Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనర్ను చితకబాది.. అరెస్ట్ చేసిన పోలీసులు
- బీహార్లో ఘటన
పాట్నా: కూరగాయలు ఉచితంగా ఇవ్వలేదన్న కోపంతో మైనర్ను చితకబాదిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన బీహార్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే... పాట్నాకు చెందిన ఓ కూరగాయల వ్యాపారి కుమారుడు (14) ఈ నెల 19న మార్కెట్లో వారి బండి వద్ద ఉండగా కొంతమంది స్థానిక పోలీసులు అక్కడికి వచ్చారు. తమకు ఉచితంగా కూరగాయలు ఇవ్వాలని ఆ బాలుడిని బెదిరించారు. కానీ, అతడు దీనికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన పోలీసులు.. మరుసటి రోజు వాళ్లింటికి వెళ్ళి అతడిని అరెస్ట్ చేశారు. అతడిని స్టేషన్కు తీసుకెళ్లి ఖాళీ కాగితం మీద సంతకం పెట్టాలని చితకబాదారు. ద్విచక్ర వాహనం దొంగతనం చేసిన కేసులో అతడిపై కేసు నమోదు చేసి పాట్నాలోని బేవూర్ జైలులో ఉంచారు. అతడి ఆధార్ కార్డు ప్రకారం 14 ఏండ్లే ఉన్నా పోలీసులు మాత్రం అతడికి 18 ఏండ్లు అని జైలులో బంధించారు. బాలుడిని కలవడానికి వెళ్లిన తండ్రికి అతడు జరిగిందంతా చెప్పడంతో ఆయన స్థానిక మీడియాను ఆశ్రయించాడు. ఇది మరుసటి రోజు పేపర్లలో రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దీనిపై 48 గంటల్లో నివేదిక సమార్పించాలని అధికారులను ఆదేశించారు.