Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మడమ తిప్పం... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2020

మడమ తిప్పం...

- కరోనా కంటే.. ఆ చట్టాలతో ముప్పు
- ఎన్ని రోజులైనా ఇక్కడే
- జై జైవాన్‌... జై కిసాన్‌ నినాదాల హౌరు
- ఢిల్లీ సరిహద్దులోని నిరంకారీ మైదానానికి భారీగా రైతన్నలు
- అన్నదాతల ఆర్తనాదాన్ని ఆలకించాలి.: ప్రధానికి ప్రతిపక్షాల లేఖ
బురారీ నుంచి నవ తెలంగాణ ప్రతినిధి సాగర్‌ వనపర్తి:
ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి కంటే కూడా మోడీ ప్రభుత్వం తెచ్చిన కాలా కానున్‌ (వ్యవసాయ చట్టాలు) చాలా ప్రమాదకరమని అన్నదాతలు నినదిస్తున్నారు. కోవిడ్‌-19 వైరస్‌ ఉధృతి, వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. కరోనా వైరస్‌ ఒక మనిషిని కొద్ది రోజులు మాత్రమే పట్టి పీడిస్తుందనీ, కానీ, ఈ చట్టాలు కార్యరూపం దాల్చితే రైతుల రెక్కల కష్టాన్ని, రక్తాన్ని జలగల మాదిరి పీల్చుకుతింటాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్టు వారు ప్రకటించారు. మూడు రోజుల నుంచి బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్బంధాన్ని ఎదుర్కొన్న అన్నదాతలు శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని నిరంకారీ మైదానం వైపు కదిలారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలంతా భారీగా బురారీలోని నిరంకారీ స్టేడియంలోకి వచ్చారు. 'జై జవాన్‌... జై కిసాన్‌, కిసాన్‌ బచావో... దేశ్‌ బచావో' అన్న ప్లకార్డులు, నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతున్నది. డప్పు చప్పుళ్ళు, నత్యాలతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పాటలు పాడుతూ రైతులు తమ నిరసన తెలిపారు. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటామని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ట్రక్కులు, మంచినీరు, వంట సామాగ్రి, దుప్పట్లు భారీ స్థాయిలో వెంట తెచ్చుకొని మైదానంలో కూర్చొని ఆందోళన తెలుపుతున్నారు.
రోడ్లపైనే స్నానం... నిరంకారీ మైదానంలో వంట
ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి నిరంకారీ మైదానంలోకి చేరుకున్న రైతులు రోడ్లపైనే స్నానం చేస్తూ... స్టేడియంలో సామూహికంగా వంట చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజులకు సరిపడ వంట సామాగ్రిని తెచ్చుకున్నారు. ఒక ట్రక్కు నిండ ఎండిన కట్టెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఇతర కూరగాయలు వెంట తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే తమ తిరుగు ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. స్టేడియంలోకి వచ్చిన మీడియా సిబ్బంది, కేంద్ర బలగాలకి సైతం రైతులు ఆహారం, నీళ్ళు ఇవ్వటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
వందేండ్ల వ్యవసాయ విధానాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం : పంజాబ్‌ సీఎం
న్యాయమైన సమస్యలపై పోరాడుతున్న అన్నదాతలతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఆయన శనివారం కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడినట్టు తెలిసింది. హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చెప్పినట్టు రైతులను తాము రెచ్చగొట్టడం లేదని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంత ఆలస్యంగా స్పందించడం సరికాదు అని వ్యాఖ్యానించారు. దేశంలో సుమారు 100 ఏండ్లుగా కొనసాగుతున్న వ్యవసాయ విధానాన్ని ఒకేసారి మూడు చట్టాలతో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
చర్చలకు కేంద్రం సిద్ధం : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రైతులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నదనిన్నారు.
రైతులకి ధర్నాకి ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్‌ సింగ్‌ సంఘీభావం
సింగూర్‌, బిరారీలో నిరసన తెలుపుతున్న రైతులను ఆలిండియా అగ్రికల్చరల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐఏడబ్ల్యూయూ) నేత విక్రమ్‌సింగ్‌ సంఘీభావం తెలిపారు. నిరంకారీ స్టేడియానికి చేరిన రైతులను ఆయన పరామర్శించారు. రైతుల ధర్నాకు అండగా ఉంటామని హామీనిచ్చారు.
అణచివేత ఆపండి..ప్రధానికి ప్రతిపక్షాల లేఖ
రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలను కేంద్ర బలగాలను ఉపయోగించి అణచివేత ఆపాలని... వారి డిమాండ్లని ఆలకించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రతిపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాశారు. లేఖ రాసినవారిలో సీతారాం ఏచూరి (సీపీఐ-ఎం), డి రాజా (సీపీఐ), శరత్‌ పవార్‌ (ఎన్‌సీపీ), దీపాంకర్‌ భట్టాచార్య(సీపీఐ-ఎంఎల్‌), టిఆర్‌ బాలు (డీఎంకే) మనోజ్‌ ఝా(ఆర్జేడీ) దేవభ్రతా బిశ్వాస్‌(ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), మనోజ్‌ భట్టాచార్య(ఆర్‌ఎస్పీ) తదితరులున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ రైతులను ఈ విధంగా వేధించలేదని స్పష్టం చేశారు. రైతులపై టీయర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్లు, లాఠీఛార్జీలు చేయడం సరికాదని తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై టీయర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనన్స్‌ ప్రయోగించడంపై ప్రతిపక్షపార్టీల నేతలు లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. కనీసం రైతుల ఆందోళన ఏంటో వినే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.