Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉభయసభల్లో దుమారం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 14,2019

ఉభయసభల్లో దుమారం

- 'మేక్‌ ఇన్‌ ఇండియా కాదు..
- రేప్‌ ఇన్‌ ఇండియా' అన్న రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడి ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇటీవల జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. ఉభయసభలు జరగకుండా బీజేపీ ఎంపీలు ఆటంకం కలిగించారు. బీజేపీ ఎంపీల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం నెలకొంది. రెండు, మూడు సార్లు వాయిదా పడిన తరువాత, చివరికి పూర్తిగా సమావేశాలను ముగించారు. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే, బీజేపీ ఎంపీలు రాహుల్‌ వ్యాఖ్యలను లేవనెత్తారు.
''మేకిన్‌ ఇండియాను.. రేప్‌ ఇన్‌ ఇండియా'తో పోల్చుతూ ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్‌ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం?'' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. బీజేపీ ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి వెల్‌ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ''ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి మేకిన్‌ ఇండియాను అత్యాచారాలతో పోల్చడం చాలా విచారకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు నైతికంగా సభలో ఉండే హక్కు లేదు'' అని అన్నారు.
డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ''ప్రధాని నిత్యం మేకిన్‌ ఇండియా గురించి చెబుతుంటారు. మేకిన్‌ ఇండియాపై మాకు గౌరవం ఉంది. కానీ వాస్తవంగా దేశంలో ఏం జరుగుతోంది? రాహుల్‌ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదే. దురదృష్టవశాత్తు మేకిన్‌ ఇండియా జరగట్లేదుకానీ, నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఇది చాలా ఆందోళన చెందాల్సిన విషయం'' అని కనిమొళి తెలిపారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు బీజేపీ ఎంపీలు అరుపులు, కేకలు పెట్టారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎంతమాత్రం క్షమాపణలు చెప్పనని, రాహుల్‌ గాంధీ వెల్లడించారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి
రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. తొలుత సభలో చైర్మెన్‌ ఎం.వెంకయ్యనాయుడు పార్లమెం ట్‌పై ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీరులకు సంతాపం తెలుపుతూ నివాళి అర్పించారు. అనంతరం జీరో అవర్‌ ప్రారంభించారు. ఇద్దరు సభ్యులు జీరో అవర్‌లో మాట్లాడిన తరువాత బీజేపీ, ఎన్డీఏ భాగస్వామి అన్నాడీఎంకే చెందిన నలుగురు మహిళ ఎంపీిలు ఈ అంశాన్ని లేవనెత్తారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మెన్‌ ఎన్ని సార్లు చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు వినిపించు కోలేదు. ఈశాన్య భారతం తగలపడిపోతుందని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లా డుతూ అసోంతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో తీవ్రమైన హింస జరుగు తుందని, ముగ్గురు చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం దీనిపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు,
మోడీయే క్షమాపణ చెప్పాలి: రాహుల్‌
దీనిపై రాహుల్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుపై జరుగున్న హింసాత్మక ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ రకమైన పన్నాగం పన్నిందని వెల్లడించారు. బేటీ బచావో, ..బేటీ పడావో అంటున్న మోడీ.. ఎవరి నుంచి రక్షించాలో చెప్పలేదనీ, నిజానికి బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బాలికలను రక్షించాలని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన మోడీయే క్షమాపణ చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్నిదారులు ఢిల్లీ వైపే
భోపాల్‌ లో లాఠీచార్జ్‌
రికార్డు స్థాయికి చమురు ధరలు
నూతన ఆలోచనా ధోరణి అవసరం
హల్వాతో కసరత్తు షురూ..
లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం
ఢిల్లీ చేరుకునేందుకు ఇన్ని అడ్డంకులా..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహాపడావ్‌ ముంబయికి బయలుదేరిన అన్నదాతలు
నిరుద్యోగ సంక్షోభాన్ని నివారించాలి
భద్రత పేరుతో మహిళలపై కెమెరాలతో నిఘా!
మార్చి, ఏప్రిల్‌ నాటికి పాత నోట్లకు చెల్లు చీటీ
అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం
నేతాజీ జయంతి రోజున పోటా పోటీ
ఏపీలో పంచాయతీ పంతం
ఆ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి: బాంబే హైకోర్టు
హిందూమహాసభ నాయకుడిపై ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరణ
వాయువ్య భారత్‌ ను కమ్మేయనున్న మంచు
ఏడు రోజుల్లో 14 లక్షల మందికి కరోనా టీకా
గత ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించాయి
ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌నాధ్‌ కు జైలుశిక్ష
పీఎం కిసాన్‌ పథకం 11.2లక్షల లావాదేవీలు విఫలం
కరోనా టీకాపై భయాన్ని పోగొట్టాలి : మోడీ
చర్చలు విఫలం
ఆగని పెట్రో బాదుడు
రైతు నేతలే టార్గెట్‌..!
అహంకార పూరితం..
మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి
ఐసీడీఎస్‌కు నిధులు పెంచాలి
పంజాబ్‌లో బీజేపీకి గడ్డుపరిస్థితి
ఆర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ లీకైనా... మౌనమేనా?

తాజా వార్తలు

11:55 AM

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై 10 , 5 కె రన్లు

11:52 AM

ఏపీలో విషాదకర ఘటన..

11:52 AM

అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

11:40 AM

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం..

11:29 AM

లాటరీలో రూ.7,300 కోట్లు గెలుచుకున్నాడు

11:27 AM

తెలంగాణలో 26 ఏళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు

11:14 AM

ద్ర‌విడ్ నాకు చేసిన సూచ‌న‌లను ఇంగ్లాండ్ జ‌ట్టు పాటించాలి..

10:59 AM

తెలంగాణలో 197 పాజిటివ్ కేసులు

10:57 AM

విద్యార్ధుల తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!

10:55 AM

కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ విజయలక్ష్మి మృతి

10:50 AM

రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌కు హెచ్చ‌రిక‌లు స‌రికాదు: ఐవైఆర్

10:45 AM

దేశంలో కొత్త‌గా 14,849 మందికి కరోనా

09:42 AM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

09:14 AM

హైదరాబాద్ లో విషాదం..

08:47 AM

రాజమండ్రిలో 20 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

08:21 AM

తగ్గిన బంగారం ధరలు..

08:15 AM

జులై 17వరకు కరోనా ఆంక్షల అమలు

07:41 AM

అమెజాన్ ప్రైమ్‌లో విజయ్ 'మాస్ట‌ర్'..!

07:13 AM

తిరుమలలో పెరిగిన రద్దీ

07:11 AM

అఖిలప్రియతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

06:54 AM

ఫాక్లాండ్ దీవుల్లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.