Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ మొయినాబాద్లో ఏర్పాటు
- ఢిల్లీలో లోగో ఆవిష్కరించిన కేంద్ర మాజీమంత్రి రాజీవ్ ప్రతాప్రూడీ
న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల.. క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. 'గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్లెన్స్' పేరుతో ప్రారంభించనున్నట్టు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన లోగోను ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్రూడీ, బాక్సర్ విజేందర్సింగ్, రెజ్లర్ సుశీల్కుమార్ ఆవిష్కరించారు. తొలుత 14 బ్యాడ్మింటన్ కోర్టులతో అకాడమీని ప్రారంభించనున్నారు. తర్వాత మిగిలిన కొన్ని క్రీడలకు మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందించనున్నారు. అకాడమీ లోగో ఆవిష్కరణ సందర్భంగా గుత్తా జ్వాల మీడియాతో మాట్లాడారు. ''అమ్మానాన్నల ప్రోత్సా హంతో హైదరాబాద్లోని మొయినాబాద్ సుజాత విద్యాసంస్థలో అకాడమీ ఏర్పాటు చేశా. విశాలమైన మైదానంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పా టైంది. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేలా శిక్షణ ఇస్తాం. నైపుణ్యం ఉన్నవాళ్లకు మా అకాడమీలో తప్పకుండా ప్రాధాన్యం ఉంటుంది. బ్యాడ్మింటన్ తర్వాత స్మిమ్మింగ్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ సహా పలు క్రీడల్లో శిక్షణ ఇస్తాం'' అన్నారు.
దిశకు తగిన న్యాయం జరగలేదు
నా దృష్టిలో దిశకు సరైన న్యాయం జరగలేదని గుత్తా జ్వాల అన్నారు. ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు లైంగికదాడులను ఆపలేవని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు కల్పించి సమాజంలో మార్పు తెచ్చినపుడే లైంగికదాడులు తగ్గుతాయని చెప్పారు.