Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగెల్
రాయ్ పూర్: జాతీయ సమస్యలపై అవగాహన, అధికార పక్షాన్ని ప్రశ్నించే పటిమ రాహుల్ గాంధీకే ఉన్నందనీ, కావున ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాగెల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్గాంధీకి ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందనీ, ప్రజలు కూడా ఆయనను ప్రేమిస్తారని తెలిపారు. కార్మికులంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారనీ, కావున రాహుల్గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని బాగెల్ అన్నారు. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ జరుగనున్నాయి.