Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టీకా డ్రైవ్‌ ప్రారంభం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

టీకా డ్రైవ్‌ ప్రారంభం

- తొలిరోజు దేశవ్యాప్తంగా 1,91,181 మందికి పంపిణీ
- వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- రాష్ట్రంలో 400 కేంద్రాల్లో 3962 మందికి టీకా
- వ్యాక్సిన్‌ వేసుకున్నా..... 42 రోజుల తర్వాతే రక్షణ
- అప్పటి వరకు జాగ్రత్తలు తప్పవు
నవతెలంగాణబ్యూరో-న్యూఢిల్లీ, హైదరాబాద్‌
కరోనా వైరస్‌కు విరుగుడుకు టీకాలు ఎప్పుడు వస్తాయని దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా శనివారం ఉదయం 10:30 గంటలకు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో.. ఒక్కో సెంటర్‌లో 100 మందికి చొప్పున వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించారు. తొలివిడతలో భాగంగా తొలిరోజు 1,91,181 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్టు పొందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తొలివిడతలో మూడు కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మంది దేశ ప్రజలకు టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది తర్వాత 50 ఏండ్లు పైబడిన, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.కాగా, శనివారం ప్రారంభమైన వాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ప్రభుత్వ యాంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. వాక్సిన్‌ తీసుకోనున్న వారి ఫోన్లకు అధికారులు ముందుగానే మెసెజ్‌లు పంపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే వ్యాక్సిన్‌ తొలి హక్కుదారులని మోడీ అన్నారు. వ్యాక్సిన్ల తయారీ కోసం చాలా మంది అవిశ్రాంతంగా శ్రమించారని తెలిపారు. కరోనా టీకా తయారీలో సైంటిస్టుల సేవలు ఎనలేనివని కొనియాడారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయనీ, త్వరలోనే మరిన్ని వ్యాక్సిన్లు కూడా తీసుకురానున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరని శాస్త్రవేత్తలు సూచించారనీ, రెండో డోసును మర్చిపోవద్దని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలనీ, టీకా వేసుకున్నప్పటికీ.. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. విదేశీ వ్యాక్సిన్ల కంటే దేశీయ వ్యాక్సిన్లే అతి తక్కువ ధరకు లభిస్తున్నాయన్నారు. వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ జగ్రత్తలు మరవొద్దని సూచించారు. ''కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతోమంది తల్లుల కడుపుకోతకు కారణమైంది'' అని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు ఖచ్చితంగా వేసుకోవాలన్నారు. రెండో డోసు వేసుకున్న తర్వాతనే.. కరోనాకు వ్యతిరేకంగా మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. టీకా వేసుకున్న తరువాత కూడా మాస్క్‌, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. 'సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడ్పడవోరు.. దేశం అంటే మట్టి కాదోరు.. దేశం అంటే మనుషులోరు.. తెలుగులో మహాకవి గురజాడ అప్పారావు చెప్పారు. గురజాడ చెప్పినట్లు పరుల కోసం మనందరం పాటుపడాలి.' అని అన్నారు.
తొలి టీకా ఇక్కడే...ఈయనకే
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సమక్షంలో తొలి టీకా వేశారు. కరోనాపై పోరులో ముందున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరైన మనీష్‌ కుమార్‌కు తొలి టీకా ఇచ్చారు. అనంతరం రణ్‌దీప్‌ గులేరియా, నిటి ఆయోగ్‌ సభ్యుడు వి.కె పాల్‌ సైతం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. తరువాత ముందుగా నిర్ణయించిన ప్రకారం.. వరుసగా ఇతర పారిశుద్ధ్య కార్మికులకు టీకా వేశారు.
రెండు టీకాలు ఉపయోగించిన 11 రాష్ట్రాలు !
దేశంలో తాజాగా ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ మొత్తం 3,351 సెషన్లలో కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం అత్యవసరానికి అనుమతించిన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ రెండు టీకాలను 11 రాష్ట్రాలు ఉపయోగించాయని తెలిపింది. వాటిలో అసోం, బీహార్‌, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక కోవిషీల్డ్‌ మాత్రమే ఉపయోగించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌, చంఢగీఢ్‌, దాద్రానగర్‌, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌, కేరళ, మణిపూర్‌, నాగాలాండ్‌, పుదుచ్చేరి, బెంగాల్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లు ఉన్నాయి. కరోనా కట్టడి కోసం దేశంలో శనివారం ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రపంచలోనే అతిపెద్ద టీకా కార్యక్రమమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. నిటి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ మాట్లాడుతూ.. టీకాపై అనుమానాలొద్దని అన్నారు. కోవాగ్జిన్‌కు తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని తెలిపారు.అలాగే, ఫైజర్‌, మోడెర్నా సంస్థల టీకాలు సైతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నాయని తెలిపారు.
ఉచితంగా టీకాలు ఇవ్వాలి
పేద ప్రజలకు ఉచితంగా కరోనా టీకాను అందించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు.
దేశంలో 116 న్యూ స్ట్రెయిన్‌ కేసులు
యూకేలో వెగులుచేసిన న్యూ స్ట్రెయిన్‌ కరోనా కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ రకం కేసులు 116 నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వైరస్‌ బారినపడిన వారిని ప్రత్యేక రూముల్లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మళ్లీ పెరుగుతున్న కరోనా
కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే..
కొత్త చట్టాలతో నష్టమే..
నీటి సంరక్షణపై దృష్టి సారించాలి
ఇంధన ధరల పెంపు ఇంతదారుణమా?
ఆహార సబ్సిడీకి కోతలు
విద్యా బడ్జెట్‌ను తగ్గించాయి
కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ ప్రదేశ్‌
చెన్నై కంపెనీపై ఐటీ దాడులు... రూ 220 కోట్ల నల్లధనం పట్టివేత
'మహా' అటవీశాఖ మంత్రి రాజీనామా..
అసోం అసెంబ్లీ ఎన్నికలు..
హర్ష్‌మందర్‌ పై రాజకీయ వేధింపులు ఆపండి
అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటుకు
కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌ ని కలిసిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌
మంచి నిర్ణయం
త్యాగాలే ఊపిరిగా...
ఎడాపెడా వాయింపే
మానవ హక్కుల స్వేచ్ఛకు భంగం
లూటీ సర్కార్‌...
ఒక్క డోసు రూ.250
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు
రాందేవ్‌ బాబాను అరెస్టు చేయాలి
తప్పిన ఆదాయ లెక్కలు !
వైరస్‌ పరిశోధనలో వెనుకే!
చిన్నారి భవిష్యత్తుకు కరోనా కాటు
మహిళపై ప్రభావం తీవ్రమే
మెగా ర్యాలీకి సిద్ధమైన బ్రిగేడ్‌
'టాయ్ ఫెయిర్‌'ను ప్రారంభించిన మోడీ
మరో ఇద్దరు స్టాండప్‌ కమెడియన్లకు బెయిల్‌
గుజరాత్‌లో ఫైర్‌ సేప్టీలేని భవనాలు 58 వేలకు పైనే

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.