Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండలకేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టార్జితంతో ఏర్పడిన లక్షల కోట్ల విలువచేసే ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు తెగనమ్ముతుందన్నారు. తద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను తీసివేస్తుందని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. సంస్థలను ప్రయివేట్పరం చేయడంతో రిజర్వేషన్లు కోల్పోయి ఎస్సీ, ఎస్టీ, బీసీలు రోడ్డున పడనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండలకార్యదర్శి బండారు శ్రీరాములు, నాయకులు టంటం వెంకటేశ్, తెలకలపల్లి యాదగిరి, తేజ, కవిత, శాంతమ్మ, శ్రావణి, స్వరూప, పద్మ, మంగ పాల్గొన్నారు.