Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, మేయర్ పీఠం టీఆర్ఎస్కే వరిస్తుందని ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ 100 సీట్లు కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని, బీజేపీ, కాంగ్రెస్ను మట్టికరిపిస్తుందని తెలిపారు. అకాల వర్షాలకు వరద నీటితో హైదరాబాద్ అతలాకుతలమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వరద సహాయం అందించలేదన్నారు .వరదలతో నష్టపోయిన నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉండి రూ.పది వేల ఆర్థిక సాయం అందజేసిందన్నారు.