Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ - భువనగిరి
వామపక్షాలు బలపరిచిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కొండా అశోక్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీి, టీిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే జయసారధి రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కమిటీ సభ్యులు పల్లెర్ల అంజయ్య, రాసాల వెంకటేశం,సిలివేరు ఎల్లయ్య, అన్నంపట్ల కష్ణ, అబ్దుల్లాపురం వెంకటేష్,ఏల్లంల వెంకటేష్, కొండమడుగు నాగమణి పాల్గొన్నారు.