Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇంధన ధరలపై భగ్గుమన్న విపక్షాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

ఇంధన ధరలపై భగ్గుమన్న విపక్షాలు

- చమురు ధరలు తగ్గించడంలో కేంద్రం విఫలం
- ప్రధాని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేతలు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నడూ నమోదుకాని రీతిలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే, గృహ అవసరాలకు ఉపయోగించుకునే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దీంతో చమురు ధరలు భారం వాహనదారుల నడ్డి విరుస్తుండగా.. పెరిగిన సిలిండర్‌ ధరలు, నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజల్లో పొయ్యి వెలిగించకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో చమురు ధరలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలనీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల ధర్మసంకట పరిస్థితి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పేర్కొనడం పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. చమురుపై విధిస్తున్న సుంకం తగ్గించడంతో పాటు ఇంధన ధరలను అదుపుచేయడంలో మోడీ సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చమురుపై పన్నును తగ్గించాలని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌తో సహ పలు ప్రతిపక్షపార్టీలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాయి.
అంతర్జాతీయ కారణాలతోనే..: ధర్మేంద్ర ప్రధాన్‌
చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంపై సర్వత్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ''చమురు ఎగుమతి దేశాలు లాభాల కోసం ఇంధన ఉత్పత్తిని తగ్గించాయి. దీని కారణంగా డిమాండ్‌ పెరిగి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి'' అని పేర్కొన్నారు. అలాగే, ఇంధనంపై విధిస్తున్న పన్నులను ఆయన సమర్థించడం గమనార్హం. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా కొనాసాగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పన్నుపోటును తగ్గించండి: సోనియా గాంధీ
ప్రజలను కష్టాల్లోకి నెట్టి ప్రభుత్వం లాభపడుతున్నదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. రాజధర్మాన్ని అనుసరించాలనీ, ఇంధనంపై పన్నుపోటును తగ్గించాలని పేర్కొంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేయడం దోపిడి కంటే దారుణమైందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు భారాన్ని తగ్గించాలి కానీ వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయకూడదని హితవు పలికారు. ఏడేండ్లు అధికారంలో ఉన్న మోడీ సర్కారు.. సొంత ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మునుపటి పాలకులను నిందించటం అతి దారుణమైన విషయమని పేర్కొన్నారు.
అభివృద్ధి పేరిట బీజేపీ విధ్వంసం: అఖిలేష్‌ యాదవ్‌
అటు కేంద్ర, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అభివృద్ధి పేరిట ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నదని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. బీజేపీ హాయంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయనీ, యూపీ సీఎం యోగి స్వస్థలమైన గోరఖ్‌పూర్‌ సరిహద్దులో నివసిస్తున్న ప్రజలు ఇంధనం కోసం నేపాల్‌ వెళ్లాల్సిన దుస్థితిని బీజేపీ సృష్టించిందని విమర్శించారు. బీజేపీ ప్రస్తుతం దేశంలోని ప్రజలను ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి మంటల్లోకి నెట్టిందని ఆరోపించారు.
ప్రజల జీవితాలు ప్రభావితం: మాయావతి
దేశంలో చమురు ధరలు పెరుగుతుండటంపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ''చమురు సహా పలు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం ఆందోళనకరం. సామాన్య ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించాలి'' అని ట్వీట్‌ చేశారు.
మోడీ అచ్చెదిన్‌.. ప్రజలపై భారం మోపడమే.. :రాహుల్‌, ప్రియాంక
ప్రజలపై భారాన్ని మోపడమే మోడీ అచ్చెదిన్‌ అంటూ రాహుల్‌, ప్రియాంకలు ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, చమురు ధరలు పెరుగుదల వారిని మరింత క్రుంగదీసిందని ఆరోపించారు. అలాగే, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా చమురు ధరలు పెరగడాన్ని నిరసిస్తూ.. సైకిల్‌ తొక్కుతూ నిరసన తెలిపాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ
అమరుల త్యాగాన్ని వృథాకానివ్వం
గోప్యతకు తూట్లు!
బెంగాల్‌లో ఎనిమిది విడతలెందుకు?
కేరళలో ఐటీ ఉద్యోగులకు వెల్ఫేర్‌ ఫండ్‌
మహిళాహక్కుల పోరాటం...
దళిత కార్యకర్త నోదీప్‌ కౌర్‌కు బెయిల్‌
మూగ జీవులతోనూ డబ్బు!
సులభతర వాణిజ్యం ప్రభుత్వ లక్ష్యం
కమ్యూనికేషన్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు
నేడు, రేపు వ్యాక్సినేషన్‌ బంద్‌
నీరవ్‌ కోసం జైలు సిద్ధం!
వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌
'సింగమనేని'కి అంతిమ వీడ్కోలు
5న ఏపీ బంద్‌
హిమాచల్‌లో గవర్నర్‌ అడ్డగింత..
యూపీలో మహిళపై సామూహికంగా..
కార్పొరేట్ల లబ్దికే 'ఉక్కు' ప్రయివేటీకరణ
రాజధాని తరలింపు అసాధ్యం : శివాజీ
'మోడీజీ.. జాబ్‌ దో'
సోషల్‌ మీడియాపై..నియంత్రణ
పెట్రో, గ్యాస్‌..ధరలపై నిరసన
గళమెత్తితే నేరమా..!
మోడీ వచ్చాకే....
రూ.25 పెరిగిన వంటగ్యాస్‌
పని అధికం.. వేతనం అత్యల్పం

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.