Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంరూరల్ : సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకున్నే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకుందామని టీఎస్ యుటిఎఫ్ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు అన్నారు. మండలలోని గోళ్లపాడు, ముత్తగూడెం, చింతపల్లి, గొల్లగూడెం, తల్లంపాడు తదితర ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ఖమ్మం, నల్గొండ,వరంగల్ జిల్లాలకు వామపక్షాలు ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధిరెడ్డిని గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి.ఎస్ నాగేశ్వరరావు,జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ షమీ, మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, నవీన్ కుమార్లు పాల్గొన్నారు.