Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కస్తూరిబా స్కూల్ నుంచి ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం
  • కాక్‌పిట్‌లో నిద్రపోయిన సీనియర్‌ పైలట్‌
  • ఉచితాలు అనుచితం : జేపీ
  • కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి
  • బ్రిటన్‌లో మాల్యా ఆస్తుల వివరాలు ఇవ్వండి!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఎక్కువసేపు కూర్చుంటే..! | మానవి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Sep 13,2018

ఎక్కువసేపు కూర్చుంటే..!

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే సరిపోవు అంటున్నారు నెదర్లాండ్స్‌ పరిశోధకులు. ఆహారం, వ్యాయామంతో పాటు కూర్చునే సమయాన్ని తగ్గించాలని వారు సూచిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయమే వెల్లడించారు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది రోజుకు 10-11 గంటలకు పైగానే ఆఫీసుల్లో కూర్చుంటున్నారు. ఇలా ఎక్కువసేపు కూచోవటం వల్ల మధుమేహ, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి అనారోగ్య సమస్యలెన్నో వస్తాయి. రోజూ వ్యాయామం చేస్తున్నాం కదా అని చాలామంది ఎక్కువసేపు కూర్చోవటంతో తలెత్తుతున్న అనర్థాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. అయితే రోజుకు కనీసం ఐదు గంటల పాటు నిలబడటం లేదా అటూఇటూ మెల్లగా నడవటం ద్వారా ఇలాంటి వాటిని తప్పించు కోవచ్చని నెదర్లాండ్స్‌ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇందులో పరిశోధకులు కొందరిని ఎంపిక చేసి వారి దినచర్యలను పరిశీలించారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత తమ ఫలితాలను విడుదల చేశారు.
ముందుగా రోజులో 14 గంటల సేపు కూచోవాలని సూచించారు. ఆ తర్వాత రోజుకు ఒక గంట సేపు ఎక్సర్‌సైజ్‌ సైకిల్‌ తొక్కటం వంటి కూర్చోని చేసే వ్యాయామాలను చేయాలని, 13 గంటలు కూర్చోని ఉండేలా సూచనలు చేశారు. చివరగా రోజుకు 8 గంటల సేపు కూర్చోవటం, 5 గంటల సేపు నిలబడటం లేదా అటూఇటూ నడవాలని సూచించారు. అదేపనిగా కూర్చున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్‌ నిరోధకత (కణాలు గ్లూకోజును స్వీకరించలేకపోవటం), కొలెస్ట్రాల్‌ స్థాయలు గణనీయంగా పెరిగాయి. ఓ గంట సేపు వ్యాయామం చేసి.. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడల కణాలు ఆరోగ్యం మెరుగుపడింది గానీ ఇన్సులిన్‌ నిరోధకత, కొలెస్ట్రాల్‌ స్థాయిల్లో మార్పేమీ కనబడలేదు. నిలబడటం, అటూఇటూ నడిచినప్పుడు మాత్రం ఈ రెండూ గణనీయంగా మెరుగుపడటం విశేషం. అంటే వ్యాయామం చేయటమే కాకుండా ఎక్కువసేపు కూర్చోకుండా ఉండాలని ఈ అధ్యయన ఫలితాల ద్వారా సూచిస్తున్నారు. ఇందుకు వైద్యపరంగా కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా నిలబడినపుడు కండరాలు సంకోచిస్తాయి. దీంతో కండరాలు గ్లూకోజును బాగా వినియోగించుకుంటాయి. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్‌ స్థాయ నిలకడగా ఉంటుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే రసాయనాలూ విడుదలవుతాయి.
సో.. అదేపనిగా కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి నాలుగడుగులు వేయండి. మంచిఆహారం, వ్యాయమంతో పాటు తక్కువ సమయం కూర్చోని ఉండటం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం అని గుర్తుంచుకోవాలి.
ల

ఎక్కువసేపు కూర్చుంటే..!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బాధ్యతలు పంచుకుంటూ...
కాల్షియం ఖజానా
కాల్షియం ఖజానా
ఇంటిలోకి రాకుండా..!
జీర్ణశక్తికి నిమ్మ
సాహసోపేతంగా సైక్లింగ్‌... రన్నింగ్‌...
హైరానా
ఎక్కువ కార్డులుంటే!?
మెంతులతో మేలు...
పిల్లలకోసం ఫలహారంగా...
పిగ్మంటేషన్‌ టెన్షన్‌!?
మీరే నెంబర్‌ 1
ఈజీగా తగ్గొచ్చు...
సాహిత్యం సమాజ దర్పణం
మెరుపునిచ్చే ఖర్బూజ
మంచి ఔషధకారి
ఉద్యోగాన్వేషణలో ఉన్నారా..!
ఫ్యారా షరారా
మిగిలిపోయినవాటితో...
ఎంత బిజీ ఉన్నా...
ముందుచూపుతో
రోజూ తాగితే...
ప్రశాంత జీవనం కోసం..
చిన్న అవకాడో...
నలుపు మాయం
నిద్రలేమితో ప్రమాదం
మిక్సీతో ఉపయోగాలు - జాగ్రత్తలు
దాల్చిన చెక్క టీ...
24 గంటలూ సంగీతమే!
కండిషనర్‌ ఇలా వాడుదాం...
Sundarayya

Top Stories Now

ckpt
airindia
zomato
veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ

_

తాజా వార్తలు

04:44 PM

కస్తూరిబా స్కూల్ నుంచి ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం

04:42 PM

కాక్‌పిట్‌లో నిద్రపోయిన సీనియర్‌ పైలట్‌

04:36 PM

ఉచితాలు అనుచితం : జేపీ

04:34 PM

కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి

04:33 PM

బ్రిటన్‌లో మాల్యా ఆస్తుల వివరాలు ఇవ్వండి!

04:28 PM

ప్రశ్నిస్తే దేశ ద్రోహి అయిపోతారా?: గల్లా జయదేవ్

04:22 PM

మళ్లీ తలసాని ఏపీ పర్యటన

04:17 PM

చైనా రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన

04:14 PM

బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మృతి

04:11 PM

రేపు కర్నూలులో పవన్ రోడ్ షో..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.