Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ను ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్, వైసీపీ ఎంపీలు కలిశారు. పోలవరం నిధులు విడుదల చేయాలని కోరారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్.. త్వరలో కేంద్రం రూ.1850 కోట్లు విడుదల చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. పోలవరం 65 శాతం పూర్తయిందని టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఇప్పటివరకు 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని వివరించారు. 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు.