Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
- యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్పథ్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు అంజలి ఘటించారు. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్తో కలిసి జాతీయ యుద్ధ స్మారకం వద్దకు వచ్చిన ప్రధాని మోడీకి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. కరోనా నేపథ్యంలో జరిగిన సైనిక కవాతులో ఈసారి కంటిం జెంట్లలో ఉండే సైనికుల సంఖ్యను కుదించారు. ఆర్మీ, నేవీ బృందాల్లో 144మందికి బదులు, 96మందే పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నిబంధనల కారణంగా ఈసారి వేడుకల్లో కాస్త ఆర్భాటాలు తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ..త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన, శకటాల రూపంలో ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగాయి.