Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
త్యాగానికి విలువ కట్టగలమా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Apr 30,2020

త్యాగానికి విలువ కట్టగలమా?

''సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు
పర్వతం ఎవడికీ వొంగి సలాం చెయ్యదు..'' ఈ పలుకులు కార్మికోద్యమం వెయ్యేనుగుల బలంతో ముందుకు సాగిన రోజుల అడుగు జాడలు. పెట్టుబడితో జరిగే యుద్ధంలో తరాజు 'అటు' మొగ్గడం తాత్కాలికమేనైనా నేడది ఒక నిజం. మన దేశంలో మోడీ సింహాసనాధీశుడైందే దానికి. యంత్రమే తన శత్రువనుకుని యంత్ర విధ్వంసం చేసి ఉరికంబాలెక్కిన బ్రిటన్‌ కార్మికుల త్యాగానికి వెలగట్టగలమా? సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉందన్న తెలివిడి ఎరుకలోకి వచ్చినాక ప్రపంచ కార్మికోద్యమం రాజ్యాధికారం కోసం తన మందుగుండు దట్టించింది. ప్యారిస్‌లో 71రోజులే అధికారంలో వున్న శైశవ కార్మిక రాజ్యాన్ని ఫ్రెంచి పాలకులు రక్తపుటేరుల్లో ముంచారు. ప్యారిస్‌లో జరిగిన తప్పులు సరిచేసుకుంటూ, రైతాంగాన్ని తన సందిట నిలుపుకుంటూ ''లెనిన్‌ తపస్సు, స్టాలిన్‌ సేద్యం జ్వలించిన, ఫలించిన, సమజ్వల తేజం!'' సోవియట్‌ యూనియన్‌ 1917లో ఆవిర్భవించింది. ఆ ప్రయోగమూ 74ఏండ్లే నిలిచింది.
    రాజ్యాధికారం దక్కించుకోడానికి, దక్కిన దాన్ని నిలబెట్టుకోడానికి అనన్య సామాన్యమైన త్యాగాలు చేసింది కార్మికోద్యమం. నేడు మనమున్న పెట్టుబడిదారీ సమాజం, మనకు దృగ్గోచరమైన పెట్టుబడిదారి సమాజం 400యేండ్ల నుంచి ఒకే విధంగాలేదు. ఆధునిక ''ప్రజా స్వామ్యానికి తల్లి''గా పిలువబడే ఇంగ్లండ్‌లో 1838-1848 మధ్య ఉధృతంగా ''చార్టిస్టు ఉద్యమం'' సాగిన తర్వాత గాని ఆస్తితో సంబంధం లేకుండా రాలేదు సార్వత్రిక ఓటు హక్కు. దాదాపు వందేండ్లు పోరాడిన తర్వాతనే (1840-1920) అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. నీగ్రో మగవారి ఓటు హక్కు కోసం 1870లో అమెరికాలో అంతర్యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇదీ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం ''వర్థిల్లిన'' తీరు.
    ఈ నేపథ్యంలో 1886లో పనిగంటల తగ్గింపు కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం గురించి జ్ఞాపకం చేసుకునే రోజు ఇది. కార్మికోద్యమంలో ''హేమార్కెట్‌'' ఘటన కార్మికులకు పాఠం చెప్పడం కోసం సృష్టించబడింది. నమ్మకంలేని వాళ్ళు ఆనాటి ఈ కేసు లాయర్‌ గ్రిన్నెల్‌ జడ్జీల ధర్మాసనానికి చేసిన విజ్ఞప్తి వినండి. ''అమెరికాలో నేడు చట్టం విచారణలో ఉంది. అరాచకత్వం విచారణలో ఉంది. ఈ మనుషుల్ని ధర్మాసనం ఎంపిక చేసిందెందుకంటే వీరు ఆ ఉద్యమానికి నాయకులు. వేలాది మంది వీరి అనుయాయులకు ఒక పాఠంలా ఉండాలంటే, మన వ్యవస్థను కాపాడాలంటే వీరందర్నీ ఉరి తీయండి!''
     చివరికి ''అమెరికన్‌ వ్యవస్థను కాపాడ్డాని''కి నలుగుర్ని ఉరితీశారు. ఉరితీసే ముందురోజు లూయీస్‌ లింగ్‌ జైల్లో తల పేలిపోయి ఆత్మహత్య'' చేసుకున్నాడు. మరో నలుగురిని ఆ తర్వాత మరో జడ్జి విడుదల చేశారు. 8 గంటల పని దినం కార్మికవర్గ విశ్వవ్యాపిత నినాదమైంది. 8 గంటల ప్రాధాన్యాన్ని చెపుతూ కార్ల్‌ మార్క్స్‌ ''పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం పని గంటల్ని అంతకంటే పెంచితే కార్మికుల శ్రమశక్తి క్షీణతనే గాక దాని నైతిక, భౌతిక శక్తుల్ని కూడా దోచుకుంటుంది. శ్రమశక్తి ముందే అలసిపోయేలా చేసి దాని నాశనానికే దారితీస్తుంది.'' (పెట్టుబడి గ్రంథంలో). మనదేశంలో తరాజు అటు మొగ్గడం అంటే ముందుగా బలౌతున్నది 8గంటల పనిదినమే! ఆవురావురుమంటున్న పెట్టుబడిదార్లకు ఆరేండ్ల మోడీ పాలనలో విశృంఖలాధి కారాలు బంగారుపళ్ళెంలో పెట్టి అందించ బడుతున్నాయి. 12 గంటల పనిదినం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు.
   ఎన్నో చూడక్కర్లేదు. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంటు అమలు కోసం మోడీ ప్రభుత్వం పడుతున్న తొందర చూడండి. ఇండిస్టియల్‌ ఎంప్లాయిమెంట్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ చట్టం (1946) రూల్స్‌ను సవరిస్తూ ''సీజనల్‌'' అనే సాకుతో దుస్తుల తయారీ పరిశ్రమలో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉపాధిని 2016లో ప్రవేశపెట్టారు. 2018లో ''దుస్తుల తయారీ'', ''సీజనల్‌'' అనే రెండుమాటల్ని తొలగిస్తూ అన్ని రంగాల్లోని పరిశ్రమలకు దాన్ని విస్తరించారు. పారిశ్రామిక సంబంధాల కోడ్‌ ప్రవేశపెడుతూ ఇప్పటిదాక రూల్స్‌లో వున్న దాన్ని చట్టంలోకే తెచ్చేశారు. శాస్వత ఉద్యోగాల్ని చంపేసి యజమానుల ఇష్టారాజ్యానికి తలుపులు బార్లా తెరవడం కాకమరేంటి?
    ''పరిశ్రమ'' నిర్వచనంలో నుంచి దాతృత్వ సంస్థలు, ధార్మిక సంస్థలు, సంఘసేవా సంస్థల్ని మినహాయించడం, ఇంటిపని వారలను కూడా మినహాయించడంతో పాటు రక్షణ పరిశోధనా, అణుశక్తి, ఇస్రో మొదలైన వాటి గురించి చప్పుడు చేయకపోవడం లక్షలాది మంది కార్మికులకు నష్టం చేసే చర్య. వేజ్‌కోడ్‌ 'చట్టం' అవతారమెత్తేసింది. మిగతా 3కోడ్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. పెట్టుబడిదార్ల అవసరాల రీత్యా ప్రాధాన్యతా క్రమంలో మోడీసాబ్‌ బండి తోలుతున్నట్టున్నాడు. ఐఆర్‌ కోడ్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలన దశ దాటింది.
   ఈ మేడే సందర్భంగా దేశంలో పేట్రేగుతున్న మతోన్మాదం, కులోన్మాదాలు మన ప్రజల మధ్య నిలువు గోడలు నిర్మిస్తున్నాయి. ఏ నిలువు గోడలైతే లేని నూతన భారతావనిలోకి నన్ను నడిపించమని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కోరుకున్నాడో ఆ గోడలే నేడు నిలు స్తూన్నాయి. గతించిన తరం త్యాగల స్మరణే నేడు చాలదు. ప్రస్తుత తరం నడవాల్సిన బాట కష్టజీవుల్ని నడపాల్సినబాట తెలుసుకోవాలి. సివి సుబ్బా రావు చెప్పినట్టు ''జనం భూమిలో సంఘాలు నాటడం నేర్చుకోవాలి.''

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు

తాజా వార్తలు

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.