Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • దేవదాయ ధర్మ శాఖ ఈవోపై వరకట్న వేధింపుల కేసు
  • వివాహిత అనుమానస్పద మృతి
  • పోలీసుల అదుపులో జ్యోతి హత్య కేసు నిందితుడు
  • ఆటోపై లారీ బోల్తా ఒకరు మృతి..
  • పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
రబీలో ఆరుతడి పంటలే మెరుగు | కిసాన్‌ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కిసాన్‌
  • ➲
  • స్టోరి
  • Sep 06,2018

రబీలో ఆరుతడి పంటలే మెరుగు

రబీలో కూడా బావులు, చెరువుల కింద తేలిక భూముల్లో సైతం వరి సాగు చేస్తున్నారు. నీటి వనరులు సరిగ్గా లేకపోవడం, విద్యుత్‌ సరిగ్గా ఉండకపోవడం వంటి సమ యంలో వరి సాగు లాభదాయం కాదు. రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమైన నీరు తక్కువ, విద్యుత్‌, పెట్టుబడులు కూడా తక్కువే. ఒక ఎకరం వరి సాగుచేయడానికి కావాల్సిన నీటితో కనీసం 2 నుండి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగు చేయొచ్చు పంట మార్పిడి వల్ల పంటనాశించే పురుగులు, తెగుళ్లు కూడా తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూసారం వృద్ధి అవుతుంది. మినుము, పెసర వంటి అపరాలను వరి కోయక ముందే తేమలో విత్తనం వేసి సాగు చేస్తున్నట్లుగానే ఇప్పుడు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగ పంటలను వరి కోసిన తర్వాత దుక్కి చేయకుండా విత్తే విధానం ఆచరణలోకి వచ్చింది. దీన్ని 'జీరో టిల్లేజీ' విధానం అంటారు. వరి కోసిన తర్వాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు అప్పటికేే మొలిచి ఉన్న కలుపును నివారించేందుకు పారాక్వాట్‌ అనే కలుపు మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 5.మి.లీ కలుపు మందును కలుపు మొక్కలు, వరి దుబ్బులు బాగా తడిచేలా పిచికారి చేయాలి. పారాక్వాట్‌ మందు వాడిన తర్వాత వెంటనే విత్తనాలు వేసుకోవచ్చు. భూమిలో సరైన తేమ ఉన్నట్లయితే వెంటనే విత్తుకోవాలి. లేదా పల్చగా తడి చేసైనా విత్తుకోవాలి. లేదా విత్తే యంత్రాల సహాయంతో విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి కలుపు నాశిని మందులు వాడాలి. మొక్కజొన్నలో అయితే అట్రజిన్‌(4-5 గ్రా.లీ నీటికి)పొద్దుతిరుగుడు, ఆముదం,శనగలో అయితే పెండిమిథాలిన్‌(5-6మి.లీ లీటరు నీటికి మందులను విత్తిన 1-2 రోజులలోపు పిచికారి చేయాలి. ఇతర యాజమాన్య పద్ధతులను ఆయా పంటలకు చేసిన సిఫారసు మేరకు పాటించాలి. వేరుశనగ, ఆవాలు, నువ్వులు తదితర పంటలను సాగుచేసినట్లయితే నేల తయారీ అవసరం. ఎందుకంటే వరి కోసిన తర్వాత దమ్ము చేసిన మాగాని భూమి ఎండిపోయినప్పుడు గట్టిగా ముద్దలవుతుంది. కనుక భూమి తయారీలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. లేకపోతే వాటి మొలక శాతం బాగా తగ్గి ఉండాల్సిన మొక్కల సాంద్రత ఉండదు. దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. వరి తర్వాత భూమిలో తేమ ఉన్నప్పుడు దున్నటం ముఖ్యం. తేమ ఎక్కువగా ఉన్నట్లయితే నాగలితో దున్నడానికి రాదు. అలాగని భూమి బాగా ఎండినట్లయితే పెద్దపెద్ద పెడ్డలు ఏర్పడతాయి. అందుకే తగిన సమయంలో లోతుగా నాగలితో రెండుసార్లు దున్నాలి. తరువాత తిరుగు దంతెతో ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా దున్నినట్లయితే గడ్డలన్ని పగిలి భూమి మెత్తగా తయారవుతుంది. తరువాత నేలను చదును చేసి, బోదెలు, సాళ్లు ఏర్పాటు చేసి విత్తనాలను బోదెల మీద విత్తుకుంటే పంట పెరుగుదల, దిగుబడి బాగా వస్తుంది.

రబీలో ఆరుతడి పంటలే మెరుగు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్బరి 'పట్టు' భలే గిట్టు
పెరటి కోళ్ల పెంపకం
బూడిద తెగులు సోకకుండా..?
మొక్కలకు సూక్ష్మపోషకాలు
మిరప కోత అనంతరం...
ఆరుతడి పంటల్లో వంగ సాగు
వంగలో సమగ్ర సస్యరక్షణ
కత్తెర పురుగు ఆశించకుండా..?
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
నల్లి ఉధృతి గమనిస్తే...
గులాబీ పురుగుకు విరుగుడు...
అనుకూల పంట మినుము
పురుగు ఆశించకుండా జాగ్రత్తలు
ప్రత్యామ్నాయంగా నువ్వులు
చిరుధాన్యాల సాగు - సహజ పద్ధతులు
పూలు పూయిద్దాం...
పంటలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాకర సాగు ఆదాయం బాగు
పంటల్లో పైపాటు యాజమాన్య పద్ధతులు
దిగుబడినిచ్చే కొర్రలు
కలుపు నివారణ మందులు
బెంగలేని బెండ
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
లాభాలు ఇచ్చే యాపిల్‌ బెర్‌
నిత్యాదాయ ఆలుగడ్డ
విత్తనానికి ముందు విత్తన శుద్ధి
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ
నిమ్మజాతి పంటలు (బత్తాయి)
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
Sundarayya

Top Stories Now

veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు

_

తాజా వార్తలు

10:53 AM

దేవదాయ ధర్మ శాఖ ఈవోపై వరకట్న వేధింపుల కేసు

10:50 AM

వివాహిత అనుమానస్పద మృతి

10:44 AM

పోలీసుల అదుపులో జ్యోతి హత్య కేసు నిందితుడు

10:39 AM

ఆటోపై లారీ బోల్తా ఒకరు మృతి..

10:37 AM

పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!

10:37 AM

అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభం..

10:29 AM

చత్తీస్‌గడ్‌లో స్వైన్‌ ప్లూతో ఏడుగురు మృతి

10:21 AM

భారీ హిమపాతానికి కాశ్మీర్‌లో ఇళ్లు నేలమట్టం

10:17 AM

శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన షబ్బీర్‌అలీ

10:14 AM

వరల్డ్ కప్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కపిల్‌ కామెంట్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.