Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న తమ్మినేని
భద్రాచలంటౌన్ : ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సమావేశాలు భద్రాచలంలో జరుగనున్నాయని సిపిఎం డివిజన్ కార్యదర్శి యలమంచి రవికుమార్ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వాటికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించాల్సిన పోరాటాల గురించి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. జిల్లా కమిటి సమావేశాల సందర్భంగా వర్తమాన రాజకీయాలు, సిపిఎం వైఖరి అనే అంశంపై 14 సాయంత్రం అంబేద్కర్ సెంటర్లో సెమినార్ ఉంటుందని, తమ్మినేని వీరభద్రం హాజరవుతారని తెలిపారు.