Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరిఖని : పట్టణంలోని విఠల్నగర్లో చొప్పరి భూమయ్య(52) బుధవారం ఇంటి ముందు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు జిడికె-11ఇంక్లైన్లో కన్వేయర్ ఆపరేటర్గా పనిచేస్తూ గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం తెల్లవారుజామున అతని భార్య లేచి బయటకు రాగా ఇంటి ముందు ఉరి వేసుకుని కనిపించాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.