Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం పిలుపునిచ్చారు.మంగళవారం దొడ్డి కొమురయ్య భవన్లో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ బోర్డు ను ఎత్తివేయాలనే కుట్రను భగం చేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెలలో నిర్వహించనున్న మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు బోడ ఇస్తారి, సెంట్రింగ్ సొసైటీ కార్యదర్శి దేవరపల్లి వెంకట్ రెడ్డి. ప్లంబర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కావేరి నరసింహ, పెయింటింగ్ వర్కర్స్ అధ్యక్షులు కత్తుల జగన్, తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షులు సాగర్ల మల్లయ్య , టైల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పిట్టల రమేష్, దరిపల్లి రామ్మూర్తి ,ఎండి. సుల్తాన్ మన్నె శంకర్. గని పెళ్లి రాములు ,రమేష్ ,బైరు నరసింహలి తదితరులు పాల్గొన్నారు.