Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉల్లి పోటు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

ఉల్లి పోటు

ఉల్లి ధరలు దేశప్రజలను కన్నీరుపెట్టిస్తున్నాయి. మూడునెలలుగా ఇదే తంతు. పెరగడం తప్ప తగ్గడం లేదు. ముందెన్నడూ లేని స్థాయిలో రోజురోజుకు పెరుగుతుండటంతో ఉల్లి గురించి ఆలోచించేందుకే ప్రజలు భయపడుతున్నారు. ఒకవైపు మహిళలపై లైంగికదాడులతో యావత్‌దేశం ఆందోళనచెందుతుంటే.. మరోవైపు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన ఐదునెలల్లో ఉల్లి ధరలు 253శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. 'ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిందంతా చేస్తున్నాం. ఇలా ధరలు పెరగడానికి అధికంగా కురిసిన వర్షాలు, వరదలే కారణం. మా తప్పు ఏమీ లేదు' అని కేంద్రప్రభుత్వం తమ వైఫల్యాలను ప్రకృతిపై నెట్టడమంటే సమస్యనుంచి పారిపోవడమే. దీనంతటికీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం. ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా లేకపోలేదు. గత సంఘటనల ఆధారంగా ప్రభుత్వాలు సరైన సమయంలో మేల్కొంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నది స్పష్టం.
మామూలుగా ఉల్లి ధర కిలో రూ.15 నుంచి 20కి మించి ఉండదు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.40కు చేరింది. పంట చేతికొచ్చే సమయం కదా అని సరిపెట్టుకున్నా ఆ తర్వాత రూ.60 నుంచి 80, రూ.100కు సైతం ఎగబాకి.. ఇప్పుడు ఏకంగా రూ.150 నుంచి 180కు చేరుకోవడంతో ప్రజలకు ఏడుపొక్కటే తక్కువ. ఇప్పటికే కూరగాయలు, పప్పుదినుసులు, నిత్యావసర వస్తువుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఉపాధి లేక దయనీయమైన పరిస్థితుల్లో జీవనాన్ని నెట్టుకొస్తున్న సామాన్యులకు ధరలు ఇలా పెరగడం గోరుచుట్టుపై రోకటిపోటు లాంటిదే.
దేశంలో 230 లక్షల టన్నుల ఉల్లి సాగవుతున్నది. అందులో 50 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసినా మిగతాది దేశ అవసరాలకు ఉపయోగపడుతుంది. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉల్లి పంట ఎక్కువగా సాగవుతున్నది. ఈ రాష్ట్రాల నుంచే కోటి టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతున్నది. ఏడాదిలో మూడు పంటలుగా రైతులు సాగుచేస్తుంటారు. మొదట అనావృష్టీ, తర్వాత భారీ వర్షాలతో పాటు వరదల వల్ల ఖరీఫ్‌లో రావల్సిన పంట రాలేదు. రెండు మాసాల్లో లేట్‌ ఖరీఫ్‌ పంట అందుబాటులోకి రానుంది. అప్పటిదాకా తిప్పలు పడాల్సిందే. వర్షాలు కురుస్తున్న సెప్టెంబర్‌ నెలలోనే కేంద్రం స్పందించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఈ స్థాయిలో ఉల్లి ధరలు పెరిగేవి కావు. నెలకు పదిలక్షల టన్నుల దిగుమతి చేసుకోవాల్సి ఉండగా, లక్ష టన్నుల ఉల్లిని తేవడం వల్ల అవి ఏ మూలకు సరిపోతాయన్నది ప్రశ్న. ఇందుకు భిన్నంగా పెద్దఎత్తున ఎగుమతులు చేయడం సమస్యను తీవ్రతరం చేసింది. తాత్కాలిక ఉపశమనం ప్రకటనలతో కాలహరణం చేయడం తప్ప ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం కృషి చేయలేదని అర్థమవుతున్నది
కూరగాయలతో పాటు ఉల్లి అస్థిరమైన పంట. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే 24 పంటల్లో కూరగాయలు గానీ, ఉల్లిగానీ లేదు. దిగుబడులు పెరిగినప్పుడు ధర పడిపోయి రైతులు పంట పారబోస్తున్న సందర్భాలు అనేకం. వారికి డబ్బులెక్కువై పంట పారబోయడం లేదు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కడుపు మండి రోడ్లపై పారబోస్తున్నామని పలుసార్లు రైతులు కన్నీంటిపర్యంతమయ్యారు. పంటలు పండకుంటే ప్రజలకు ధర మంట తప్పదు. ఈ రెండు సందర్భాల్లోనూ బ్లాక్‌ మార్కెట్‌దళారులు లాభం పొందుతున్నారు. పంట పండించిన రైతు నష్టపోతున్నాడు. రైతు నుంచి పంట కొనుగోలు చేసిన బ్లాక్‌మార్కెట్‌ దళారులు రేటు పెంచి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వాల అండ తోడవ్వడంతో వారు ఆడింది ఆట..పాడిందే పాటగా తయారైంది. తూతూమంత్రపు నిబంధనలు తప్ప అడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముతున్న వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.
ఉల్లి ధరలతో ప్రజలు ఆందోళన చెందుతుంటే, దీని గురించి పార్లమెంటులో చర్చించి పరిష్కారం చూపించాల్సిన బీజేపీ ప్రభుత్వం సమస్యను తక్కువ చేసి చూపించడం ఎంతవరకు సమంజసం. ప్రధాన ప్రతిపక్షపార్టీ కూడా ఆ దారిలోనే నడవడం విడ్డూరం. తాను ఉల్లిగడ్డ తిననని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం, మరేం తింటారు.. ఆవకోడా (ఓ రకం పండు) ఆరగిస్తారా? అని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించడం.. అసలు సమస్య గురించి మాట్లాడకుండా హాస్యాస్పదమైన చర్చ చేయడం ప్రజలను అవహేళన చేయడమే. ఆర్థికమంత్రి ఏమి తింటారో ఎవరికి కావాలి? కూరలేనప్పుడు పేదలకు ఉల్లిగడ్డలే కూర. ఉల్లికారం ఆధారం. తక్షణం ప్రభుత్వమే చౌకగా ఉల్లిగడ్డలు అమ్మించాలి. అంతేకాదు ఉల్లిసాగుకు ప్రోత్సాహ మివ్వాలి. పంట విస్తీర్ణం పెరిగేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇతర వాణిజ్యపంటలకు ఇచ్చిన సౌకర్యాలను ఉల్లి, కూరగాయ పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. పంటలు నష్టపోయినప్పుడు నష్ట పరిహారం చెల్లించే చర్యలను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. దళారులకు కొమ్ముకాయకుండా.. రైతులు ఉల్లిగడ్డ మురిగిపోకుండా డ్రై చేసి నిల్వ ఉంచుకోవటానికి అవసరమైన సాంకేతిక సౌకర్యం, గిడ్డంగులు ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?
నంగనాచుల కాలంలో..!
వివేచన

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.