Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అప్పుడు పి.వి.. ఇప్పుడు మోడీ.. | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2020

అప్పుడు పి.వి.. ఇప్పుడు మోడీ..

ఈ సవరణ బిల్లును దేశవ్యాపిత విద్యుత్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఎటువంటి శషబిషలు లేకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ఈ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలి. మరో బృహత్తర పోరాటానికి దేశం సిద్ధం కావాలి.

పి.వి. నర్సింహారావుతో మొదలైంది. మోడీతో పరాకాష్టకు చేరింది. పేరుకి అవి రెండు పార్టీలు. పైగా ఒకదానికొకటి ఆపోజిట్‌ పార్టీలు. మొన్న ఏప్రిల్‌లో 2003 విద్యుత్‌ సవరణ బిల్లు (2020)తో పి.వి. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విద్యుత్‌ ప్రయివేటీకరణ ప్రక్రియకు పెట్టుబడిదార్ల ప్రియతముడన్న తన స్వార్థకతను రుజువు చేసుకున్నాడు మోడీ. దేశమంతా కరోనా కట్టడి కోసం తలమునకలై యున్న వేళ మోడీ ప్రభుత్వం అటు రాష్ట్రాల హక్కులను దెబ్బతీసింది రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తిని నాశనం చేసింది.
2003 విద్యుత్‌ చట్ట (సవరణ) బిల్లు 2020 అర్థం కావాలంటే గత ముప్పయేండ్లలో విద్యుత్‌రంగ ప్రయివేటీకరణకి మన పాలకులు కరిచిన నానాగడ్డి, మూటగట్టుకున్న అపకీర్తి (అసలు ''కీర్తి'' ఉంటేగదా అనేది వేరే విషయం) మన పెట్టుబడిదారులు ఒకర్ని మార్చి ఒకర్ని పాలనలోకి తెచ్చుకున్న తీరు తెలియాలి.
సరళీకృత ఆర్థిక విధానాల రాక అప్పటి వరకు దేశంలో అవలంబించిన అభివృద్ధి నమూనాను తలక్రిందులు చేసింది. ప్రయివేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు వచ్చాయి. అమెరికన్‌ కంపెనీ ఎన్రాన్‌ షరతుల వల్ల మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆదాయమే గాక మహారాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా హారతికర్పూరమైంది. జనరేషన్‌లో ప్రయివేటీకరణ చేదు అనుభవాన్ని ఎన్రాన్‌ మనకు రుచి చూపింది. డిస్కాంల ప్రయివేటీకరణ వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఒరిస్సా మనముందు నిలిచింది. అమలు చేసిన పాలకుల పదవులు ఊడాయి.
పట్టువదలని పెట్టుబడిదారులు పాలకుల్ని మార్చి మార్చి చూస్తున్నారు. వాజ్‌పారు ప్రభుత్వ హయాంలో అప్పటిదాక ఉన్న విద్యుత్‌ చట్టాలన్నింటిని రద్దుచేస్తూ విద్యుత్‌ చట్టం 2003 అవతరించింది. అందులో ప్రయివేటువారికి అప్పనంగా లాభాలు కట్టబెట్టే అనేక అంశాలున్నా, అందులో కొన్ని అమల్లోకొచ్చినా ఆ పానకాల స్వాముల కడుపులు నిండలేదు. గుజరాత్‌లో పన్నెండేండ్లపాటు తన ''శక్తి సామర్థ్యాలు'' రుజువు చేసుకున్న మోడీని ఢిల్లీలో ప్రతిష్టించుకున్నారు. వెనువెంటనే విద్యుత్‌ చట్టం (సవరణ) బిల్లు 2014 లోక్‌సభలో ప్రవేశించింది. విద్యుత్‌రంగంలోని ఉద్యోగ సంఘాలేకాక అధికార్లు, ఇంజనీర్లు కూడా ప్రతిఘటించడంతో ప్రభుత్వం ముందుకు సాగలేకపోయింది.
లోక్‌సభలో బీజేపీ బలం పెరగడం, కాంగ్రెస్‌ చేష్టలుడిగి ఉండటం, వామపక్షాలు తప్ప మిగిలిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉండటం, అన్నింటికీ మించి దేశమంతా నేడు కరోనా పరేషాన్‌లో మునిగిపోయి ఉండటం.. ఇంతకుమించిన అవకాశం ఇంకేముంటుంది పెట్టుబడిదారులకు! ఈ నేపథ్యంలో విద్యుత్‌ సవరణ బిల్లు అసలు స్వరూపాన్ని చూద్దాం.. ఈ సవరణ ప్రజలపై భారాలు పెంచేది. ప్రయివేటీకరణ పూర్తిస్థాయిలో ద్వారాలు తెరిచేది. పైగా ప్రయివేటు కంపెనీలకు ఏ రిస్కు లేకుండా లాభాలు గ్యారంటీ చేసేది..
ముప్పయేండ్ల పాటు చేసిన ముసుగులో గుద్దులాటలు వద్దనుకుంది మోడీ పాలన. పైగా కరోనా 'మౌకా'లో తేలిగ్గా పాస్‌ చేసుకోవచ్చనేది మోడీ అండ్‌ కంపెనీ దురాలోచన! డిస్కాంల కింద సబ్‌లైసెన్సీలు, ఫ్రాంచైజీలకు వినియోగదారులకు సంబంధించిన ఏ బాధ్యతా లేకుండా ఇప్పుడున్న డిస్కాంలపై తోసేసి లాభాలు దండుకునే పని మాత్రం మిగిల్చింది ఈ సవరణ. ప్రయివేటు ఉత్పత్తి దారులు వినియోగదారుల నుంచి గోళ్ళూడగొట్టైనా తాము అమ్మిన కరెంటుకు వందశాతం రాబట్టుకోవాలనేది ఇంతకాలం ఆశ. ప్రకృతి విపత్తులొచ్చినా ప్రస్తుతంలా కరోనా మహమ్మారి విరుచుకు పడినా ప్రజలు బిల్లులయితే కట్టాలట! లేదా ప్రభుత్వాలు ఆ నష్టాన్ని భరించాలట! ప్రయివేటు కంపెనీల నుంచి విద్యుత్‌ కొనే ముందే అప్పుపత్రం రాసివ్వడమో, తన ఆస్తులను తాకట్టు పెట్టుకోవడమో, 'ఎస్క్రో' అకౌంట్‌ ద్వారా చెల్లించే ఏర్పాటో చేయాలని ఈ సవరణ పేర్కొంది. దానికోసం చట్టరీత్యా హక్కులు గల 'ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ' ఏర్పాటు చేస్తారట!
రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌ సభ్యుల్ని సైతం జాతీయస్థాయిలో ఎంపిక చేయడమంటే రాష్ట్రాలకున్న హక్కుల్ని కుదించడమే. వాటిని ప్రేక్షక పాత్రలోకి నెట్టడమే! క్రాస్‌ సబ్సిడీ విధానం గత దెబ్బయేండ్లుగా అమలవుతోంది. ధనికులనుంచి, వాణిజ్య వినియోగదారుల నుంచి భారీ పరిశ్రమల నుంచి కాస్ట్‌ టు సర్వ్‌ కంటే అధికమొత్తం టారిఫ్‌ వసూలు చేసి గృహ, వ్యవసాయ వినియోగదారులకు సబ్సిడీ ఇస్తారు. ఈ క్రాస్‌ సబ్సిడీని ఈ సవరణ బిల్లు తీసివేస్తుంది. అంటే ధనికులకు భారం తగ్గుతుంది. పేదలకు పెరుగుతుంది. విద్యుత్‌ ఎగుమతి, దిగుమతి వ్యాపారం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందట. అంటే ఇరాన్‌ నుంచి గ్యాస్‌పైప్‌లైన్‌ వేసినట్టు ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు వేసుకుంటే?! చౌక విద్యుత్‌ వచ్చిపడితే మన జనరేషన్‌ కేంద్రాలనేమిచేసుకుంటాం? ఇప్పుడున్న ఉద్యోగులందర్ని ఏమిచేస్తారు?
అందుకే ఈ సవరణ బిల్లును దేశవ్యాపిత విద్యుత్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఎటువంటి శషబిషలు లేకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ఈ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలి. మరో బృహత్తర పోరాటానికి దేశం సిద్ధం కావాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు

తాజా వార్తలు

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.