Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకుడి ప్రశ్న
పాట్నా : దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడే సరిహద్దుల్లో శత్రుదేశంపై దాడులెందుకు జరుగు తున్నాయని బీహార్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అఖిలేశ్ సింగ్ ప్రశ్నించారు. పాట్నాలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు సర్జికల్ స్ట్రైక్స్ చుట్టూ తిరుగుతు న్నాయని అన్నారు. దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ జాతీయ భద్రతను ముందుకు తీసుకొస్తున్నదని ఆయన ఆరోపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఆదివారం జరిగిన దాడులు రెండు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిలేశ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. ఆర్మీలో దాడులకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ లేదని బదులిచ్చారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందనీ, ఆ పార్టీ 'సింగిల్ డిజిట్'కే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.