Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నీటి వివాదం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2020

నీటి వివాదం

రెండు రాష్ట్రాలు సహనంతో సమస్యను పరిష్కరించుకోవాలి. చొరవ చూపాలి. తాత్సారం పనికిరాదు. నీళ్ల కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఏపీ సర్కారు చర్య తూట్లు పొడుస్తున్నది. కేసీఆర్‌ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన తరుణమిది.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చిచ్చురేపుతున్నది. ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం దాదాపు ఆరేండ్ల తర్వాత మళ్లీ అగ్గిరాజుకుంటున్నది. తొలుత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లిన తెలుగు రాష్ట్రాల పెద్దలు, ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుకునే పరిస్థితులకు కారణమవుతున్నది. ఇందుకు జలవివాదమే కారణం కాగా, అందుకు ఏపీ సర్కారే బాధ్యురాలిగా కనిపిస్తున్నది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్దిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నీటి సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచడమే గాక, హంద్రినీవా దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 30రోజులు తీసుకోవడానికి జీవో విడుదల చేసింది. వాస్తవానికి ఒక ప్రాజెక్టు చేపట్టాలనుకుంటే కేంద్రం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత రాష్ట్రంలో జల వివాదాల పరిష్కారానికి, కృష్ణారివర్‌బోర్డు, గోదావరి రివర్‌ బోర్డు ఏర్పాటయ్యాయి. కొత్త సమస్యల పరిష్కారానికిగానీ, ఏవైనా ప్రాజెక్టుల నిర్మాణానికిగానీ బోర్డు అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే కేంద్రంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ను సంప్రదించాలి. ఆ అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు సీఈలు, కన్వీనర్‌గా కేంద్రం సాగునీటిపారుదల శాఖ సీఈ కలిపి ఐదుగురు ఉంటారు. మొత్తం ఈ వ్యవస్థను పట్టించుకోకుండానే ఇవేవి లేకుండానే ఏకపక్షంగా 203 జీవోను ఏపీ విడుదల చేయడం ఇరురాష్ట్రాల సత్సంబంధాలకు విఘాతం కలిగించేదే. ఈ చర్య రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బకొట్టి, ప్రజల మధ్య శతృత్వాలకూ దారితీస్తుంది. సెప్టెంబరు 28, 2004లో జీవో 107 ప్రకారం శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ 835 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచారు. 854 అడుగులకు తగ్గితే నీటి విడుదలను నిలిపేయాలి. అలాగే 2006, జనవరి 4న ఇచ్చిన జీవో మూడు ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 44వేల క్యూసెక్కులకు పెంచడానికి నాడు శాసనసభలో అందరూ అంగీకరించారు. ఈ రెండు జీవోలను అనాటి సీఎం వైఎస్సార్‌ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమల్లోనే ఉండాలి. కానీ, ప్రస్తుతం ఏపీ సీఎం 203 జీవో ద్వారా అంతకు ముందున్న రెండు జీవోలను బేఖాతరు చేసి పోతిరెడ్డిపాడు నీటి సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచి, అలాగే శ్రీశైలం డెడ్‌స్టోరేజీని 805అడుగులకు కుదించారు. ప్రస్తుతం ఈ జీవో ఏకపక్షంగా విడుదల చేయడంతో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ప్రజల్లోనూ ఆందోళన పెరిగింది. చివరికి తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం బోర్డు చాలా బలహీనంగా ఉందనీ, ఒక దశలో రెండు ప్రభుత్వాలు బోర్డు చేసిన నీటి కేటాయింపులను వ్యతిరేకించడంతో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డు అలా చేయకుండా, తన నిర్ణయాన్ని ప్రకటించి, అమలుజరగకపోతే కేంద్రం పరిధిలో ఉండే అపెక్స్‌ కౌన్సిల్‌కు తెలియజేయాలి. రాష్ట విభజన తర్వాత కృష్ణా నికర జాలాలు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. కానీ, తెలంగాణకు జురాల, రాజోలిబండ కేటాయింపులను నీళ్లు రాక పూర్తిగా వినియోగించడం లేదు. అంటే, తెలంగాణ తన వాటాను కూడా వాడుకోలేకపోతున్నది. ఇప్పుడు 203జీవో అమలైతే దక్షిణ తెలంగాణకు తీవ్రనష్టం జరిగే ప్రమాదముంది. ఏదైనా రెండు రాష్ట్రాల సాగునీటి పారుదలశాఖ అధికారులు చర్చలు, సంప్రదింపుల ద్వారా ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఈ తగాదా పెరిగి రెండు రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగించకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా మిగులు జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నిర్మితమైన ప్రాజెక్టులకు కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పాల్సి ఉంది. ఆ తీర్పురాకముందే హక్కుల గురించి మాట్లాడటం అసంబద్ధమవుతుంది. ఏపీలో ఐదు ప్రాజెక్టులు, తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. పూర్తయిన ప్రాజెక్టులకు మిగులు నీటి వినియోగం జరుగుతున్నది. ఈ కేటాయింపులను కృష్ణాబోర్డు చేస్తున్నది. ఈనేపథ్యంలో కృష్ణాజలాల సమస్యను చట్టబద్దంగా పరిష్కరించుకోవడం సమంజసంగా ఉంటుంది. ఇకపోతే ఏపీ జీవో 203ని అమలుచేస్తే తెలంగాణతోపాటు ఏపీలోని రెండు జిల్లాలు తీవ్ర కరువు, కాటకాలను ఎదుర్కొంటాయి. దుర్భిక్షం ఏర్పడుతుంది. కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీరు అందే ప్రశ్నేలేదు. వీటి పరిధిలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లోని 8లక్షల ఎకరాలకు నష్టం జరగనుంది. తాగునీటి సరఫరాకూ ఆటంకం కలిగే ప్రమాదం లేకపోలేదు. నికర జలాలనూ నష్టపోతారు. కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని వామపక్షాలు చెబుతుండగా, కేసీఆర్‌, జగన్‌ మాట్లాడుకునే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెండు రాష్ట్రాలు సహనంతో సమస్యను పరిష్కరించు కోవాలి. చొరవ చూపాలి. తాత్సారం పనికిరాదు. నీళ్ల కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఏపీ సర్కారు చర్య తూట్లు పొడుస్తున్నది. కేసీఆర్‌ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన తరుణమిది.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?
నంగనాచుల కాలంలో..!
వివేచన
వణుకెందుకు...?!
ట్రంప్‌ దారిలోనే బైడెన్‌..
సర్కార్‌ ప్రాథమ్యాలేమిటి?
కాంతిరేఖలు...
అంత జిద్దెందుకు?
చదువు-రాత
'టీకా' తాత్పర్యం

తాజా వార్తలు

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.