Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ది కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోనే సాధ్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎకె. మురుగేశ్ అన్నారు. మంగళవారం మననగరం పది రోజుల ప్రణాళికలో భాగంగా మల్లికార్జునగర్లో పుడూరు చందర్, పల్లే సత్యం వంశరాజ్ ఆధ్వర్యంలో గుంతలుగా మారిన రోడ్లలో మట్టిపోయించి చదును చేయించారు. ఈ సందర్భంగా ఎకె. మురుగేష్ మాట్లాడుతూ..జవహర్నగర్ అభివృద్ధి మంత్రి మల్లారెడ్డితోనే సాధ్యమని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమ ంలో తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పిన్నోజు సుధాకర్ చారి, సహాయ కార్యదర్శి కావలి సత్యనారాయణ యాదవ్, ప్రచార కార్యదర్శి మొగిలిపాక పరుశురాం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కోనేరు భాస్కర్, టీఆర్ఎస్వీ అధ్యక్షులు నర్రామహేష్, జక్కుల భాస్కర్, ఆనంద్, శివ కాలనీ వాసులు పాల్గొన్నారు.