాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి సభలో ఈ ప్రస్తావనే లేకుండా కొత్త జోనల్‌ వ్యవస్థ గురించి మాట్లాడటం యువతను మభ్యపెట్టడమే. కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్‌ చేస్తానన్న మాట కూడా మరిచారు. తెలంగాణ స్వరాష్ట్ర సాకారం తరువాత కూడా ఉద్యోగాల కోసం వేచిచూడక తప్పని స్థితిని తెలివిగా దాటవేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థపై ప్రధానితో కొట్లాడి మరీ ఉత్తర్వులు తెప్పించుకున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి ఆ పని మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల విషయంలో ఎందుకు చేయలేకపోయారో కూడా చెపితే బాగుండేది.
చివరగా శాసనసభ రద్దు, ముందస్తు ఊహాగానాలను ఉటంకిస్తూ, రాష్ట్ర శ్రేయస్సుకు లోబడి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని మంత్రివర్గం, పార్టీ తనకిచ్చిందనీ, ఆ మేరకు త్వరలో రాజకీయ నిర్ణయం ఉంటుందని చెప్పడం కొస మెరుపు. దీనిని బట్టి సభకు ముందున్న రాజకీయ వాతావరణాన్ని యథాతథంగా కొనసాగించడమే కేసీఆర్‌ వ్యూహంగా అర్థమవుతోంది. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దు, గులాబీలుగా వెలుగుదాం అంటూ మరోసారి తెలంగాణ అస్థిత్వాన్ని, సెంటిమెంట్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేసారు. మళ్లీ ఆశీర్వదించండని కోరుతూ ముందస్తు ఎన్నికల సంకేతాలను అందించారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ ప్రగతిని విస్మరించి పథకాలను ఏకరువు పెట్టింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాశ్మీర్‌లో ఉగ్రదాడి!
మత హింస ప్రమాదం
రోడ్డెక్కిన రైతన్న!
ట్రంపు ప్రేలాపన
అధికారులకో హెచ్చరిక
ఏ కీటకమూ పోటీ పడలేదు..!
సముద్రగర్భంలో రణగొణులు
రాఫెల్‌ గుట్టు రట్టు
ప్రేమా ప్రేమా
కేరళలో కొత్త పన్నాగం!
పంచాయతీల గోస
అమెరికా చర్య దుర్మార్గం
ఓటమి పరిపూర్ణం!
వీధికెక్కిన మోడీ, దీదీ
ఆచరణ
దిగజారుడు ప్రసంగం
వెనిజులాలో అమెరికా చిచ్చు
మాట వినకపోతే...
అవినీతి ఊడలు
ఉద్యోగాలు ఉత్తమాటేనా..
అప్పు ముప్పే..
ప్రియాంక ప్రవేశం
సంపద కేంద్రీకరణ
విలువలకు విలువనివ్వాలి
లోక్‌పాల్‌ అంటే భయం
కర్నాటకం
ఆడమనసు
గాడి తప్పిన మోడీ
నూరేండ్ల అమరత్వం
కూర్పు కుదిరేనా...
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

07:54 PM

మూడేళ్లుగా భరత్ నన్ను వేధిస్తున్నాడు: మధులిక వాంగ్మూలం

07:52 PM

మంత్రుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్‌

07:42 PM

మరి కాందహార్ మాటేమిటి?: సిద్ధూ

07:21 PM

రోడ్డెక్కిన కేపీ ఉల్లి రైతులు

07:18 PM

ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు

07:02 PM

ముఖాముఖి తలపడితే సమాధానం చెప్పేవాళ్లం

06:53 PM

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

06:40 PM

కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి: నారాయణస్వామి

06:26 PM

విజయవాడ చేరుకున్న డిల్లీ సీఎం కేజ్రీవాల్‌

06:15 PM

'ఆర్ఆర్ఆర్' .. 'బాహుబలి' కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.