Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పరిష్కారం మన చేతుల్లోనే ఉంది! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Mar 28,2020

పరిష్కారం మన చేతుల్లోనే ఉంది!

మహమ్మారి కరోనా
కనిపించని మహా శత్రువే కావచ్చు, కానీ
అది కబళిస్తున్నది మనిషిని కదా
మన కండ్ల ముందటి మన మనిషిని కదా
మనిషిని మనం ఎలా చూస్తున్నామన్నది ప్రశ్న
చూడాల్సిన విధంగా ఎందుకు
చూడలేకపోతున్నామన్నది ప్రశ్న
ఈ ప్రశ్నకు సమాధానం మన దృక్పథంలో ఉంది!
మానవ సమాజం ఎన్నో మహాసంక్షోభాలను ఎదుర్కొంది, ఆ ఎదుర్కొనే క్రమంలోనే ముందుకు సాగుతూ ఉంది. ఇకపై సాగబోతుంది. ప్రకృతి మనిషికి ఎప్పుడూ సమాధానాన్ని సిద్ధంగా ఉంచదు. సమాధానాన్ని కనిపెట్టమని సవాల్‌ విసురుతుంది. ఇప్పుడు కరోనా మహమ్మారి కూడా అంతే. అవును! మనిషికి ప్రకృతి విసిరిన మహాసవాల్‌ కరోనా. కాబట్టే ప్రపంచంలోని ప్రతి మనిషీ అతలాకుతలమైపోతున్నాడు. అట్టుడికిపోతున్నాడు. రేపటి సూర్యోదయంపై భరోసా కోసం పెనుగులాడుతున్నాడు.
ప్రజల సామూహిక సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత వ్యక్తుల మీదకన్నా వ్యవస్థ మీదే అధికంగా ఉంటుంది. ఆ వ్యవస్థను నడిపించే ప్రభుత్వాల మీదే ఉంటుంది. ప్రజలకు ఆపద ముంచుకొచ్చినప్పుడు అమాంతం ఆ ఆపదకు అడ్డుపడి దాన్నుంచి ప్రజలను వొడ్డున వేయాల్సిన కర్తవ్యం సర్కారు తన నెత్తికెత్తుకోవాల్సి ఉంది. అందుకే ప్రతి సామూహిక ఆపద సమయంలోనూ ప్రజలు ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తారు. అనివార్యంగా చూస్తారు. అమ్మలా తమను ఆదరిస్తుందన్న నమ్మకంతో నివేదించుకుంటారు. ఇప్పుడూ ప్రజలు అదే చేస్తున్నారు. ముంచుకొస్తున్న కరోనాతో పాటు, మా అంతు చూస్తానంటున్న ఆకలి గురించి కూడా ఆలోచించమంటున్నారు. దాని అంతు చూడమంటున్నారు. లేకుంటే తాము అంతమైపోక తప్పదని వేడుకుంటున్నారు. అయినా, కేంద్ర పాలకులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తాము రాజకీయాలను వీడమంటున్నారు. ఆపత్కాలంలో ప్రజలకు నమ్మకం, ధైర్యం కల్పించడమే అతిముఖ్యమని తెలిసికూడా, రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీలను కలుపుకుని, మీకు మేమున్నామన్న భరోసా ప్రజలకు ఇవ్వలేక పోతున్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలూ లేకుండా మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో ప్రజలు మరింత సంకటంలో పడిపోయారు. దేశంలో 39కోట్లమంది అసంఘటితరంగ కార్మికులు ఉన్న నేపథ్యంలో సరైన పంపిణీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ప్రకటించే ప్రతి సహాయ కార్యక్రమం ప్రజల మధ్య భౌతిక దూరాన్ని తగ్గించి కరోనా మహమ్మారికి మరింత దగ్గర చేస్తుందన్న ఇంగితం ప్రదర్శించలేక పోతున్నారు. ప్రజలు గుమిగూడే అవసరం లేకుండా వారి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తమదేనన్న విషయాన్ని దాటవేస్తున్నారు. ఫలితంగా, ప్రజలు తమ నిత్యావసరాలకోసం సామూహికంగా గుమికూడి మృత్యువును ఆహ్వానిస్తున్న విషాద ఘటనలను మనం నిత్యం కోకొల్లలుగా చూస్తున్నాం. చాలీచాలని ప్యాకేజీని ఆలస్యంగా ప్రకటించి చేతులు దులుపుకోవాలను కోవడం కేంద్ర పాలకుల దుర్నీతికి నిదర్శనం.
కరోనాను నివారించడంలో 1. భౌతిక దూరం 2. పౌష్టిక ఆహారం అత్యంత కీలకమనీ, భౌతిక దూరాన్ని పాటించి, పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే ఆ మహమ్మారిని కట్టడి చేయవచ్చునని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. కరోనాను నిరోదించడంలో గొప్ప విజయం సాధించిన చైనా దేశం, కేరళ రాష్ట్రాల అనుభవాలు కూడా ఇదే చెబుతున్నాయి. నిజానికి, మహమ్మారిని నిరోధించగల చర్యలు ఏమంత కష్టమైనవీ, ఏమాత్రం పాటించలేనివీ కాదు. అయితే ఇందుకు పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పట్ల బాధ్యత, ప్రేమ ఉండాలి. అవి ఉన్నాయి కాబట్టే చైనా, కేరళలు విజయం సాధించగలుగుతున్నాయి. లేవుకాబట్టే నిన్నటి వరకూ తాము తిరుగులేని బలసంపన్నులమని విర్రవీగిన అమెరికా లాంటి దేశాలు కండ్లు తేలేస్తున్నాయి.
భౌతికంగా ఒకరికొకరు దగ్గరగా వస్తే మీ ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తున్నా, తమ ప్రాణాలకు తెగించి ఎందుకు ఆ నియమాన్ని ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. ఇందుకు కారణం ప్రజల ఆకలి. ప్రభుత్వ అసమర్థత. చైనాలో, కేరళలో మిగిలిన చోట్లలా ప్రజలు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల కోసం గుంపులు గుంపులుగా ఎగబడలేదు. ఎందుకంటే అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. అవసరమైన వారికి సమయానికి వారి ఇంటి గడప ముందే సరుకులు, మందులు అందించగల యంత్రాంగం ఉంది. అందుకే వారు నిశ్చింతగా ఇండ్లలోనే ఉండిపోగలిగారు. గలుగుతున్నారు. ఇంటి వద్దకే పౌష్టిక ఆహారం, మందులు వస్తున్నాయి కాబట్టి, తమకు అదనంగా దొరికిన విశ్రాంతి సమయంలో రోగ నిరోధకశక్తిని మరింతగా పెంచుకుని ఆ మహమ్మారిని తరిమిగొట్ట గలుగుతున్నారు. ఇంతకు మించి ఇందులో ఏ మాయామర్మం, అతీత శక్తుల ప్రమేయం లేదు. ఈ సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. తమ చేతిలో వనరులు తక్కువ ఉన్నా ఉన్నంతలో ప్రజల ఎడల భాధ్యతగా స్పందిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల స్థాయిలో కూడా కేంద్ర పాలకులు స్పందించకపోవడం దారుణం. ఇప్పటికైనా కేంద్ర పాలకులు కండ్లు తెరవాలి. పేద, మధ్యతరగతి ప్రజలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి. యావత్‌ దేశ ప్రజలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇచ్చిన ''భౌతిక దూరం- సామాజిక ఐక్యత'' అన్న నినాదాన్ని తక్షణం అందుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు

తాజా వార్తలు

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

09:51 AM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.