Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
మండలంలోని తడ్కపల్లి గ్రామ బీసీ బాలుర హాస్టల్ను ఆదివారం సందర్శించినట్టు బీడీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు దబ్బెట ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో నెలకొన్న సమస్యలనడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీశ్రావు చొరవ చూపి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే బీడీఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించా రు. కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ నాయకులు రవి, రాజేశ్ పాల్గొన్నారు.