Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్పేట్
కాచిగూడ రైల్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు చికిత్స అందిస్తుంటే రైల్వే అధికారు కార్పొరేట్ ఆస్పత్రైన కేర్కు తరలించడం ఎంటని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ..తీవ్రగాయాలతో వచ్చిన క్షతగాత్రులకు చికిత్స అందిస్తుంటే ప్రభుత్వ అధికారులు మరో ఆస్పత్రికి తరలించడం ఎంటని ప్రశ్నిం చారు. ఇక్కడ కంటే అక్కడ అంతగా ఏం వైద్యం అంది స్తారన్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక తరలిం చార అని విలేకర్లు అడగగా. స్పందించిన సూపర్వైజర్ ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని వీటిని కాదని రైల్వే అధికారులు ఎందుకు తరలించారో తెలవదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత ప్రమాద పరిస్థితులో వచ్చిన క్షతగాత్రులకు వైద్య సేవలందించేందుకు వివిధ విభాగాల వైద్యుల బృందం అందుబాటులో ఉందన్నారు.