Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ

హిమా కోహ్లీ... కొన్ని రోజులుగా ఈ పేరు దేశమంతా మారు మోగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులై చరిత్ర సృష్టించడం ఓ విశేషమైతే. ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో ఈమే ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం మరో విశేషం. మొదట సివిల్‌ సర్వీస్‌లోకి వెళ్ళాలనుకుని తల్లి ప్రేరణతో ఈ రంగంలోకి వచ్చిన ఆమె గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో...
  సెప్టెంబరు 2, 1959న ఢిల్లీలో జన్మించారు హిమా కోహ్లీ. అక్కడే ఆమె ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ చేసి లా చదివారు. 1984లో లా డిగ్రీ పొంది, అదే ఏడాది ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు.1999 - 2004 మధ్య ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు న్యాయ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఢిల్లీ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యురాలిగా కూడా కోహ్లీ పనిచేశారు. ఆ తర్వాత మే 29, 2006న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆగస్టు 29, 2007న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 20, 2019 నుంచి ఢిల్లీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, జూన్‌ 30, 2020 నుంచి నేషనల్‌ లా యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తల్లి ప్రేరణతో
హిమా కోహ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే తన తల్లి ద్వారానే ప్రేరణ పొందానని ఆమె చెబుతారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుండి చరిత్రలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత హిమా ఎల్‌ఎల్‌బి చేయాలని నిర్ణయించుకున్నారు. ''లా చేయడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతున్న సమయంలో లా చేయమని నా సన్నిహితులు చెప్పారు. అప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు'' అంటారు ఆమె. చట్టపరమైన వృత్తిలో కొనసాగడానికి ఆమెను ఉత్తేజపరిచిన విషయం ఏమిటంటే.. అమెరికన్‌ న్యాయవాది, రచయిత అయిన ఎర్లే స్టాన్లీ గార్డనర్‌ రాసిన ఫిక్షన్‌ నవలను కోహ్లీ తల్లి ఎంతో ఇష్టంగా చదివేవారు. ఇది క్రిమినల్‌ కేసులు, కోర్టుకు సంబంధించిన విషయాల చుట్టూ తిరుగుతుంది. వీటి ప్రభావం కోహ్లీపై కూడా తీవ్రంగా పడింది.
ఎన్నో బాధ్యతలు...
ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆమె న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీతో కలిసి న్యాయ సహాయ సేవలను కూడా అందించారు. 29 మే 2006న ఈమె ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 29 ఆగస్టు 2007న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించే సమయంలో కోహ్లీ అనేక ముఖ్యమైన ఉత్తర్వులకు, తీర్పులకు నాంది పలికారు. అప్పటికే బెయిల్‌ మంజూరు చేసిన ఖైదీలను నిర్బంధించడంపై విచారణకు పిలుపునిచ్చారు, నేరానికి పాల్పడిన బాలల గుర్తింపును రక్షించడం, అంధులకు, వికలాంగులకు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునేలా అవకాశం కల్పించారు.
కరోనా సమయంలో...
2020లో కోహ్లీ ఓ న్యాయ కమిటీకి నాయకత్వం వహించార., ఇది భారతదేశంలో కోవిడ్‌-19 మహమ్మారిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రతిస్పందనను పర్యవేక్షించింది. మహమ్మారి సమయంలో ప్రైవేట్‌ పరీక్షా కేంద్రాలలో కరోనాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి అనుమతించే విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో ఆమె స్పందించారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ని ఆమె మందలించారు.
న్యాయ విద్యకు సేవలు
భారతదేశంలో న్యాయ విద్య అలాగే న్యాయ సహాయం అందించడంలో కూడా కోహ్లీ తన పాత్ర పోషించారు. 2017 నుండి కోల్‌కతాలోని పశ్చిమ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ జురిడికల్‌ సైన్సెస్‌ జనరల్‌ కౌన్సిల్‌లో పనిచేశారు. అలాగే 2020 జూన్‌ 30 నుండి న్యూ ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్శిటీకి కౌన్సిల్‌లో పనిచేశారు. 20 మే 2020 నుండి ఆమె ఢిల్లీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధ్యక్షురాలిగా చేశారు.
మొదటి మహిళా న్యాయమూర్తిగా
2021లో కోహ్లీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. జనవరి 7న ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత ఐదేండ్లకు అంటే 2019లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయబడింది. దాంతో మన రాష్ట్రానికి మొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా హిమా కోహ్లీ చరిత్ర సృష్టించారు. మన దేశ చరిత్రలో ఇప్పటి వరకు 78 మంది మహిళలు న్యాయమూర్తులుగా పనిచేశారు. 1991లో దేశంలో హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ లీలాసేథ్‌ రికార్డు సృష్టించారు. ఆమె హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా చీఫ్‌ జస్టీస్‌కు హిమా కోహ్లీ రికార్డు సృష్టించారు. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వీటిని దూరంగా ఉంచండి
తళుక్కుమనే గోళ్ళకోసం...
కాస్మోటిక్స్‌ తో క్యాన్సర్‌
దాహాన్ని తీరుస్తుంది
భూమిపై సగం..సగం
సూపర్‌ ఉమెన్‌ 'శకుంతల దేవి'
ఇలా నివారించుకోండి
ఓ ఆలూ చాలు
అవగాహన పెంచుకోండి
దాహం తీర్చే సబ్జాగింజలు
పాతవస్తువులతో కళకళలాడేలా...
భయం ఇలా పోగొట్టండి
వహ్వా హల్వా...
విజయం అంత తేలిక కాదు
బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా

తాజా వార్తలు

09:53 PM

వాట్సాప్ మరో కొత్త నిబంధన..యూజర్స్ బీ అలర్ట్

09:35 PM

మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా పాజిటివ్ కేసులు

09:18 PM

పోలీసుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

09:13 PM

మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళ ఎమ్మెల్యే

09:06 PM

కోల్‌కతా రైల్వే కార్యాలయాలున్న భవనంలో అగ్నిప్రమాదం

08:39 PM

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

08:36 PM

హైదరాబాద్ ఫీవర్‌ ఆసుపత్రిలో ఉరేసుకొని రోగి ఆత్మహత్య

08:14 PM

87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స

08:01 PM

అల్లోల దివ్యారెడ్డికి ‘పవర్ ఉమెన్’ అవార్డు..

07:42 PM

మంటలు చెలరేగితే నన్ను కాపాడారు..టీడీపీ కార్యకర్త

07:35 PM

టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు..మూడు స్థానాల్లో పోటీ

07:21 PM

75 ఏండ్ల స్వాతంత్య్రం..సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

07:06 PM

రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయలేం : కేంద్ర ప్రభుత్వం

06:57 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

06:37 PM

హైదరాబాద్ పబ్ లో సింగర్ సిద్ శ్రీరామ్ కు అవమానం..

06:04 PM

ఏపీలో కొత్తగా 74 కరోనా పాజిటివ్ కేసులు

06:01 PM

మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు..

05:50 PM

'సైనా' నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్

05:44 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

05:43 PM

కేసీఆర్ సర్కారు‌కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి : కోదండరాం

05:40 PM

రూ.30 లక్షల ఇచ్చి నగ్న వీడియోల సీడీ తీసుకెళ్లు..

04:33 PM

తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద కారులో మంటలు..

03:59 PM

తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక

03:52 PM

విశాకలో గంజాయి ప్యాకెట్లు పట్టివేత

03:35 PM

మహిళా దినోత్సవం రోజునే మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు

03:22 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్న కేయూ జేఏసీ నేత

03:08 PM

నేడు సాయంత్రం ముగియనున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

02:39 PM

టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.