అరామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్
నవతెలంగాణ-కోల్సిటీ
నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం, సకల జనులను ఎకం చేసీ ఉద్యమంలో భాగస్వామ్యులుగా చేస్తూ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సాగించిన అలుపెరుగని పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001సంవత్సరంలో ఏప్రిల్ 27 తేదీన ఉద్యమ ధీరుడు, సీఎం కెసిఆర్ టిఆర్ఆర్ పార్టీని స్థాపించారన్నారు. దాదాపు 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. అదే విధంగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దాన్ని వ్యాప్తిని నివారించేందకు సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు చేపట్టారని తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిరార్భం దినోత్సవాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమ నాయకులు అందరూ తమ ఇండ్లపై పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని సోదరీమణులందరూ కరోనా వైరస్ మన ఇండ్లలోకి, మనదరికి చేరకుండా కేసీఆర్ లక్ష్మణ రేఖ పేర తమ ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టాలని కోరారు. మహిళలు కరోనా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఇండ్ల ముందు ముగ్గులు పెట్టాలని తెలిపారు. కరోనా వ్యాప్తి మూలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కిడ్నీ వ్యాధీ బాధితులకు కోసం టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ కారులు, విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేయాలన్నారు. నిరుపేదల సహాయార్థం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Authorization