Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చర్చలు విఫలం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

చర్చలు విఫలం

- రైతు పోరాటం యథాతథం
- 18 నెలల ప్రతిపాదనను మించింది లేదు : తోమర్‌
- చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందే : రైతుసంఘాలు
- శాంతియుతంగా 26న కిసాన్‌ పరేడ్‌
- తదుపరి చర్చలపై సందిగ్ధం
కేంద్రంతో 11 సార్లు రైతు ప్రతినిధుల బృందం చర్చలు జరిగాయి. మొత్తం మీద 45 గంటలకు పైగా భేటీ అయినా సాగు వ్యతిరేకచట్టాలపై నాన్చుడు ధోరణినే కేంద్రం ప్రదర్శించింది. 11వ సారీ ఫలితం రాలేదు. చర్చలు అర్థంతరంగా ముగిశాయి. సుమారు రెండు నెలలకు పైగా సాగదీసిన మోడీ సర్కార్‌..సుప్రీం కోర్టుపైనే భారమేసి తప్పించుకునే మార్గాలు వెతికింది. కానీ ఆ పప్పులు ఉడకలేదు. ఏడాదికిపైగా చట్టాలను ఆపుతామంటూ పదోసారి జరిగిన చర్చలో కేంద్రం ముందుకొచ్చింది. ఇలా మోడీ వేసిన వ్యూహాన్ని రైతు సంఘాలు తిప్పికొట్టాయి. చివరగా శుక్రవారం జరిగిన చర్చల్లో...ఇక మేం ఏం చేయలేమంటూ కేంద్రమంత్రులు నరేంద్రతోమర్‌, పీయూశ్‌ గోయల్‌ మొండి చేయిచూపారు. మరోవైపు కిసాన్‌ పరేడ్‌కు దేశవ్యాప్తంగా బయలుదేరిన ట్రాక్టర్లు ఢిల్లీ సరిహద్దులకు చేరటానికి కొద్ది రోజులే మిగిలిఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ ఆందోళన కార్యాచరణను యథాతథంగా కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక విజ్ఞాన్‌భవన్‌లో రైతు సంఘాల నేతలతో కేంద్రప్రభుత్వం జరిపిన 11వ విడత చర్చలు విఫలమయ్యాయి. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన చర్చల ప్రక్రియ సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది. ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌, కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోంప్రకాశ్‌ హాజరవ్వగా, 40 మంది రైతుసంఘాల నేతలు పాల్గొన్నారు. హన్నన్‌ మొల్లా (ఏఐకేఎస్‌), గుర్నామ్‌ సింగ్‌ (బీకేయూ), శివ కుమార్‌ (మధ్యప్రదేశ్‌), మేజర్‌ సింగ్‌ పునివాలా (ఏఐకేఎస్‌, పంజాబ్‌), దర్శన్‌ పాల్‌, జగ్‌మోహన్‌ సింగ్‌, సత్‌నామ్‌ సింగ్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాలా, జగ్‌జీత్‌ సింగ్‌ దళ్లేవాల్‌, కవితా కూరగంటి, రాకేష్‌ తికాయత్‌, హర్బల్‌ సింగ్‌, అంచావతా, అభిమన్యుకుహర్‌ తదితర నేతలు హాజరయ్యారు. ఐదున్నర గంటల పాటు చర్చలు జరిగినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. మధ్యలో ఒకసారి విరామం మినహాయిస్తే అరగంటసేపు మాత్రమే చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి తోమర్‌ చట్టంలో లోపం లేకపోయినా ప్రతిపాదనలు చేశామని, 18 నెలల పాటు ఈ చట్టాల అమలును నిలిపివేసే ప్రతిపాదనను మించింది ఏదీ లేదన్నారు. దీనిపై రైతులు నిర్ణయం తీసుకోలే దన్నారు. రైతుల నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల నేతలు కేంద్ర
మంత్రులకు తెలిపారు. మరోవైపు, 10 నిమిషాల కన్నా మించి చర్చలు జరగలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. తదుపరి చర్చలు కొనసాగుతాయని కూడా తాము అనుకోవడంలేద న్నారు. తాము మాత్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకో వాలని డిమాండ్‌ చేసినట్టు చెప్పారు. కొన్ని గంటల తరువాత మళ్లీ కేంద్ర మంత్రులు వచ్చి ఇంతకన్నా మంచి ప్రతిపాదనలు చేయలేమని చెప్పారని, మాట్లాడుకొని వచ్చి చెబితే తదుపరి సమావేశానికి తేదీ ఖరారు చేస్తామని చెప్పారన్నారు. రిపబ్లిక్‌డే రోజున తలపెట్టిన పరేడ్‌ కోసం పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఆరోజు శాంతియుతంగా పరేడ్‌ నిర్వహిస్తామన్నారు.
విజయవంతం కాలేదు : దర్శన్‌పాల్‌
రైతు సంఘం నేత దర్శన్‌ పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ ''చర్చలు విజయవంతం కాలేదు. తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో తమకు తెలియదు. దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనల్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జనవరి 26న పరేడ్‌ రూట్‌ మ్యాప్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులతో మాట్లాడుతున్నాము. ఒకటి, రెండు రోజుల్లో ఖరారు అవుతుంది. ఢిల్లీకి సమీప ప్రజలు జనవరి 26న జరిగే పరేడ్‌ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో మేము విజయం సాధిస్తాం'' అన్నారు. చట్టాలు రద్దు చేస్తే మోడీ ప్రతిష్ట దిగజారుతుందని భావిస్తున్నారని ఏఐకేఏస్సీసీ సభ్యురాలు కవితా కురగంటి అన్నారు.
పాత ప్రతిపాదనలే : హన్నన్‌ మొల్లా
కేంద్ర ప్రభుత్వం పాత ప్రతిపాదనతోనే చర్చలకు వచ్చిందని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా అన్నారు. చర్చల్లో ఎటువంటి ఫలితమూ రాలేదని అన్నారు. రైతు సంఘాలన్ని సమావేశం అయ్యి చర్చించి, భవిష్యత్తు కార్యచరణ నిర్ణయిస్తామని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.