Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతాంగ పోరాటానికి మద్దతుగా 3న రాస్తారోకోలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2020

రైతాంగ పోరాటానికి మద్దతుగా 3న రాస్తారోకోలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఢిల్లీలో రైతాంగ పోరాటంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధాన్ని, దమనకాండను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈనెల 3న దేశవ్యాప్తంగా గంటపాటు రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం ఆన్‌లైన్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 3 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. వారికి ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రైతు పోరాటాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే దాకా పోరాటం చేయాలన్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లతో నిరసనను చేపట్టాలని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో సీఎం కేసీఆర్‌ కలిసి రావాలని కోరారు. వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు, నిర్బంధం ప్రయోగించినా ఢిల్లీలో రైతాంగ పోరాటం సమరశీలంగా జరిగిందన్నారు. ఢిల్లీలో చలితీవ్రత ఎక్కువగా ఉన్నా అమానవీయంగా రైతులపై పోలీసులు వాటర్‌కేనన్‌లు ఉపయోగించారని విమర్శించారు. గతనెల 26న కార్మికుల సమ్మె, 26,27 తేదీల్లో జరిగిన గ్రామీణ బంద్‌లో కార్మికులు, కర్షకులు ఏకతాటి మీదికి వచ్చి ఆర్థిక కోర్కెల కోసం కాకుండా రాజకీయ డిమాండ్లు పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించాలన్న డిమాండ్‌తోపాటు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభించినా, ఉద్యోగాలు కల్పించకపోయినా, ధరలు తగ్గించకపోయినా, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మినా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారని అన్నారు. పాకిస్తాన్‌ వ్యతిరేక, మతోన్మాద ఎజెండాతో బీజేపీ గెలుస్తున్నదని వివరించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగం, ఆహార భద్రత, పేదరికం వంటి అంశాలపై బీజేపీ ఎప్పుడూ దృష్టి కేంద్రీకరించలేదని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన వీర్‌ సావర్కర్‌, హెగ్డేవర్‌ ఉన్న కాలంలోనూ గుళ్లు కట్టం, మసీదులు కూల్చడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉన్మాదాన్ని పెంచడంపైనే దృష్టి సారించారని గుర్తు చేశారు. దేశభక్తి, జాతీయత, మతోన్మాదం పెంచి 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిచిందని చెప్పారు. గెలిచాక అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై కాకుండా ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, త్రిపుల్‌ తలాక్‌, దళితులు, క్రిస్టియన్లపై దాడులు, లవ్‌ జీహాద్‌ వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని వివ రించారు. అంతర్జాతీయంగా నయాఉదారవాద విధా నాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఆర్థికాభివృద్ధి ఆగితే ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుందని చెప్పారు. పిల్లల చదువులు, వైద్యం, జీవనం ఇలా అనేక సమస్యలు ముందుకొచ్చినపుడు ఆర్థిక జీవితం చిన్నాభిన్నం అయినపుడు ప్రజలు రోడ్లపైకి వస్తారని అన్నారు. మతోన్మాద ఎజెండా కొంత వరకే పనిచేస్తుందనీ చెప్పారు. వ్యవసాయం ప్రమాదంలో పడుతుందన్న అభిప్రాయంతో రైతులు పెద్దఎత్తున కదిలారని వివరించారు. నయా ఉదారవాద విధానాలను నికరంగా వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుల పట్ల ఆదరణ పెరుగుతుందని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.