Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు: తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికునికి గాయాలైన సంఘటన మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొంపెల్లి రామచంద్రం రోజు వారిలాగే తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.