Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో ప్రధానమైన ఆహార పంట వరి. దీని సాగుకు అనుకూలమైన వాతావరంణ ఉంటుంది. కానీ దిగుబడులు ఆశించినంత మేరకు రావడం లేదు.గత కొన్నేండ్లుగా 3.8 టన్నులు మించి రావడం లేదు.కనీసం ఒక హెక్టారుకు 5టన్నులుపైబడి రావాల్సి ఉంటుంది.అప్పుడే విజయవంతంగా పంట పండినట్టు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం లేదు. వర్షపాతం తగ్గిపోతుంది. రుతుపవణాలు ఆలస్యంగా రావడం, వర్షాలు సకాలంలో కురవకపోవడం జరుగుతుంది. ఆలస్యంగా నాటు వేసినా మంచి దిగుబడులు వచ్చే రకాలు రావాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నా పంట పండే విధంగా ఉండాలి. భవిష్యత్తులో నీటి ప్రమాదం పొంచి ఉంది. లేబర్ సమస్య కూడా మనముందుంది.పెట్టుబడి అనేది విపరీతంగా పెరిగిపోయింది. కనుక ఇవన్ని అధిగమించాల్సి ఉంది. యువత ముందుకు వచ్చే విధంగా లాభదాయకంగా ఉండాలి. ధీర్ఘకాలిక రకాలు ఎక్కువ సాగు చేసేవారు అంటే ఐదునెలల పంట. ఇప్పుడు ఆ పంటలు సాధ్యమైన ంత వరకు వేయకుండా ఉండాలి. సాంబమశూచి బిపిటి 5204. దీనికి దీటుగా నాలుగు నెలల్లోనే అధిక దిగుబడులు సాధించే రకాలు చాలా ఉన్నాయి. జూన్ నెలలోనే నారు పోసుకోవాల్సిన పని లేదు. తొలకరి వర్షాలు రాగనే పచ్చిరొట్ట పంటకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే రసాయన ఎరువులు తగ్గించుకునేందుకు వీలుంటుంది. రెండోది నీరు సద్వినియోగం అవుతుంది. జూలైలో నారు పోసుకొని ఆగస్టులో నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. బిపిటి కి సమానమైన ఉన్నప్పుడు ఐదు నెలల పంటలకెందుకు వెళ్లాలి. స్వల్ప కాలిక రకాలు తీసుకున్నట్టయితే ఆర్ఎన్ఆర్ 15048. జగిత్యాల జెజిఎల్ 1798 సన్నరకాలు. ఇవి స్వల్పకాలిక రకాలు (125రోజులలో వచ్చేవి) అంటారు. మధ్యకాలిక రకాలు 135రోజుల వరకు వచ్చేవి బిపిటి నాణ్యతోనే ఉంటాయి. జగిత్యాల్ జగిత్యాల్ మసూరి (జెజిఎల్) 11470, కృష్ణ అగ్గితెగులును తట్టుకునేది. డయాటెటిక్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలుజరగుతుంది.దీనిలో గ్లైసిమిక్ఇండెక్స్ తక్కువ కనుక మధు మేహవ్యాధిని నియంత్రిస్తుంది. జెజిఎల్11727. డబ్ల్యుజెలెల్ 14, 32100, మరోటి జెజిఎల్ అనే రకాలున్నాయి. స్వల్పకాలిక రకాలు తెలంగాణలో పండించేవి ఎంటియు 1010 కాటన్ దొరసన్నాలు. ఎక్కువగా ప్రాచూర్యం పొందినవి బిపిటి 4204 ఎంటియు వెయ్యి నుంచి ఎందుకంటే పంటకాలం ఎక్కువ.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెఎన్ఎం 118, జెజిఎల్ 18047 ప్రత్యామ్నాయాలు. రైతులు వేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు. రోగాల విషయంలో దోమను తట్టుకునేందుకు తయారు చేస్తున్నాం. రెండేండ్లలోపు వస్తాయి. మన రాష్ట్రంలో ఆరు వరి పరిశోధనా కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. రైతులకు ఏం చేయాలనేదానిపై దిగుబడి పెంచాల నేది కీలకంగా చర్చించాం. ఎకరానికి సరాసరి 50బస్తాలు తగ్గకుండా దిగుబడి రావాలి. ఇంకా 20శాతం దిగుబడి పెంచాలి. అవసరమైన వరి విత్తనాలు రావాలి. వరిలో హైబ్రీడ్స్ అనేది వృద్ధి చేయాలి. తక్కువ నీటితో లేబర్ సహాయం లేకుండా ఎలా చేయాల నేది చూస్తున్నాం. తెలంగాణలో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. చౌడును తట్టుకునే విధంగా పరిశోధనలు చేస్తున్నాం.
కాకుండానీటి వినియోగం కూడా అధికం.బావుల కింద విద్యుత్ వృధా చేస్తున్నాం. అందుకే మధ్య కాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. 125 రోజులకు కోతకొచ్చేవి స్వల్పకాలికాలు. తెలంగాణలో వరి ఎగుమతికి ఎక్కువ అవకాశాలున్నాయి. తెలంగాణలో మంచి విత్తనం తయారు చేసేందుకు వనరలున్నాయి. ఐదారు రకాల వరి విత్తనాలు ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలనేది ఆలోచన ఉంది.
ఆర్ఎన్ఆర్- 15048
ఖరీఫ్, రబీ సీజన్లో అనువైన స్వల్పకాలిక రకం, కాలం వ్యవధి 125 రోజులుంటుంది. ఖరీఫ్లో ఆలస్యంగా విత్తుకోవడానికి అనువైన రకం, జూలైలో అయితే పచ్చిరొట్ట పంటలతో భూసారాన్నిపెంచుకు నేందుకు వీలుంటుంది. ఎంటియు 1010కాటన్దొర సన్నాలుతో సరిసమానంగా అధిక దిగుబడులు వచ్చే రకం అంతేకాకుండా తక్కువ నత్రజనితో అధిక దిగుబడి వస్తుంది. సాంబమసూరితో పోల్చుకుంటే అతిసన్నగా ఉంటుంది, అన్నం రుచికరంగా ఉంటుంది. అగ్గితెగులును సమర్ధవంతంగా తట్టుకుంటుంది. రబీలో చలిని తట్టుకుంటుంది. ఖరీఫ్లో 70శాతం నూకలు లేని బియ్యాన్ని ఇస్తుంది. ఖరీఫ్లో అయితే జూలై నెలలో నార్లు పోసుకోవాలి. జూన్లో నారు పోసుకుంటే కాలపరిమితి పెరుగుతుంది. కొంచెం ఎత్తుపెరుగుతుంది కనుక నత్రజని ఎరువును మోతాదు తగ్గించి వేసుకోవాలి. స్వల్పకాలిక రకం కనుక నత్రజనిని నాట్లు వేసుకున్న తరువాత వారం పది రోజుల వ్యవధితో మూడు దఫాలుగా చిరుపొట్ట దశలో చల్లుకోవాలి. ఈ రకంలో కాండం తొలుచు పురుగు అశించే అవకాశం ఉంది కనుక 7నుంచి 10 రోజుల్లో గుళికలు, చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరాన్టానిల్ప్రోల్ వంటి మందుల వాడి నివారించుకోవాలి. సన్నగింజ రకం కనుక బెట్ట పరిస్థితుల్లో కంకినల్లి ఆశించకుండా చిరుపొట్ట దశలో ప్రోఫెనోఫాస్, డైకోఫాల్, స్పైరోమెపిఫెన్ వంటి మందులు పిచికారీ చేయాలి. ఈ రకం 10నుంచి 15 రోజు నిద్రావస్థను కలిగి ఉన్నది కనుక కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడుకోవాలంటే బాగా ఎండబెట్టిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించి నార్లు పోసుకోవాలి.
సురేందర్ రాజు (ప్రధాన శాస్త్రవేత్త, వరి)
ప్రొఫెసర్, జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం