Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మీ ఇంటికొస్తాం.. దాడి చేస్తాం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

మీ ఇంటికొస్తాం.. దాడి చేస్తాం

- విద్వేష రాజకీయాలకు మోడీ-నెతన్యాహు-ట్రంప్‌ ఆజ్యం
- 'సరిహద్దు భద్రతే' ఎన్నికల్లో ప్రధానాంశం
- అంతర్జాతీయ సదస్సుల్లో శాంతి వచనాలు
- ప్రజా సమస్యలు పక్కదారి..
న్యూఢిల్లీ : దేశాలు, ప్రాంతాలు వేరైనా భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ఎన్నికల వేళ ఒకేదారిలో పయనిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు.. దేశంలో విపత్కర పరిణామాలు సంభవించినప్పుడు.. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయి పాలకుల మీద వ్యతిరేకత తీవ్రమైన ప్రతిసారి ఈ ముగ్గురు నేతలు 'జాతీయ భద్రత'ను ముందుకు తీసుకువస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమ ప్రత్యర్థి దేశాల మీద బాంబులు కురిపిస్తూ.. 'మీ ఇంట్లోకి ప్రవేశించి మరీ దాడి చేస్తాం' అంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సఫలం అవుతున్నారు. భారత్‌లో గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ, ఇజ్రాయిల్‌ ఎన్నికల్లో నెతన్యాహు అదే బాటను అనుసరించగా.. తాజాగా వీరిరువురి ప్రియ మిత్రుడు ట్రంప్‌ సైతం అదే బాటన నడుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్‌లో 2019 సాధారణ ఎన్నికలకు ముందు భారత్‌.. పూల్వామా దాడులకు ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న బాలాకోట్‌లో వాయుదాడులు (ఎయిర్‌స్ట్రైక్స్‌) చేసింది. ఇందులో ఎంతమంది మరణించారన్నదానిపై ఇప్పటికీ ఇరుదేశాలూ ప్రకటించలేదు. కానీ, మార్చిలో మొదలైన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్న ప్రతి ప్రచార సభలోనూ సరిహద్దు భద్రత అంశాన్ని ప్రస్తావించారు. బెంగాల్‌లోని రనఘట్‌లో ఏప్రిల్‌ 24న జరిగిన సభలో మోడీ.. 'నవ భారతదేశానికి కావాల్సిందేమిటి..? ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడే సమర్థవంతమైన నాయకుడ్ని దేశం కోరుకుంటున్నది' అని అన్నారు. యూపీలోని బహ్రెయిచ్‌లో ఏప్రిల్‌ 30న మాట్లాడుతూ.. 'ఈరోజు ప్రతి ఉగ్రవాది భారత్‌కు మోడీ ప్రధానిగా ఉన్నాడని భయపడుతున్నాడు' అని చెప్పారు. వీటితో పాటు ఆ రెండున్నర నెలల్లో మోడీ పాల్గొన్న ఎన్నికల సభల్లో, చేసిన ట్వీట్‌లోనూ పాక్‌ను ఉద్దేశిస్తూ.. 'మీ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేస్తాం' అని తెలిపారు. ఇక బీజేపీ బృందమైతే 'మోడీ తప్ప ఈ దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరు' అనే స్థాయిలో ప్రచారం సాగించింది.
మోడీ మాదిరే ఇజ్రాయిల్‌లో నెతన్యాహూ శత్రుదేశాల్లో బాంబుల వర్షం కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య మీద అవినీతి ఆరోపణలు రావడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి.. గతేడాది ఆగస్టు 25న 24 గంటల వ్యవధిలోనే సరిహద్దు దేశాలైన సిరియా, లెబనాన్‌, ఇరాక్‌ల మీద ఇజ్రాయిల్‌ బాంబులు వేసింది. పాలస్తీనా మీద విచక్షణ లేకుండా డ్రోన్‌ దాడులకు తెగబడింది. సిరియా అంతర్గత మిలిటరీ స్థావరాలపైనా అదే రీతిలో దాడులు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు.. ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిమ్‌ సులేమానితో పాటు, ఇస్లామిక్‌ దేశాల నాయకుల మీద విమర్శల దాడి చేసి లబ్ది పొందారు.
ఇక తాజాగా వీరి పెద్దన్న ట్రంప్‌ సైతం అదే బాటలో పయనిస్తున్నారు. మొదటినుంచి ముస్లింలంటేనే అగ్గి మీద గుగ్గిల్లమయ్యే ట్రంప్‌.. మధ్య, పశ్చిమాసియాలో ఉన్న ఇస్లామిక్‌ దేశాల మీద దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతాననీ, వలసదారులను అమెరికానుంచి వెళ్లగొడతానని అంటున్నారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్‌పై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్‌ వ్యవహరాల్లో తలదూర్చి ఉన్న అగ్రరాజ్యం.. ఆ దేశ సైనికదళాధిపతి సులేమానిపై ఈనెల 3న దాడికి తెగబడి హత్య చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తుతం ట్రంప్‌ అనుకూల మీడియా అమెరికాలో ప్రచారం చేస్తున్నది.
ఈ మూడు దేశాల విదేశాంగ విధానాలు భిన్నంగా ఉన్నా ఈ దేశాధినేతల చర్యలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలిచినా.. వారి ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయమై అంతర్జాతీయ రాజకీయ పరిశీలకురాలు సారా జుకెర్మన్‌ డాలి స్పందిస్తూ.. 'కయ్యానికి కాలుదువ్వే నాయకులు తరుచుగా శాంతి వచనాలు చేస్తూ భద్రతా అంశాన్ని తమ సమర్థతకు వాడుకుంటారు. ఎన్నికల్లో వీరు జాతీయ భద్రత అంశాలను లేవనెత్తి లబ్ది పొందుతారు' అని తెలిపారు. ధైర్యం, హింస అనే విషపూరిత మిశ్రమాన్ని వారు ప్రజల మీద చల్లుతారని విమర్శలు చేశారు. అయితే ఇలాంటి చర్యలు విభజనవాదాన్ని ప్రోత్సహిస్తాయని ఆమె హెచ్చరించారు.
తాజా పరిణామాలూ అలాగే ఉన్నాయి. భారత్‌లో ఏ సమస్య ఉత్పన్నమైనా మోడీ పాక్‌ వైపు వేలు చూపిస్తుండగా.. నెతన్యాహు పాలస్తీనాను దోషిగా నిలబెడుతున్నారు. ఇక ట్రంప్‌ అయితే బాహాటంగానే ప్రపంచ ముస్లిం దేశాలపై యుద్ధం ప్రకటిస్తున్నారు. భారత్‌లో కొంతకాలంగా ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూస్తున్నది. మందగమనంతో కీలకరంగాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి రంగాలు దెబ్బతింటున్నాయి. అయినా కేంద్ర సర్కారు మాత్రం ఎన్నార్సీ, ఎన్పీఆర్‌, సీఏఏ పేరుతో దేశంలో విభజన రాజకీయాలకు తెరలేపింది. నెతన్యాహు, ఆయన భార్యల మీద అవినీతి ఆరోపణల కత్తి వేలాడుతూనే ఉంది. ట్రంప్‌పై ఇటీవలే అభిశంసన అభియోగాలు నమోదయ్యాయి. అయినా కూడా ఈ నాయకులు ప్రత్యర్థి దేశాలను బూచీగా చూపిస్తున్నారే తప్ప ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో దారుణంగా విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. తమ భవిష్యత్తుపై కోట్లాది ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలను ఈ నాయకులు తుంగలో తొక్కుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భోగిమంటల్లో నల్ల చట్టాలు
ఇది చట్టాల తిరస్కరణే : ఏఐకేఎస్‌సీసీ
టీకాకు నో ఆప్షన్‌ ..
బీహార్‌లో కిరాతకం...
మహారాష్ట్ర మంత్రిపై లైంగికదాడి ఆరోపణలు
వాట్సాప్‌ ప్రత్యామ్నాయాల వైపు చూపు
రుణ యాప్‌లపై ఆర్బీఐ అధ్యయనం
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేస్తే జీఎస్టీ పడుద్ది !
ఏం కావాలో వారికే తెలియదు: బీజేపీ ఎంపీ
దంతేవాడలో ఎన్‌కౌంటర్‌
సాగు చట్టాలపై స్టే
చట్టాల రద్దు కోరుతున్నాం.. స్టే కాదు : ఏఐకేఎస్‌సీసీ
ఛలో ఢిల్లీ ..
ఆగని మరణాలు..
గణేష్‌ శంకర్‌ విద్యార్ధి కన్నుమూత
వేల కి.మీ ప్రయాణించి...
48వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200
అనర్హులకు పీఎం కిసాన్‌
యూపీ లైంగికదాడి కేసు మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్‌
వాయు కాలుష్యంతో గర్భంలోనే గండం
విదేశీ కార్పొరేట్లకు బీమాలో ఎర్రతివాచీ..!
యూపీలో మరో కిరాతకం
ఆపుతారా.. స్టే ఇవ్వాలా!
పెరుగుతున్న ప్రభంజనం..
టీచర్లపై ఉక్కుపాదం
మోడీ హయాంలో ఎగవేతల మోత
3 కోట్లమందికి ఉచితంగా వ్యాక్సిన్‌
కోహ్లీ ఇంట పండంటి ఆడబిడ్డ
తాగడానికి నీళ్లు అడిగి.. సామూహిక లైంగికదాడి

తాజా వార్తలు

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.