Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అగ్గిరాజేసే ప్రయత్నం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

అగ్గిరాజేసే ప్రయత్నం

- దేశంలో మత పరమైన విభజనకు మోడీ సర్కార్‌ కుట్ర : ప్రకాశ్‌ కరత్‌
- పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ధర్నా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తమ స్వార్థ రాజకీయాల కోసం మోడీసర్కార్‌ దేశంలో ప్రజల మధ్య అగ్గిరాజేయాలని యత్నిస్తుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ విమర్శించారు. దేశవ్యాప్తంగా మత పరమైన విభజనకు కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల మధ్య చీలిక తీసుకువచ్చి ఇష్టారీతిన చట్టాలు రూపొందిస్తుందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి ప్రకాశ్‌ కరత్‌ మాట్లాడారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం సమంజసం కాదన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం, సెక్యులరిజంపై తీవ్రమైన దాడి జరుగుతున్నదని చెప్పారు. బీజేపీ దాని సైద్దాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోనే ఈ దాడి ప్రణాళికపరంగానే జరుగుతుందన్నారు. దేశాన్ని మతపరంగా ముక్కలు చేయాలని చేస్తున్న చర్యలను తిప్పికొట్టాలని అన్నారు. ఆ చట్టంలోని వివాదాస్పద లైన్లను తొలగించాలని కరత్‌ డిమాండ్‌ చేశారు. అక్రమ చొరబాటుదారులను గత చట్టాల ప్రకారమే గుర్తించి పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు ప్రపంచ మానవ
హక్కుల దినోత్సవమని... కానీ, కాశ్మీర్‌ నుంచి కన్యా కుమారి వరకు పౌర హక్కులను ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇక ప్రభుత్వాలు మానవ హక్కులపై కపట మాటలు చెప్పి ఏమి లాభమని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇస్తున్నదని... కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. నిరుద్యోగ రేటు పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాల నుంచి దృష్టి మళ్ళించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ కార్యదర్శి కేఎం తివారీ, షెబా ఫరూకీ, మైమూనా మొల్లా, సిద్ధేశ్వర్‌ శుక్లా పాల్గొన్నారు.
పార్లమెంట్‌ ఆవరణలో వామపక్షాల ధర్నా
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో ధర్నా చేశారు. మంగవారం ఉభ యసభలు ప్రారంభం అయ్యే ముందు పార్లమెంట్‌ ఆవర ణంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపీిలు ఆందోళన చేపట్టా రు. ''పౌరసత్వంలో మత వివక్షను ఆపాలి. సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లు డౌన్‌ డౌన్‌. పౌరసత్వంలో మత ప్రాతిపదిక వద్దు'' అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ''తాము సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం. ఫాసిస్ట్‌ హిందూ రాష్ట్రంను వ్యతిరేకిస్తాం. మతోన్మాదం డౌన్‌ డౌన్‌'' అంటూ నినాదాలు హోరెత్తించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని ఎంపీలు మండిపడ్డారు. సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లులో పొందిపరిచిన అంశాలు మతాల మధ్య వివక్ష చూపుతున్నాయని, కొన్ని మతాల వారికి పౌరసత్వం ఇవ్వడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీలు కెకె రాగేష్‌, ఎలమరం కరీం, కె.సోంప్రసాద్‌, జర్నాదాస్‌ బైద్య, పీఆర్‌ నటరాజన్‌, ఏఎం ఆరీఫ్‌, సీపీఐ ఎంపీలు బినరు విశ్వం, కె. సుబ్బరాయన్‌ పాల్గొన్నారు.
నేడు రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు
లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు, బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లు పై చర్చ కోసం రాజ్యసభలో 6 గంటలు కేటాయించినట్టు తెలిసింది. లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ ఉన్నందున బిల్లు సులభంగానే ఆమోదం పొందింది. రాజ్యసభలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. అయినా అన్నాడీఎంకే, టీడీపీ, వైసీపీ, బీజేడీ, జేడీయూ తదితర పారీల మద్దతుతో బిల్లు గట్టేక్కెందుకు అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు మిగతా పార్టీలు విప్‌ జారీ చేశాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..
సీఎంల కమిటీ నివేదిక లేకుండానే
తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ
కరెంటు తీగలు తగిలి బస్సు దగ్ధం..
లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ చర్చలు
ట్రాక్టర్‌ ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు
అర్నబ్‌ సందేశాలపై జేపీసీ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్‌
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తీసేసుకుంటాం: ఉద్ధవ్‌ఠాక్రే
లేహ్‌లోని 20 మంది ఐటీబీపీ ఆరోగ్య సిబ్బందికి టీకా
జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్‌ ఆహ్వానం
త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

తాజా వార్తలు

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.