Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
నిజాం కాలంలో ఊర్లెట్టుండె? | జాతర | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతర
  • ➲
  • స్టోరి
  • Jun 26,2018

నిజాం కాలంలో ఊర్లెట్టుండె?

కాలం గడిచేకొద్దీ మానవ జీవితంలో రకరకాల మార్పులు చోటుచేసుకొంటూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఉండి పాతకాలపు విషయాలను తెలుసుకుంటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం మారిన పరిస్థితులే. ఒక సమాజం మున్ముందుకు పోవాలంటే దాని గతకాలపు సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే సాధ్యం. అందుకే రెండుమూడు వందల క్రితం మన తెలుగు నేలపై ఉన్న జనజీవనాన్ని పాఠకుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నది 'జాతర'.
వందల ఏండ్ల క్రితం మన గ్రామాలన్నీ ప్రాకారం కలిగి ఉండేవి. ప్రాకారంలోపలే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ స్వయం సమృద్ధంగా గ్రామీణులు నివసించేవారు. వ్యవసాయం ముఖ్య వృత్తి. కర్రనాగలితో ఎడ్ల సహాయంతో పొలం దున్నుకుంటూ, బావినుంచి కాని, ఏటినుంచికాని నీటిని తెచ్చి వ్యవసాయం చేసేవారు. వైశ్యులు దుకాణంలో నిత్యావసర సరుకు అమ్ముతూ అవసరం ఉన్నవారికి అప్పులు అధిక వడ్డీలకు ఇస్తూ ఉండేవారు. ఊరు మధ్య గ్రామచావడికొచ్చేటప్పటికి ( ఆంధ్రప్రాంతంలో) గ్రామమునసబు కచ్చేరిలో పనిచేసే గుమస్తా, తాటియాకుల చాపమీద కూర్చొని పక్షి ఈకలతో పద్దులూ, గ్రామ లేఖలు రాస్తూ, రైతులు అప్పుల కోసం రాసి ఇచ్చిన పత్రాలు పరీక్షిస్తూ పెద్ద చెట్టుకింద అరుగుమీద కూర్చొని ఉన్న గ్రామ మేజిస్ట్రేటుకు, తగాదాలు తీర్చడానికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరికరణం భూముల మీద పన్నులు నిర్ణయించి, వసూలు చేసేవాడు. కాని మునసబు ప్రజల మధ్య వచ్చే తగాదాలన్నిటినీ పరిష్కరించేవాడు. జమిందారులు రైతుల వద్ద నుంచి పంటలో భాగం స్వీకరిస్తూ... పండుగ రోజుల్లోను, ఇతర శుభ సమయాల్లోనూ వారికి కానుకలు ఇస్తుండేవాడు.
ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆంధ్ర దేశంలో అధికారం చేపట్టిన దగ్గరి నుంచి బ్రాహ్మణులు బ్రిటిష్‌ ఉద్యోగస్తులకు దుబాసీలుగా వ్యవహరించడం ప్రారంభించారు. అంటే ఇంగ్లీషు నేర్చుకున్న బ్రాహ్మణులు బ్రిటటిష్‌ వాళ్లు స్థానిక తెలుగువారితో మాట్లాడేటప్పుడు తెలుగు అనువాదకులుగా ఉండేవారన్నమాట. అట్లాగే భూమి శిస్తులూ, ఇతర పన్నులు, ఉప్పు పన్ను వంటివాటికి వేలంపాటదారులుగా ఉండేవారు. పన్నుల వసూలులోనూ కీలక పాత్ర పోషించేవారు. వేదమత ప్రవక్తలుగా, ఆచార్యులుగా ఉంటూ వచ్చిన బ్రాహ్మణులు కంపెనీ రాకతో ప్రభుత్వోద్యోగులుగా మారారు. వాళ్లు గ్రామ మధ్యభాగంలో నివసించేవారు. వారి వెనుక కోమట్లు నివసించేవారు. ఊరి పరిసరాల్లో శూద్రులు నివసించేవారు. బంగారు, వెండి పనులు చేసే కంసాలులు, ఇతర సామాన్లు చేసే కమ్మరులు, కర్రపనులు చేసే వడ్రంగులు, కుండలు చేసే కుమ్మరులు, ఇండ్లు కట్టే మేస్త్రీలు, నేతపనిచేసే పద్మసాలీలు, బట్టలు ఉతికే చాకళ్లు, క్షురకర్మ చేసే మంగళ్లు, చెప్పులు కుట్టే మాదిగలు, చాపలు, బుట్టలు అల్లే మేదర్లు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులను అవలంబిస్తూ ఉండేవారు. కొంతమంది తమ తమ పనిముట్లతో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వీధులమ్మట తిరుగుతూ ఇంటింటా పనులు చేసేవారు. కమ్మరివారు కొలిమి ఊదే మనిషిని వెంటబెట్టుకొని కొలిమితో సహా ఇంటింటికీ తిరిగి పనిచేసేవారు. వడ్రంగులు కూడా అట్లాగే ఇండ్ల వెంట తిరుగుతూ పనిచేసేవారు. కర్ర మగ్గాలు వీధుల్లో భూమిలో పాతి అద్భుతమైన వస్త్రాలను నేసి విదేశాలకు సైతం ఎగుమతిచేశారు. స్థానిక అవసరాలకు సరిపడే దుస్తులను నేసేవారు. బట్టలకు రంగుల అద్దకాలు వేసేవారు. బట్టలపై రంగులు, అలంకరణలు చిత్రించి ఉతికినా మాయని రంగులతో అద్దేవారు.
విదేశీ వస్తువుల నిరాకరణ
ఇక సామాన్య ప్రజలు నిరాడంబరమైన స్వచ్ఛమైన జీవనం గడిపేవారు. ఇప్పటిలా కాగితాలు, పెన్నులు, పెన్సిళ్లు వారికి తెలియవు. వారు తాటాకులపై గంటాలు, పక్షి ఈకల కొనలతో రాసేవారు. ఇక్కడి హస్తకళావస్తువులు, చేనేత వస్త్రాలను విదేశీయులు ఎంతో ఇష్టంతో కొనేవారు. కానీ విదేశాల నుంచి దిగుమతైన వస్తువులను స్థానికులు కొనడానికి ఇష్టపడేవారు కాదు. ఈ సంగతిని ఈస్టిండియా కంపెనీ ఐదవ నివేదిక ఇట్లా పేర్కొంటున్నది.... ''ఎంత భాగ్యవంతుడైనా సామాన్య ప్రజల్లాగానే ఇంగ్లీష్‌ దేశపు గుడ్డలన్నా, ఇతర దేశ వస్తువులన్నా కొనడానికి ఇష్టపడేవారు కారు. ఒక వేళ తండ్రులు ఇంగ్లీషు వస్తువులను కొని ఉంటే కొడుకులు వాటిని పారవేసేవారు. ఎక్కువ ధరల భయం వల్ల కాక, విదేశీవస్తువులు ఏవీ కూడా మనదేశపు వస్తువులతో నాణ్యతలోకాని, చక్కదనంలో కాని ఎక్కువైనవి కాకపోవడమే కాకుండా మన సరకు కంటే చాలా హీనమైనవని, ధృడమైనవనీ నమ్మడమే విదేశీ వస్తు నిరాకరణకు ముఖ్య కారణం''
హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో ఉండే బ్రిటిష్‌ రెసిడెంట్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''నిజాం ఎప్పుడూ ఇంగ్లీషు వస్తువులమీదకాని, యూరోపియన్‌ వస్తువుల మీద కాని మోజు చూపించేవాడు కాదు. ఆయనకు కానుకలుగా పంపిన శాలు వలు, ఉన్ని వస్త్రాలు, గుర్రాలు, ఒంటెలను, ఏనుగులను కప్పడానికి వినియోగించేవాడు. ఇంగ్లీషు అధికారులు ఎంత విలువైన కానుకలు తెచ్చి ఇచ్చినా వాటినన్నిటినీ పర్షియా, చైనా, ఫ్రాన్సు వంటి విదేశాలు పంపించిన అమూల్యమైన కళాసంపదలలాగా ఇంగ్లీషువారు పంపిన కళాసంపదను కూడా ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచడానికి పంపేవాడు.
సొంత ఊరే ప్రపంచం
గ్రామ ప్రజలకు వారి ఊరే దేశం అనే భావన ఉండేది. దేశంలో వచ్చి పోయే ప్రభుత్వాలతో పనిలేకుండా నిత్యావసరాలన్నీ గ్రామంలోనే సమకూర్చుకొని స్వయం పోషకంగా ప్రజలు జీవించేవారు. దొంగల బారి నుంచి తప్పించుకోడానికి ప్రతీ గ్రామం చుట్టూ ఎత్తయిన పెద్ద ప్రహరీ గోడలు నిర్మించుకొనేవారు. అయిదారు ఇండ్లు ఉన్న చిన్న ఊరు కూడా ఎనిమిది అడుగుల ఎత్తయిన రాతిగోడతో ఆవరించి ఉండేదని ఫ్రాన్సిస్‌ బుఖానన్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. రాయలసీమ గ్రామాల గురించి 1802లో మన్రో ఈస్టిండియా కంపెనీకి రాసిన లేఖలో కూడా ఎంత చిన్న పల్లె అయినా మట్టిగోడ కాని, రాతిగోడ కాని పెట్టుకొని ఉండటం మామూలు విషయం అని రాశాడు. ఆయనే నాటి ప్రజా జీవితం గురించి ఇంకా ఇట్లా పేర్కొన్నాడు... ''నేను కనిపెట్టినదాన్నిబట్టి చూస్తే ఆంధ్రదేశ ప్రజలు హిందువులంతా కూడా వారి సామాన్య జీవన విధానాన్ని అనుసరించడం తప్ప కొత్త పద్ధతులను అనుసరించే అభిలాష కలిగినవారు కారు. వారికేమైనా సభ్యత ఉందా అని అడిగితే, దానికి సమాధానం అనుభవాన్ని ఆధారం చేసుకొని చేసే వ్యవసాయం, అనన్య ప్రతిభావంతమైన హస్తకళా నైపుణ్యం; భాగ్యవంతులకు కాని, సామాన్య ప్రజల అవసరాలకుగాని, కావాల్సిన వస్తువులను తయారు చేయడంలో ప్రావీణ్యం; ప్రతి గ్రామంలో చదువను, రాయను, గణిత శాస్త్ర బోధన పిల్లలకు అలవరచడం, గృహస్థ జీవితంలో ఆతిథ్యం, ఔదార్యం, పరోపకార బుద్ధి, ఆడవారిమీద భక్తి, గౌరవాలతో సున్నితంగా, మర్యాదగా చూడటం నాగరికతా లక్షణాలుగా పరిగణిస్తే ఈ రకమైన సభ్యత ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక అంశంగా లెక్క పెడితే ఇంగ్లాండు ఈ రకమైన సభ్యతని దిగుమతి చేసుకోవడంతో ఎంతో లాభసాటి వ్యాపారం సాగించిందని నా అభిప్రాయం'' అంటూ 1813లో ఒక కమిటీ ముందు ఇచ్చిన సాక్ష్యంలో పేర్కొన్నాడు మన్రో.
- రమణ

నిజాం కాలంలో ఊర్లెట్టుండె?
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహాత్మా రావణ మైదానం
భావ సంఘర్షణకు ప్రతీక ఎల్లమ్మ కథ
చారిత్రక ఆవశేషాల మాలిక బాసరబాసర
దక్కన్‌ చరిత్ర, సంస్కృతులసై అంతర్జాతీయ సదస్సు
చరిత్ర, సంస్కృతులు ఉమ్మడి ఆస్తులు
ఇదో అద్భుత అంకం
మళ్లీ ఊపందుకుంటున్న జోగిని ఆచారం
బహమాస్‌ సంస్కృతి
ప్రాచీన మార్గాల్లోనే కొత్త రహదారులా!
చెక్క భజన కళారూపం
భయం, విస్మయం, చాతుర్యం కలిస్తే... కాటిపాపలు
అలనాటి గ్రామ న్యాయాధికారి
బంగారాన్ని తయారుచేయాలని...
యుద్ధం తెచ్చిన పరివర్తనతో...
దీవనార్తి నుంచి భాగోతాల వరకు...
జ్యోతి నృత్యం
గోత్రాలవారు ఎవరు?
డబ్బు, అధికారం చేతుల్లో కళ
అనుకరణలు
కుక్కమాంసానికి ఓ ఫెస్టివల్‌
అందాన్ని పెంచుకుంటూ...
నృత్యం అనాది నుండి కొనసాగుతున్న ఒక సహజాతం
రుద్రదమనుని జునాగఢ్‌ శాసనం
హైబ్రీడ్‌ సంస్కృతి సృష్టే ప్రపంచీకరణ లక్ష్యం
కత్తుల నృత్యం
సపాదలక్ష దేశం ఇప్పుడెక్కడున్నది?
వేదాలు లోపాలకు అతీతం కాదని...
పాములనాడించడం ఓ కళాత్మక విన్యాసం
లటుక ఆచారం
రేణుకా పరంజ్యోతి పెండ్లి
Sundarayya

Top Stories Now

నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi
badla
crore

_

తాజా వార్తలు

09:45 PM

హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట

09:27 PM

జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్

09:18 PM

సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్

09:12 PM

పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ

09:05 PM

అమర జవాన్లకు ప్రముఖుల నివాళి

09:02 PM

22 నుంచి శాసనసభ సమావేశాలు

08:58 PM

మార్చి 31 వరకు రోజూ 30 విమానాలు రద్దు: ఇండిగో

08:50 PM

అభ్యర్థులకు పరీక్ష పెడుతున్న జనసేన

08:40 PM

సానియా మీర్జాపై నెటిజన్ల ఆగ్రహం

08:27 PM

అమరజవాన్లకు దేశవ్యాప్తంగా ఘననివాళి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.