Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పెరుగుతున్న ధరలనుగుణంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతి రేట్లు పోరాడి సాధించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. హమాలీల రేట్లు పెరిగిన సందర్భంగా దేవరకొండ సివిల్ సప్లై గోదామ్ వద్ద కార్మికులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచి అమలు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించి గురువారం రాత్రి పెరిగిన రేట్ల జీవోను విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నూనె రామస్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జూలూరు వెంకట్ రాములు, మండలాధ్యక్షులు ఎ.మల్లయ్య, హమాలీ యూనియన్ నాయకులు పి.ఎల్లయ్య, సాంబయ్య, శ్రీనివాస్, మహేష్, శ్రీశైలం, శ్రీకాంత్, చింటూ, వినోద్, శివ, వెంకటేష్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.