Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములవాడ
రాజన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు వేకువజామునే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరారు. కోడమొక్కులు చెల్లించుకున్నవారికి గంటకు పైగా సమయం పట్టడంతో స్వామివారి దర్శనానికి మరో 2గంటలు సమయం పట్టింది. క్యూలైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
పప్పు ఫలహారం ఆట వస్తువులకు వేలం
వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన నాంపెల్లి లక్ష్మీనర్సింహస్వామి గుట్టపైన పప్పు పలహారం, ఆట వస్తువుల అమ్మకం కోసం శనివారం ఆలయ ఓపెన్ స్లాబ్పై ఏఈవోలు హరికిషన్, ఉమారాణి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. నాలుగు మాసాల వ్యవధి కోసం హెచ్చు పాటదారునిగా మల్లేశం రూ.60వేలకు వేలాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఈఈ రాజేశ్, ఆలయ సూపరింటెండెంట్లు ప్రతాప నవీన్, తిరుపతిరావు, గోలి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ నరేందర్ పాల్గొన్నారు.