Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నిర్మల్ కుమార్ దర్శకత్వంలో శ్రీరామరాజు, భరత్రామ్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మిస్ మ్యాచ్'. శుక్రవారం సినిమా విడుదలైన నేపథ్యంలో శనివారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, 'శుక్రవారం మూడు మ్యాచ్ల్లో గెలిచాం. ఒకటి 'దిశ' నిందితుల ఎన్కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్లో గెలవడం, మూడు మా సినిమా సక్సెస్ కావడం. సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 'తొలిప్రేమ'లోని 'ఈ మనసే..' పాటకి థియేటర్లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్టన్కి థ్యాంక్స్. అలాగే కెమెరామెన్ గణేష్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు. సినిమాని థియేటర్లో చూసి మరింతగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'చిన్న సినిమాకి ఇంతటి స్పందనని ఊహించలేదు. తెలుగు ఆడియెన్స్కి పెద్ద థ్యాంక్స్. జీవీజీగారికి, ఉదరుకి, ఐశ్వర్యకి, నిర్మాతలకు ధన్యవాదాలు' అని దర్శకుడు నిర్మల్ కుమార్ చెప్పారు. నిర్మాత శ్రీరామరాజు చెబుతూ, 'నిర్మాతగా మా తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజారు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని ఆడియెన్స్ని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'సినిమాకి కథే హీరో. మంచి కథ అందించిన భూపతి రాజా అసలైన హీరో. మహిళా సాధికారతని తెలియజేసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఇప్పటికే సినిమాకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రోజు రోజుకి పెరుగుతుంది. అది మరింతగా పెరగాలి' అని మాటల రచయిత రాజేంద్రకుమార్ చెప్పారు. కథా రచయిత భూపతి రాజా చెబుతూ, 'ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం. విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట్రామారావు, శ్రీరామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.