Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నేరగాళ్లే నాయకులైతే.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

నేరగాళ్లే నాయకులైతే..

- మహిళలకు రక్షణ ఉంటుందా..!
- మహిళలపై దారుణాలు.. నేర కేసుల్ని ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు లోక్‌సభలో 19 మంది..
- అన్ని పార్టీల తరఫున బరిలోకి దిగిన నేరచరిత అభ్యర్థులు 88 మంది
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ షాద్‌ నగర్‌లో దిశపై దారుణం..హత్య ఘటనపై పార్లమెంటులో అట్టుడికింది. గంటల తరబడి చర్చా జరిగింది. మహిళలపై దాడులకు సంబంధించి కఠిన చట్టం లేదనీ, అందరూ కలిసివస్తే మరింత కఠినమైన చట్టాలు తీసుకురావటానికి సిద్ధంగా వున్నామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. వినటానికి అంతా బాగుందనుకుందాం...కానీ దేశరాజధాని ఢిల్లీలోనే నిర్భయపై అమానుషం జరిగి ఏడేండ్ల తరువాత కూడా... ఇలాంటి స్టేట్‌మెంట్‌లను మనం వింటున్నాం. చట్టాలు చేస్తామంటున్నారు. మహిళలపై ఘోరాలు జరిగినప్పుడు గంటల కొద్దీ చర్చలు చేస్తున్నారు. మళ్ళీ షరా మామూలే... ఇది నాణేనికి ఓవైపు.. మరోవైపు మహిళలపై నేరాలకు పాల్పడిన వారు నాయకులైతే.. వారిని కాపాడేందుకు అధికారంలో ఉన్న పార్టీలు చేసిన ప్రయత్నాలు బోలెడున్నాయి. తనపై దారుణానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌పై కేసు పెట్టినందుకు బాధితురాలు నాన్నతో సహా సమీప బంధువులను కోల్పోవాల్సిన పరిస్థితి. బీజేపీ మాజీ ఎంపీ చిన్మయానంద్‌పై సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాధితురాలినీ జైల్లో పెట్టారు. ఆ కేంద్ర మాజీ మంత్రిపై కేసుపెట్టినా.. యోగి సర్కార్‌ బేఖాతరు చేసింది. చివరికి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు ప్రకటించింది. ఇలా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కొన్ని రాజకీయ పార్టీలు కాపాడటం ఒక ఎత్తయితే.. వారికి ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చి కొన్ని రాజకీయ పార్టీలు బరిలోకి దింపుతున్నాయి. నిందితులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి పోటీలో దింపుతున్న ఆ పార్టీలే.. ఇపుడు మహిళలను బరాబర్‌ రక్షించాల్సిందేనని మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశమవుతున్నది. ఓటు వేసే మహాశయులారా.. ఓటే మన ఆయుధం. ఓటు వేసేముందు బరిలోకి నిలిచే ప్రజాప్రతినిధి చరిత్రను ఒకసారి పరిశీలించండి. ఆయుధాన్ని సంధించండి అని సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తిచేస్తున్నారు. అలా చేయకపోవటంవల్లనే క్రిమినల్సే లీడర్ల అవతారం ఎత్తుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లోక్‌సభకు పోటీచేసిన వారు 88 మంది
మహిళలపై నేరాలకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న 88 మంది అభ్యర్థులను గత లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు పోటీలో నిలిపాయి. ఇందులో అధికార బీజేపీ అగ్రస్థానంలో వుంది. 15 మంది క్రిమినల్స్‌(మహిళలపై నేర కేసులున్న)కు ఆ పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. వారిలో 10 మంది ప్రస్తుత పార్లమెంటులోని లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇలాంటి నేరచరితులున్న 9 మంది అభ్యర్థులు ఎన్నికల గోదాలో దిగగా.. ఐదుగురు గెలిచి.. కాంగ్రెస్‌ రెండో స్థానంలో వున్నది. మొత్తం మీద మహిళలపై నేరాలకు పాల్పడిన 88 మంది అభ్యర్థుల్లో 19 మంది లోక్‌సభలో ఎంపీలయ్యారు. వారిలో ముగ్గురిపై తీవ్రమైన లైంగికదాడి ఆరోపిత కేసులున్నాయి. పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో 38 మందిపై కేసులున్నాయి. కాని వారందరూ ఎన్నికల్లో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్‌ ఈ గణాంకాలను వెల్లడించింది.
అసెంబ్లీల్లోనూ అదే తీరు
గత ఐదేండ్లలో 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 40,690 మంది అభ్యర్థులు పోటీచేశారు. వీరిలో 443 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. బీజేపీ నుంచి అత్యధికంగా 49 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసినవారు 41 మంది. పోటీచేసిన 443 మంది అభ్యర్థుల్లో 63 మంది ఎమ్మెల్యే పదవులను అలంకరించారు. గెలిచిన వారిలో 13 మంది బీజేపీ, 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మహిళలపై నేర చరిత కలిగినవారు కావటం గమనార్హ:.

పార్టీ మహిళలపై దారుణానికి పాల్పడిన
ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినవారు
బీజేపీ 49 13
కాంగ్రెస్‌ 41 14
బీఎస్సీ 22 0
శివసేన 11 2
ఎస్పీ 9 0
తృణమూల్‌ కాంగ్రెస్‌ 5 5

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాన్చుడే..
భారత్‌లో భారీగా విస్తరించిన ఆన్‌లైన్‌ లేబర్‌
విచారణ జరపాల్సిందే..
సుప్రీం కమిటీ నుంచి తప్పుకొంటున్నా..!
భారీగా రైతు ఆందోళన
పోరాటాల ముందు మోడీ జిమ్మిక్కులు పనిచేయవు
ఢిల్లీలో రైతుల దీక్షకు తెలంగాణ రైతుల మద్దతు
కాశ్మీర్‌ పర్యాటకం విలవిల
భారీగా రుణయాప్‌ల తొలగింపు
బీజేపీలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు
భోగిమంటల్లో నల్ల చట్టాలు
ఇది చట్టాల తిరస్కరణే : ఏఐకేఎస్‌సీసీ
టీకాకు నో ఆప్షన్‌ ..
బీహార్‌లో కిరాతకం...
మహారాష్ట్ర మంత్రిపై లైంగికదాడి ఆరోపణలు
వాట్సాప్‌ ప్రత్యామ్నాయాల వైపు చూపు
రుణ యాప్‌లపై ఆర్బీఐ అధ్యయనం
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేస్తే జీఎస్టీ పడుద్ది !
ఏం కావాలో వారికే తెలియదు: బీజేపీ ఎంపీ
దంతేవాడలో ఎన్‌కౌంటర్‌
సాగు చట్టాలపై స్టే
చట్టాల రద్దు కోరుతున్నాం.. స్టే కాదు : ఏఐకేఎస్‌సీసీ
ఛలో ఢిల్లీ ..
ఆగని మరణాలు..
గణేష్‌ శంకర్‌ విద్యార్ధి కన్నుమూత
వేల కి.మీ ప్రయాణించి...
48వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200
అనర్హులకు పీఎం కిసాన్‌
యూపీ లైంగికదాడి కేసు మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్‌

తాజా వార్తలు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

01:02 PM

ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

12:53 PM

వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

12:44 PM

బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి

12:05 PM

విహారం.. తీవ్ర విషాదం..

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.