మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు
నవతెలంగాణ-రాయికల్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసర సరు కులు అందించడం భేష్ అని మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు తెలిపారు. పట్టణంలో రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30మంది నిరుపేద కుటుంబాలకు ఆదివారం 15రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్ర మాలు చేపట్టాలని ఈ సందర్భంగా సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ బత్తి ని భూమయ్య, అధ్యక్షుడు మ్యాకల రమేష్, డీసీ చౌడరపు లక్ష్మీనారాయణ, కార్యదర్శి అంజిరెడ్డి, కోశాధి కారి వాసంప్రసాద్, సభ్యులు వాసం స్వామి, మచ్చ శేఖర్, బొలసాని ఆంజనేయులు, కాటిపెల్లి రాంరెడ్డి, కొత్తపెల్లి రంజిత్, కడకుంట్ల జగదీష్ పాల్గొన్నారు.
'మేము సైతం' ఆధ్వర్యంలో..
కరీంనగర్ టౌన్ : నగరంలోని మేము సైతం యువ సేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చకిలం స్వప్న, శ్రీనివా స్, రూప, అనురూప్ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్లకు 25 కేజీల బియ్యం బ్యాగ్లను అందించారు. ఈ సందర్భం గా ఫౌండేషన్ అధ్యక్షులు చకిలం స్వప్న-శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యం లో వార్త సమాచారాలను ప్రజలకు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు సహాయం చేయాలని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేశామన్నారు. అనంతరం చకిలం రూప మాట్లాడుతూ మీడియా మిత్రులకు బియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్, పోలీసులకు, రక్షణగా ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నదనని, మీడియాకు కూడా రక్షణ ఉండటానికి కార్యక్రమం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురూప్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ మండలం లోని గోపాల్ పూర్ గ్రామంలో ఆదివారం గ్రామస్తుల కు సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. 8 క్వింటాళ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ మాజీ చైర్మన్ మంద రాజమల్లు, ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ మెండె శ్రీనివాస్ యాదవ్ , గోనె ఎల్లారెడ్డి, పెంతల నర్సయ్య తదితరులు పాల్గోన్నారు.
వెల్గటూర్ : వెల్గటూర్ గ్రామ వాస్తవ్యుడు అయిన మేరుగు నరేష్ గౌడ్ లత (సరయు సెల్ పాయింట్) కుమార్తె మేరుగు దీక్ష గౌడ్ మొదటి పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామంలోని 65 నిరుపేద కుటుం బాలకి నిత్యావసర సరుకులు (5కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, సబ్బులు, ఉల్లిగడ్డ, బంగాళా దుంప) ఇంటింటికి పంపిణీ చేసి మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. అలాగే కరోనా నేపధ్యం లో ఎప్పటికప్పుడు కచ్చితమైన వార్తలను అందజేసే వెల్గటూర్ మండల 21 మంది పాత్రికేయ మిత్రులకు, వెల్గటూర్ గ్రామ పంచాయతీ (9) సిబ్బందికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, బందెల ఉదరు గౌడ్, గండ్ర శ్రీకాంత్ రావు, అజరు, శ్రీను, సాయి, మెరుగు సంజరు, హరి, అభి పాల్గొన్నారు.
ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ స్ఫూర్తితో సిగిరి ఆనంద్ కార్మిక ఉపాధి విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు జగిత్యాల, నాయిని సత్యనారాయణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అన్నదా నం చేశారు. ఎండపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఒడిశా నుంచి ఇటుకలు తయారు చేయడానికి వచ్చిన 35 కుటుంబాలకు, ధర్మారం మండల శివారు ప్రాంతంలో 30మంది ఇటుకలు తయారు చేయడా నికి వచ్చిన వారికి, గుల్లకోటలో ఇటుకలు తయారు చేస్తున్న వలస కూలీలకు 15మందికి, కొండాపూర్లో ని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి మధ్యప్రదేశ్ నుం చి వచ్చిన 35కుటుంబా లకు వారికి ఒకపూట భోజ నం అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ కునమల్ల లక్ష్మి, లింగన్న మాట్లా డుతూ.. ప్రతి ఒక్కరు లాక్డౌ న్ సమయంలో పేదల కు సహాయం చేయాలన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లాలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ద్వారా వేలా ది మంది ఆటో డ్రైవర్స్, పారిశుధ్య కార్మికులకు, ఆశా కార్యకర్తలకు మధ్యాహ్న భోజన వర్కర్స్కు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రం ధర్మపురిలో నిత్యం వందలాది యాచకులకు, కూలీలకు రోజు రెండు పూటల భోజనం ఏర్పాటు చేశారు. లాక్డౌన్ అమలులో ఉన్నందుకు ప్రతి ఒక్క రూ సామాజిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎండపల్లి సర్పంచ్ మారం జలేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, బోయినపల్లి అశోక్ రావు, రాజు, మాదాసు పోశన్న, రామచందర్, ఓడనాలా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట :మున్సిపల్ పరిధిలోని మారుతీ నగర్ లో ఆదివారం దాదాపు రెండు వందల కుటుంబాల కు వారానికి సరిపడా కూరగాయలు టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్ ఆయన తండ్రి జలాలుద్దీన్ స్మారకార్థం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్పర్సన్ పొన్నగంటి శారద ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పేద నిరుపేద ప్రజలకు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమ న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వార్డ్ కౌన్సి లర్ పొన్నగంటి మల్లయ్య, వీరేందర్, ముద్రగడ నవీన్ కుమార్ జహంగీర్ పాల్గొన్నారు.
బోయినిపల్లి : మండలంలోని కోదురుపాక హైస్కూ ల్లో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్రావు తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు 19రో జులుగా స్థానిక నాయకులతో కలిసి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా స్థానిక కోదురుపాక నాయకులు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడం కోసం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోగి నిపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేయడం గొప్ప సహాయమని, లాక్డౌన్ ముగిసే వరకు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పేదల ఆకలి తీర్చినందుకు ఎంపీ సంతోష్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిఖ్యల సుధాకర్రావు, నాయకు లు బొల్లావేని తిరుపతి యాదవ్, సందిలా శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఒజ్జెల మహేందర్, సారంపల్లి రవి, కమల్, మల్లేశం కత్తెరపాక శ్రీనివాస్, కళాధర్, గుండా సాహెబ్ పాల్గొన్నారు.
ముస్తాబాద్ : మండలంలోని ఆవునూరు గ్రామానికి వరంగల్ నుంచి వలస వచ్చిన ఏడు కుటుంబాల కార్మికులకు ముస్తాబాద్ జెడ్పీటీసీ నర్సయ్య ఆదివారం బియ్యం వితరణ చేశారు. ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా తీరుస్తానని భరోసా ఇచ్చారు.
59వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో..
కరీంనగర్ టౌన్: నగరంలోని 59వ డివిజన్ కార్పొరే టర్ గందె మాధవి మహేశ్ ఆధ్వర్యంలో డివిజన్లోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గందె మాధవి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డివిజన్లోని నిరుపేదలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే పలుమార్లు డివిజన్లోని నిరుపేదలకు కూరగాయలు నిత్యావసర సరుకులతోపాటు బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రజలు కరోనా నేపథ్యంలో అవ సరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమా లను పాటించి కారణం వారి కట్టేందుకు ప్రజలంద రూ ఐక్యంగా పోరాడాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
రూ.50వేలు అందజేత
జగిత్యాలటౌన్ : లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడు తున్న నిరుపే దలకు నిత్యావసరాల కోసం జగిత్యాల బీడీ తెకేదార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.50 వేలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజరు కుమార్ కు ఆదివారం అందజేశారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తీగల వెంకన్న, సిరిపురం గంగాధర్, కిషన్, మాజిద్, రాజన్న, ఆది రవి పాల్గొన్నారు.
Authorization