నవతెలంగాణ-కరీంనగర్ రూరల్
ఐవివై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆరెపల్లి డివిజన్ లో 100 పెద్దమ్మల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ హాజరై మాట్లాడుతూ.... లాక్ డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తుల బాలయ్య, తహశీల్దార్ సుధాకర్,ఆర్ఐ భావని పాల్గొన్నారు.
తిమ్మాపూర్ : బతుకుదెరువు కోసం కుర్చీలు అమ్ముకోవడానికి రేణికుంటకు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వలస కూలీలకు తిమ్మాపూర్ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఆధ్వర్యంలో సరుకులు, బియ్యం అందజేశారు. 25 కిలోల బియ్యాన్ని బొంగని పరశురాములు, కూరగాయలు, నగదును చల్ల శ్రీధర్ రెడ్డి ఇచ్చారు. వీరిద్దరిని వైస్ ఎంపిపి ల్యాగల దేవేందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో బోయిని సతీష్, కొఅప్షన్ సభ్యులు కనపర్తి చంద్రశేఖర్, కనపర్తి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
రేణికుంట కరీంనగర్ డెయిరీ చైర్మన్ తమ్మనవేని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల సభ్యులకు ప్రతి సభ్యునికి మాస్కులు అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీరారెడి,్డల్యాగల వెంకటరెడ్డి, బుర్ర ప్రశాంత్ పాల్గొన్నారు.
ఎలిగేడు: మండలంలోని ధూళికట్ట గ్రామ శివారు ప్రాంతంలో గుడారాలు వేసుకొని ఉంటున్న 9మంది బీహార్ వలస కార్మికులకు మౌలిష్ , పడాల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, శివ రామక ష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ : మల్లాపూర్ మండల కేంద్రంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఎస్ఐ రవీందర్ పోలీస్ సిబ్బందితో కలిసి నిత్యావసర సరుకులను సోమవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇంటిలో నుంచి బయటకు వెళ్ళవద్దన్నారు. నిరుపేదలకు అందుబాటులో ఉంటామని అన్నారు. మండల కేంద్రంలో పాత్రికేయులకు మొగిలిపేట గ్రామ సర్పంచ్ వనతడుపుల నాగరాజు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్, ఏనుగు రాం రెడ్డి, వంగ శేఖర్, శరత్ పాల్గొన్నారు.
కోరుట్ల టౌన్ : కోరుట్ల మున్సిపల్ పారిశుధ్ద్య కార్మికులకు మున్సిపల్ కమిషనర్ అయాజ్, సిఐ రాజశేఖర్రాజు మాస్కులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ డిఇఇ ప్రభాకర్రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, రాజయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్ :నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పలువురు దాతలు నిర్వహించిన సరుకుల పంపిణీ కార్యక్రమంలో మేయర్ సునీల్రావు పాల్గొని నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. రేకుర్తిలో దాత గోళ్ళ కిష్ఠయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్, మల్లేశంతో కలిసి నగర పారిశుధ్య కార్మికులకు బియ్యం , కూరగాయలు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం 11 వ డివిజన్ కట్ట రాంపూర్, గౌతమీ నగర్ లో స్థానిక కార్పోరేటర్ ఆకుల నర్మద నర్సయ్య తో కలిసి బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. కరీంనగర్ డెయిరీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ సహాకారంతో 13, 34, 35, 36, 54 డివిజన్ లో పని చేసే నగరపాలక సంస్థ కార్మికులకు పది రకాలతో కూడిన నిత్యవసర సరుకులను స్థానిక కార్పో రేటర్లు చొప్పరి జయశ్రీ, బచ్చిరెడ్డి, గుగిళ్ళ జయశ్రీ, షఖీరా అంజూమ్ బర్కత్ అలీ, ఇఫ్రా తహిరీన్ తో కలసి నగర మేయర్ సునిల్ రావునిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.
నగరంలోని స్వర్ణ కార సంఘం అధ్యక్షుడు ముత్తోజు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘ భవనంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావుల రమేష్, ఉపాధ్యక్షులు తాడూరి ప్రకాష్, కోశాధికారి కట్టా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రాయికల్ : ఆపద వేళలో నిరుపేదలను వలస కూలీలను ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు. రాయికల్ పట్టణంలోని వర్తక సంఘం ఆధ్వర్యంలో 70మంది ఆటో డ్రైవర్లకు, రంజాన్ సందర్భంగా కాంట్రాక్టర్ నయీం 60మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు, ఇటిక్యాల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు 8 మంది కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి 40మంది మహారాష్ట్ర వలస కూలీలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఎస్సై ఆరోగ్యం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు ఎలిగేటి దివ్య అనీల్, మహేష్, మహేందర్, కాంతారావు, సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, ఎంపీటీసీ కొమ్ముల రాధఆదిరెడ్డి పాల్గొన్నారు.
ధర్మారం రూరల్ : తెలంగాణ రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా ధర్మారం మండలంలోని వివిద గ్రామాల్లో పేదలకు నిత్యవసర సరుకుల పంపిణి చేసారు. కటికెనపల్లి గ్రామంలో సర్పంచ్ కారుపాకల రాజయ్య, ఎంపిటిసి సూరమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యవసర సరుకులతో పాటు 4 వందల మాస్కులను ఎంపిపి ముత్యాల కరుణశ్రీ, జడ్పిటిసి పూస్కూరి పద్మజ పంపిణీ చేసారు. కొత్తపల్లి సర్పంచ్ కోమటిరెడ్డి లలిత ఆధ్వర్యంలో 35 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులతో పాటు ఒక్కొక్కరికి 4 వందల రూపాయల నగదు అందజే సారు. బొట్లవనపర్తి గ్రామాభివృద్ది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 60 మందికి నిత్యవసర సరుకులను అందజేసారు. ఈ కార్యక్రమాల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జితేందర్రావు, నందిమేడారం పిఎసిఎస్ బలరాంరెడ్డి, ఎఎమ్సి చైర్మెన్ గుర్రం మోహన్రెడ్డి, పెంచాల రాజేశం, బుచ్చిరెడ్డి, ఎండి రఫి,రేండ్ల నర్సయ్య, సాయి పాల్గొన్నారు.
కోల్సిటీ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 62వ జన్మదిన వేడుకలను విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో టిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి, రోగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు తోడేటి శంకర్గౌడ్, దుర్గం రాజేశం అచ్చ వేణు నూతి తిరుపతి నీలం బిక్షపతి మెతుకు దేవరాజ్ బొడ్డు రవీందర్ బక్కి కిషన్ పాల్గొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిఆర్ఎస్వి నాయకుడు అహ్మద్ పాషా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా పాత్రికేయులకు మాస్కులు అందజేశారు.
బోయినిపల్లి : బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో రాజ్యసభ సభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలువు మేరకు జోగినిపల్లి రవిందర్ రావు ఆధ్వర్యంలో గత 13 రోజుల నుండి ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు, సోమవారం నాడు 100 మంది వలస కూలీలకు అన్నదానం తో పాటు 12 కిలోల బియ్యం, 500రూపాయల నగదును జెడ్పిటిసి ఉమ కొండయ్య అందజేశారు. నాయకులు చిఖ్యల సుధాకర్రావు, సందిలా శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, బొల్లావేని తిరుపతి ఒజ్జెల మహేందర్, సారంపెళ్లి రవి పాల్గొన్నారు.
రుద్రంగి : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడతామని చందుర్తి సిఐ వెంకటేష్ అన్నారు.రుద్రంగి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ తో పాటు తహసిల్దార్ తఫాజూల్ హుస్సేన్, ఎంపీడీవో శంకర్,ఎస్సై వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏఎస్ఐ ఖాజా మొయినుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్,కానిస్టేబుల్ రాజశేఖర్, వికాస్, సురేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
రంజాన్ సమయంలో ఎవరు సామూహిక ప్రార్థనలు చేయొద్దని సీఐ వెంకటేష్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
రుద్రంగి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు వంద మందికి రుద్రంగి సర్పంచ్ తర్రె ప్రబలత మనోహర్ మాస్క్ లను పంపిణీ చేశారు.
వెల్గటూర్ : తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ జాగృతి మండల శాఖ, పార్థ ప్రసూతి, పిల్లల హాస్పిటల్ జగిత్యాల డాక్టర్ అంకం లక్ష్మణ్-అరుణ సహకారంతో మండల పాత్రికేయులకు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో వేలి ముద్రలు రాని వృద్ధులకు, జిల్లా కార్మిక ఉపాధి విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు సిగిరి ఆనంద్, ఎంపీటీసీ పోడేటి సత్తయ్య ఆధ్వర్యంలో ఒక్కొరికి 10కిలోల బియ్యం, కూరగాయలు, అలాగే వెంకటాపూర్ గ్రామంలో నలుగురు వికలాంగులకు పంపిణీ చేశారు. చెగ్యాం గ్రామ సర్పంచ్ రామీళ్ల లావణ్య సనీల్ 3క్వింటాళ్ల బియ్యం నిరుపేద కుటుంబాలకు చెందిన 30 మందికి పంపిణి చేయడం జరిగింది. వెల్గటూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒడ్డెర వారికి ఒడ్డెర కాలనీలో 30 కుటుంబాలకు, గ్రామంలో నిరుపేదలకు 17 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమాలలో ఎంపీటీసీ పోడేటి సత్తయ్య,మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ అల్లం దేవమ్మ, మాజీ సర్పంచ్ అల్లం శంకరయ్య పాల్గొన్నారు.
శంకరపట్నం : బీజేపీ రాష్ట్ర దళిత మోర్చ కార్యదర్శి, పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు మండలంలోని పాత్రికేయులు, ఆశ వర్కర్లకు నిత్యావసర సరుకులను శానిటైజర్లు, మాస్క్లు పంపిణీ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం రూ.20వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐలయ్య కేశవపట్నం ఎంపిటిసి2 ఏనుగుల అనిల్, నాయకులు సమ్మిరెడ్డి, కొమురయ్య, వెంకట్ రెడ్డి శ్రీనివాస్, జైపాల్ సమ్మయ్య పాల్గొన్నారు.
Authorization