Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐదో ''సారీ'' | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 13,2020

ఐదో ''సారీ''

కేంద్రం చేయాల్సింది రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. ఉపాధి రంగాలైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.7,500లు ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టం కింద అందరికీ పనులు కల్పించాలి. వీటికి సంబంధించిన ప్రకటనేమైనా చేస్తారేమోనని ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వాలకూ, ప్రజలకూ ప్రధాని ఐదో ''సారీ'' శూన్యహస్తమే విదిల్చారు..!

నిర్దిష్ట ప్రణాళిక, సరైన వ్యూహం, సన్నద్దత లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా విజయం దిశగా పయనిస్తుందని అనుకోవడం ఒట్టి భ్రమ. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలోనూ కేంద్రప్రభుత్వం అనుసరించిన విధానం అలానే ఉన్నది. మూడు విడతలుగా లాక్‌డౌన్‌ ప్రకటించినా ఎక్కడి వేసిన గొంగడి అక్కడే. నాలుగో విడత లాక్‌డౌన్‌ ఉంటుందని ప్రధాని మోడీ సంకేతాలు ఇస్తూనే 'రెండు గజాల దూరం పాటించడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. ఎట్టిపరిస్థితుల్లో పట్టు సడలించకూడదు' అని సీఎంలకు సూచించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారతదేశం సాధించిన ''విజయానికి'' ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని ప్రధాని చెప్పుకోవడం తప్ప.. మూడు దశల లాక్‌డౌన్‌లో కరోనా కేసులు ఎందుకు పెరగాయన్న దానికి సమాధానం లేదు. దేశంతో పాటు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. మరి సుమారు 50రోజుల లాక్‌డౌన్‌ను ఏమి చూసి ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నది ప్రశ్న. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే, వాటికి చేయూతనివ్వాల్సిన కేంద్రప్రభుత్వం చేష్టలుడిగి కూచున్నది. ఆర్థికంగా ఆదుకోండని రాష్ట్రాలు కోరుతున్నా.. ఐదోసారి ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని మోడీ మళ్లీ శూన్యహస్తాలే చూపారు. పైగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గ్రామీణ భారతాన్ని కాపాడాలని మరో కొత్త పిలుపునివ్వడం గమనార్హం. కరోనా కట్టడికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని, ఆదుకోండని ఎంతగా ఘోషించినా ముఖ్యమంత్రులది కంఠశోషగానే మిగిలింది.
కరోనాపై విజయం సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు లాక్‌డౌన్‌ ప్రకటించాలని చెప్పాయి. కానీ అదొక్కటే పరిష్కారం మార్గం కాదని కూడా వక్కాణించాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటూనే ఆర్థికరంగాన్ని కాపాడుకోవాలని సూచించాయి. మన పాలకులు మాత్రం లాక్‌డౌన్‌ ఒక్కటి ప్రకటించి.. విజయం సాధించినట్టుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మొదటిదశ లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజుకంటే మూడోదశ లాక్‌డౌన్‌ ముగింపునకు వచ్చేసరికి కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి చేరింది. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఆర్థికవ్యవస్థ దిగజారింది. ఉపాధి కోల్పోయి కార్మికులు, వలసకూలీలు రోడ్డున పడ్డారు. దీనంతంటికీ లాక్‌డౌన్‌ అమలు విషయంలో మోడీసర్కార్‌ అనుసరించిన నిర్లక్ష్యమే కారణం. మహా గొప్పగా లాక్‌డౌన్‌ ప్రకటించామని భుజాలు చరుచుకుంటే ఏంలాభం? కరోనాను విస్తరించకుండా ప్రజలను, దేశాన్ని రక్షించేందుకు ఏమిచర్యలు తీసుకున్నారన్నది ఇక్కడ ముఖ్యం. ఆ దిశగా కేంద్రం ఏ మాత్రం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదనడానికి దేశంలో నెలకొన్న పరిస్థితులే తాజా ఉదాహరణ. 'తొలి లాక్‌డౌన్‌లో తీసుకున్న చర్యలు రెండో దశలో అవసరం లేదు. రెండో దశనాటి చర్యలు మూడో దశలో అవసరం లేదు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగోదశలో అవసరం లేదు' అని మోడీ అంటున్నారు. అయితే, మూడు దశలుగా తీసుకున్న లాక్‌డౌన్‌లో ఏమి చర్యలు తీసుకున్నారన్నది ప్రశ్న. ఒకసారి సడలింపులు, మరోసారి వలసకూలీలు వెళ్లేందుకు అనుమతులు తప్ప ఆర్థికపరిస్థితిని చక్కదిద్దుకునేందుకు నిధులు ఇవ్వాలన్న రాష్ట్రాల అభ్యర్థనను ఆమోదించేందుకు మోడీ సిద్ధంగా లేకపోవడాన్ని ఏం అనుకోవాలి? ప్రజలకు ఉపాధి కల్పించి, కొనుగోలు శక్తి పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని రకాల సడలింపులు ఇచ్చినా ఉపయోగం ఏముంటుంది?
మార్చిలో రూ. లక్షా 70వేల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించినా అవి ఏ మూలకూ సరిపోలేదు. రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని, అసంఘటిత కార్మికులకు మూడునెలల పాటు వేతనాలివ్వాలని, రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలని, రుణాలు తెచ్చుకోవడానికి ఉన్న పరిమితులు ఎత్తివేయాలని సీఎంలు కోరినా ఇప్పటివరకు ఏ ఒక్కదానికీ ప్రధాని స్పష్టత ఇవ్వలేదు. కానీ కార్పొరేట్ల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మాత్రం వెనుకాముందు ఆలోచించలేదు. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన సంస్థలకు కోట్ల రూపాయల రాయితీలను అందించగలిగారు గానీ, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. పైగా వలసకూలీలను తరలించడం కోసం అయ్యే ఖర్చునూ రాష్ట్రాలపైనే నెట్టింది కేంద్రం. వైద్యఆరోగ్యానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నెల 17 తర్వాత ఎలా ఉండాలో కేంద్రం వద్ద ప్రణాళిక ఉందా? అంటే ఆలోచించాల్సిందే. వైరస్‌ను అరికట్టడం కోసం ప్రధాని చెప్పే విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. ప్రముఖలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ సమయంలో కేంద్రం చేయాల్సింది రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలి. ఉపాధి రంగాలైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.7,500లు ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టం కింద అందరికీ పనులు కల్పించాలి. వీటికి సంబంధించిన ప్రకటనేమైనా చేస్తారేమోనని ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వాలకూ, ప్రజలకూ ప్రధాని ఐదో ''సారీ'' శూన్యహస్తమే విదిల్చారు..!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?
నంగనాచుల కాలంలో..!
వివేచన
వణుకెందుకు...?!
ట్రంప్‌ దారిలోనే బైడెన్‌..
సర్కార్‌ ప్రాథమ్యాలేమిటి?
కాంతిరేఖలు...
అంత జిద్దెందుకు?
చదువు-రాత
'టీకా' తాత్పర్యం

తాజా వార్తలు

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.