Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
తిరస్క'రణం'.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

తిరస్క'రణం'..

- కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాల నిరాకరణ
- చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే
- ఢిల్లీలోనే కిసాన్‌ పరేడ్‌
- పోలీసులకు తెగేసి చెప్పిన నేతలు
- దేశవ్యాప్తంగా కవాతులు.. కదులుతున్న అన్నదాతలు
- 57వ రోజు కొనసాగిన ఆందోళన
- పది రైతు సంఘాలతో సుప్రీం కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ఏడాదన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. బుధవారం జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై గురువారం సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు ఢిల్లీలోని సింఘు సరిహద్దులో సమావేశమయ్యారు. రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు అమరులైన 147 మంది రైతులకు సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే, పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే చర్చల్లో తమ నిర్ణయాన్ని కేంద్ర మంత్రులకు రైతు సంఘాల నేతలు వివరించనున్నారు. చర్చలు మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో ప్రారంభమవుతాయి.
స్థాన మార్పు లేదు..
ఢిల్లీలోనే కిసాన్‌ పరేడ్‌ నిర్వహిస్తామని, అందులో స్థాన మార్పుకు అవకాశం లేదని రైతుసంఘాల నేతలు స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద రైతు సంఘాల నేతలతో ఢిల్లీ పోలీసులు చర్చలు జరిపారు. కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌ రూట్‌ మార్చాలని కోరారు. అందుకు రైతు సంఘాలనేతలు ససేమిరా అన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు బదులుగా కుండ్లి-మానేసర్‌-పాల్వాల్‌ (కేఎమ్‌పీ) ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. దానిని రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. పోలీసులతో సమావేశానికి హాజరైన రైతు నాయకుడు మాట్లాడుతూ ''మా ర్యాలీని ఢిల్లీ వెలుపల చేపట్టాలని కేంద్రప్రభుత్వం కోరుతుంది. కాని మేము దానిని ఢిల్లీ లోపల నిర్వహించాలనుకుంటున్నాము. నేటి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు'' అని అన్నారు. స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు యోగేంద్రయాదవ్‌ మాట్లాడుతూ ''మేము కిసాన్‌ పరేడ్‌ను శాంతియుతంగా ఢిల్లీ లోపల చేస్తాము. ఢిల్లీ వెలుపల ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. అది సాధ్యం కాదు'' అని అన్నారు. ఇలా వుండగా, రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా శాంతియుత నడుస్త్తున్నది. కర్నాటకలోని అనేక చోట్ల ట్రాక్టర్స్‌ ర్యాలీల ద్వారా రైతులు గణతంత్ర దినోత్సవానికి సిద్ధం అవుతున్నారు. కేరళలో చాలా చోట్ల రైతు ట్రాక్టర్‌ కవాతులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బిలాస్‌పూర్‌, రాంపూర్‌లలో రైతు ట్రాక్టర్‌ కవాతులు నిర్వహించారు. ఢిల్లీలో రైతు కవాతుకు సిద్ధమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రైతులు జనవరి 23న రాజ్‌ భవన్‌ను చుట్టుముట్టనున్నారు. ఒక బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఒడిశా నుంచి నడిచిన నవ నిర్మాణ్‌ కిసాన్‌ సంగథన్‌ రైతులు ఢిల్లీ చలో యాత్రను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు పదేపదే వేధిస్తున్నారు. మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంగథన్‌ నాయకత్వంలో రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు షాజహన్‌పూర్‌ సరిహద్దుకు చేరుకున్నారు. నయా
ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తోలుబొమ్మలు, పాటలతో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పశ్చిమబెంగాల్‌లో మహాపడావ్‌
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కత్తాలో మహా పడావ్‌ నిర్వహించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాపడావ్‌ గురువారం కలకత్తాలో ప్రారంభమైంది. ఏఐకేఎస్‌సీసీ నాయకత్వంలో జరుగుతున్న ఈ మహాపడవ్‌ వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొంటున్నారు. రాణి రష్మోని రోడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావాలే, జై కిసాన్‌ ఆందోళన్‌ నాయకుడు యోగేంద్ర యాదవ్‌, ఏఐకేఎస్‌సీసీ బెంగాల్‌ కన్వీనర్‌ అమల్‌ హల్దార్‌, బెంగాల్‌ కార్యదర్శి కార్తీక్‌ పాల్‌, వర్కింగ్‌ గ్రూప్‌ కార్యదర్శి అవిక్‌సాహా సహా పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వ వైఖరి తీరుపై మండిపడ్డారు. ప్రధాని మోడీ అంబానీ, అదానీల నేతృత్వంలోని కార్పొరేట్‌ లాబీ ముందు లొంగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని టీిఎంసి ప్రభుత్వ అవకాశవాద, రైతు వ్యతిరేక విధానాలపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. జనవరి 26న ఢిల్లీలో జరగబోయే కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌కు సంఘీభావంగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ట్రాక్టర్స్‌ మార్చ్‌ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పది రైతు సంఘాలతో సుప్రీం కమిటీ భేటీ..
కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ గురు వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదింపుల ప్రక్రియను ప్రారం భించింది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాలతో చర్చిం చింది. కమిటీ సభ్యులతో చర్చల్లో కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహా రాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పది రైతు సంఘాలు పాల్గొన్నాయని కమిటీ తెలిపింది. ''రైతు సంఘాలు ఈ చర్చలో పాల్గొన్నాయి. చట్టాల అమలును మెరుగుపరచడానికి సూచనలతో సహా వారి స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేశాయి'' అని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే చర్చల్లో పాల్గొన్న ఒక్క రైతు సంఘం కూడా రైతు ఆందోళనల్లో భాగస్వామ్యం కాకపోవడం గమనార్హం.
57 రోజు కొనసాగిన రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతున్నది. కొత్తగా అనేక మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం దోపిడీ...!
ఉక్కు ప్రయివేటు కానివ్వం
మనువాదం, హిందూత్వంతో మహిళా స్వేచ్ఛకు ముప్పు
నల్ల చట్టాలొద్దు..
ఏపీలో మహిళలపై ఖాకీ దమన కాండ
మహిళలే బీజేపీ టార్గెట్‌
మొండి బాకీలు పెరగొచ్చు
లైంగికదాడి బాధితురాలిపై కిరోసిన్‌ పోసి..
రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ పై పోలీసుల నజర్‌
ఇండియాలో అసాధారణంగా లింగ నిష్పత్తి
15 రాష్ట్రాలు..25 శాతం దిగువకు..పడిపోయిన ప్రభుత్వ వ్యయం
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
అలా అనలేదు..
'మొక్కలు నాటడంలో తెలంగాణది అగ్రస్థానం'
50 శాతం లోపు ఉండాలా.. వద్దా..
తప్పు చేస్తే.. శిక్షకు సిద్ధమే.. : తాప్సీ
నరేంద్ర సింగ్‌ తోమర్‌తో ఎర్రబెల్లి భేటి
ఢిల్లీకి చేరిన.. మహిళా రైతులు
రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి షురూ!
పెట్రో ధరల పెంపుపై సంజుక్త మోర్చా నిరసనలు
మీడియా స్వేచ్ఛను హరిస్తుంది !
సీఎం వేదిక అలంకరణకు ప్రభుత్వ టీచర్లు
బీజేపీ బాకాలకు డాన్స్‌ చేస్తున్న దర్యాప్తు సంస్థలు.... : విజయన్‌
పెరుగుతున్న కొత్త కేసులు..
విడుదలైన వరవరరావు
లెక్క చూపని ఆదాయం రూ.వెయ్యి కోట్లు
అధికారులను కర్రలతో చావబాదండి.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
అదుపులోకి 155 మంది రోహింగ్యాలు
ప్రయివేటీకరణ ప్రజలకు భారం
ట్విట్టర్‌ సీఈవో తొలి ట్వీట్‌ కు భారీ డిమాండ్‌ !

తాజా వార్తలు

12:13 PM

హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

12:00 PM

తల్లి నగ్న ఫొటోలు చూపించి..కూతురిపై లైంగికదాడి

11:45 AM

యాచకుడు మృతి..చేతి సంచిలో భారీగా డబ్బు చూసి షాక్

11:28 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర భారీగా పెంపు

11:17 AM

లాభాల్లో కొన‌సాగుతున్న‌ స్టాక్ మార్కెట్లు

11:07 AM

మరో రెండు రోజులు బ్యాంక్ OTP, ఇతర SMSలు రాకపోవచ్చు..!

10:57 AM

హైద‌రాబాద్‌లో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

10:46 AM

తిరుచ్చి ఎయిర్‌పోర్టు‌లో రూ.73ల‌క్ష‌ల బంగారం ప‌ట్టి‌వేత‌

10:44 AM

దేశంలో కొత్తగా 15,388 కొవిడ్‌ కేసులు

10:38 AM

వేలంలో రూ.510కోట్లు ప‌లికిన వైన్‌షాప్‌

10:28 AM

ములుగులో చిరుత కలకలం

10:25 AM

భారీగా పతనమైన బంగారం ధర..!

10:01 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:57 AM

కొత్తగా స్కూటర్‌కొనే వారికి బంపరాఫర్..!

09:46 AM

37 రోజుల ప‌సిబిడ్డ‌కు క‌రోనా పాజిటివ్

08:52 AM

రాత్రి నుంచి రోడ్లపైనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు!

08:38 AM

వ‌రంగ‌ల్ దారుణం..భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి..!

08:27 AM

చెట్టుపై తలపడిన చిరుతపులి..నల్ల చిరుతపులి

08:16 AM

రాజాసింగ్‌పై ఓయూ పీఎస్‌లో మరో ఫిర్యాదు

08:05 AM

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

07:47 AM

నేడు డీఎండీకే కార్యదర్శుల సమావేశం

07:42 AM

విజయవాడలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు భారీగా నగదు స్వాధీనం

07:29 AM

అనుంతపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

07:24 AM

28న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

07:20 AM

కొడవలితో భార్యను ముక్కలుగా నరికి..!

07:01 AM

ఒకే యువతిని ప్రేమించిన అన్నదమ్ములు..!

06:42 AM

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం

06:36 AM

గూడ్స్‌ రైలు ఢీకొని పులి పిల్ల మృతి

06:30 AM

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

09:53 PM

వాట్సాప్ మరో కొత్త నిబంధన..యూజర్స్ బీ అలర్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.