Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీడీఐ అండ్ పీ ఆర్ఎస్ వెంకటేశ్వర్రావు
నవతెలంగాణ-వీణవంక
కళాకారులకు ప్రోత్సాహం అందిస్తామని డీడీఐఅండ్పీఆర్ ఎస్ వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం మండలంలోని చల్లూర్ గ్రామంలో కరీంనగర్ జిల్లా సాంస్కృతిక సంస్థల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాటాల్డఉతూ కళాకారులకు మా నుండి ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని అన్నారు. కళలను ప్రోత్సాహించడం ముఖ్యఉద్దేశ్యమని అన్నారు.కళలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. అనంతరం కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం డీడీని సన్మానిచంఆరు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్ణజయ, సర్పంచ్ రాజమల్లు, ఎంపీటీసీ శంకర్, జిల్లా సాంస్కృతిక సంస్థల అధ్యక్షులు వైఎస్ శర్మ ,ఉపాధ్యాక్షులు రాజేశం పాల్గొన్నారు.